ప్రపంచాన యుద్ధమేఘాలు.. బలమైన భాజపా సర్కార్ అవసరం
ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
మన పొరుగుదేశం రొట్టెలపిండి కోసం పాట్లు పడుతోంది
మధ్యప్రదేశ్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని
దమోహ్ (మధ్యప్రదేశ్): ప్రపంచంలో ప్రస్తుతం యుద్ధమేఘాలు ఆవరించాయని, ఈ పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు కాపాడాలంటే కేంద్రంలో బలమైన, స్థిరమైన భాజపా ప్రభుత్వం అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మధ్యప్రదేశ్లోని దమోహ్లో శుక్రవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ.. పశ్చిమాసియా దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ పేరెత్తకుండా ‘‘ఉగ్రవాదులను సరఫరా చేసే మన పొరుగు దేశమొకటి, నిత్యావసరమైన రొట్టెల పిండి కోసం నేడు పాట్లు పడుతోంది’’ అని విమర్శించారు. మన రక్షణరంగాన్ని బలహీనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఫ్రాన్స్ తయారీ రఫేల్ యుద్ధ విమానాలు భారత్కు రావడం ఇష్టం లేదని మోదీ విమర్శలు గుప్పించారు.
‘ఇద్దరు యువరాజుల జోడీ’ ఫ్లాప్ సినిమా
అమ్రోహా (యూపీ): లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీల జోడీపై ప్రధాని మోదీ సినీ పరిభాషలో ధ్వజమెత్తారు. ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహాలో శుక్రవారం ఎన్నికల ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఎస్పీ, కాంగ్రెస్ల మధ్య పొత్తును ప్రస్తావిస్తూ ‘‘ఇద్దరు యువరాజుల జోడీ (దో షెహజాదేకీ జోడీ) సినిమా షూటింగు ఇక్కడ జరుగుతోంది. వారిద్దరి చిత్రాన్ని యూపీ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు’’ అని ఎద్దేవా చేశారు. అమ్రోహా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న సిట్టింగ్ ఎంపీ దానిశ్ అలీని కూడా ప్రధాని వదల్లేదు. ‘‘ఇక్కడ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థికి ‘భారత్ మాతా కీ జై’ అని చెప్పడం కూడా కష్టం. ఇలాంటి వ్యక్తి భారత పార్లమెంటులో అవసరమా?’’ అని ప్రశ్నించారు. బాబ్రీ మసీదు కేసులో కక్షిదారుగా ఉన్న ఇక్బాల్ అన్సారీ అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠకు పిలిస్తే వచ్చారని.. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు మాత్రం తిరస్కరించాయని దుయ్యబట్టారు. ద్వారకలో శ్రీకృష్ణుని పూజించేందుకు తాను సముద్రం అడుగుకు వెళితే, కాంగ్రెస్ యువరాజు అక్కడ ఏమీలేదని ప్రజల విశ్వాసాలను కించపరిచారన్నారు.
తల్లి చిత్రం చూసి భావోద్వేగం.. ప్రసంగం ఆపిన ప్రధానమంత్రి
దమోహ్ ఎన్నికల సభలో ఓ యువకుడు ప్రదర్శించిన పెన్సిల్ చిత్రాన్ని చూసి మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. ప్రధాని మోదీని ఆయన మాతృమూర్తి హీరాబెన్ ఆశీర్వదిస్తున్న చిత్రమది. ఈ సందర్భంగా మోదీ తన తల్లిని గుర్తుచేసుకొని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపారు. చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందిస్తూ ఫొటో వెనుక అతని పేరు, చిరునామా రాసిస్తే తాను లేఖ రాస్తానని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లాలూ కుమార్తెపై లాలూ పోటీ..!
లాలూప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్యపై లాలూ పోటీ చేస్తున్నారు. ఇది వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా.. దీనివెనక ఒక ఆసక్తికర విషయం ఉంది. -
ప్రియాంకా గాంధీ.. ఎందుకు పోటీ చేయట్లేదు?
లోక్సభ ఎన్నికల్లో ప్రియాంకా గాంధీ పోటీకి దూరంగా ఉండడానికి కారణం ఏమై ఉండవచ్చన్న అంశంపై చర్చ నడుస్తోన్న క్రమంలో ఆ పార్టీ స్పందించింది. -
‘వారసత్వం కాదు.. బాధ్యత’: రాహుల్ రాయ్బరేలీకి మారడంపై కాంగ్రెస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ అమేఠీ నుంచి రాయ్బరేలీకి మారడంపై విమర్శలు వస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది. దీనిపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. -
రాయ్బరేలీ నుంచి నామినేషన్ వేసిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. -
చెప్పానుగా.. కొత్త సీటు వెతుక్కుంటారని: రాహుల్పై మోదీ సెటైర్
రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీపై ప్రధాని మోదీ నుంచి స్పందన వచ్చింది. -
చివరి మొగల్ చక్రవర్తిలా రాహుల్ గాంధీ మిగిలిపోతారు..: భాజపా
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులపై సస్పెన్స్ వీడింది. దీంతో భాజపా రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. -
25 ఏళ్లలో తొలిసారి.. అమేఠీని వదులుకున్న గాంధీలు..!
