కాంగ్రెస్ కబళించే తీగ
కాంగ్రెస్ పార్టీ వేర్లు, భూమితో సంబంధం లేని ఓ తీగ లాంటిదని.. అది తనకు అండగా నిలిచినవారినే ఎండగట్టి కబళిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ
నాందేడ్/పర్భణీ: కాంగ్రెస్ పార్టీ వేర్లు, భూమితో సంబంధం లేని ఓ తీగ లాంటిదని.. అది తనకు అండగా నిలిచినవారినే ఎండగట్టి కబళిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. శనివారం మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతానికి చెందిన నాందేడ్, పర్భణీ ఎన్నికల ర్యాలీల్లో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్పై మాటల దాడిని కొనసాగించారు. ఆ పార్టీ లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే ఓటమిని అంగీకరించిందన్నారు. 2019లో అమేఠీ నుంచి ఓడిపోయిన కాంగ్రెస్ యువరాజు ఈసారి వయనాడ్ లోక్సభ స్థానం నుంచి కూడా ఓడిపోనున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని విపక్ష మహా వికాస్ అఘాడీ కూటమిపై మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ అందులోని కాంగ్రెస్, నకిలీ శివసేన (ఉద్ధవ్ఠాక్రే పార్టీ) యాకుబ్ మెమన్ (1993 ముంబయి వరుస పేలుళ్ల దోషి) సమాధిని అలంకరించడంలో నిమగ్నమై ఉన్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని ఉద్దేశించి విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన కొందరు నేతలు లోక్సభను వదిలి రాజ్యసభకు వెళ్లిపోతున్నారని, వారికి ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేదని ప్రధాని ఎద్దేవా చేశారు. రాహుల్ గురించి కేరళ ముఖ్యమంత్రి విజయన్ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ తాను కూడా ఆ స్థాయిలో మాట్లాడలేదన్నారు. కనీసం 25 శాతం స్థానాల్లో పరస్పరం పోటీ పడుతున్న ‘ఇండియా’ కూటమి నేతలను మీరు విశ్వసిస్తారా? అని ఓటర్లను ప్రశ్నించారు.
‘ట్యాంకర్ సిటీ’గా టెక్ సిటీ
ఈనాడు, బెంగళూరు: దేశంలో శక్తిమంతులైన కొందరు వ్యక్తులు తనను అధికారం నుంచి తొలగించేందుకు విదేశీ శక్తులతో చేతులు కలిపారని మోదీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శనివారం సాయంత్రం కర్ణాటకలోని చిక్కబళ్లాపుర, బెంగళూరులలో నిర్వహించిన సభల్లో ప్రధాని ప్రసంగించారు. బెంగళూరు వంటి టెక్ సిటీని కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ల సమస్యతో ‘ట్యాంకర్ సిటీ’గా మార్చినట్లు మోదీ విమర్శించారు. ఇక్కడ ఆడబిడ్డలకు రక్షణ లేదా.. స్వేచ్ఛగా భజన చేసుకునే అవకాశం కూడా లేదా అంటూ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఘటనలను ప్రస్తావించారు. యూపీఏ సర్కారు దేశ ఆర్థికస్థితిని దయనీయంగా మార్చిందని మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆరోపించారు. మోదీ ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. పత్రికలకు కాంగ్రెస్ ఇచ్చిన ఓ వ్యంగ్య ప్రకటనపై స్పందించారు. ఆ ప్రకటనలో ఓ చెంబును చూపిన కాంగ్రెస్.. కర్ణాటకకు మోదీ ఇచ్చిన బహుమతి ఇదేనంటూ వ్యాఖ్యానించింది. ఈ ప్రకటనను చూపుతూ దేవెగౌడ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
నాన్నకు ఇష్టమైన జిలేబీలు.. ప్రియాంక చేసిన కేకులు..! రాహుల్ మధుర జ్ఞాపకాలు
-
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్