Amethi: అమేఠీ నియోజకవర్గం నుంచి కిశోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. హస్తానికి మంచి పట్టున్న ఈ స్థానంలో గాంధీ కుటుంబసభ్యులు పోటీలో లేకపోవడం 25 ఏళ్లలో ఇదే తొలిసారి. -
రాయ్బరేలీ బరిలో రాహుల్ గాంధీ.. అమేఠీ నుంచి కిశోరీ లాల్
Rahul Gandhi: రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలోకి దిగుతున్నట్లు ఏఐసీసీ శుక్రవారం ప్రకటించింది. -
రిజర్వేషన్లను రహస్యంగా లాక్కొంటున్న మోదీ సర్కార్: రాహుల్ గాంధీ
ప్రైవేటీకరణను గుడ్డిగా అమలు చేస్తూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మోదీ ప్రభుత్వం రహస్యంగా లాక్కుంటోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. -
ముందుగా చెప్పకుండానే అవకాశం..
కొన్నేళ్ల క్రితం ఓ యువకుడు తన సంగీతం, రచనలతో ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించారు. ఆ తర్వాత అందరూ ఆ విషయం మర్చిపోయారు. -
రాజ్పూత్లను శాంతపరిచేందుకు మోదీ కృషి
గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్కోట్ లోక్సభ అభ్యర్థిగా పోటీచేస్తున్న కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలపై ఆగ్రహంతో ఉన్న రాజ్పూత్ (క్షత్రియ) వర్గాన్ని శాంతపరిచే చర్యలకు పూనుకున్నారు. -
నాకు ఎన్ని ఓట్లు వస్తే అన్ని మొక్కలు నాటుతా
పశ్చిమ బెంగాల్లోని ఘటల్ లోక్సభ నియోజకవర్గం నుంచి తృణమూల్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ బెంగాలీ నటుడు దేవ్ అలియాస్ దీపక్ అధికారి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
ఈసీపై విశ్వాసం ఉంచండి
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో సమస్యాత్మకంగా మారిన డీప్ఫేక్ వీడియోల అంశాన్ని ఎన్నికల సంఘం(ఈసీ) సమర్థంగా పరిష్కరించగలదన్న విశ్వాసాన్ని దిల్లీ హైకోర్టు వ్యక్తం చేసింది. -
సర్వేలు, పథకాల లబ్ధి సాకుతో ఓటర్ల వివరాల సేకరణపై ఈసీ ఆగ్రహం
ఎన్నికల అనంతరం వివిధ పథకాల ద్వారా ప్రయోజనం చేకూర్చుతామంటూనో, సర్వేల సాకుతోనో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న రాజకీయ పార్టీలు, అభ్యర్థులపై ఎన్నికల సంఘం (ఈసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బ్రిజ్ భూషణ్ను పక్కనపెట్టిన భాజపా
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్కు ఈ లోక్సభ ఎన్నికల్లో టికెట్ దొరుకుతుందా? లేదా? అన్న ప్రశ్నకు తెరపడింది. -
కురుక్షేత్ర భాజపా అభ్యర్థి నవీన్ జిందాల్ ఆస్తులు.. రూ.వెయ్యి కోట్లు
హరియాణాలోని కురుక్షేత్ర లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ (54) గురువారం తన నామినేషను పత్రాలు దాఖలు చేశారు. -
ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ అసత్య ప్రచారం
అసత్య ప్రచారాలతో సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ ప్రవర్తిస్తోందని భాజపా ఆరోపించింది. భాజపాకు 400 సీట్లిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలు చేస్తోందని పేర్కొంటూ గురువారం ఎన్నికల సంఘానికి (ఈసీ) కాషాయ పార్టీ ఫిర్యాదు చేసింది. -
రాహుల్ను ప్రధాని చేయాలని పాకిస్థాన్ తహతహ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజును భారత్కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. -
మహిళలకు మోదీ క్షమాపణ చెప్పాలి
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళలపై లైంగిక దాడికి తెగించాడు. ఆయన తరఫున సభ నిర్వహించి, ఓట్లడిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని మహిళలకు క్షమాపణ చెప్పాలి’అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ డిమాండు చేశారు. -
ప్రతి భారతీయుడూ కాంగ్రెస్ ఓటుబ్యాంకే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ఎదురుదాడికి దిగారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదు. భారత్జోడో యాత్ర చేపట్టిన రాహుల్గాంధీ- ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 తర్వాత ‘కాంగ్రెస్ ఢూండో’ (కాంగ్రెస్ను వెతకండి) యాత్ర చేపట్టాల్సి వస్తుంది.
తాజా వార్తలు
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం