ఐటీ కోటలో నీరే నిప్పు.. ‘బెంగ’ళూరును కుదిపేస్తున్న తాగునీటి ఎద్దడి
భారతీయ సిలికాన్ వ్యాలీ, ఉద్యాన నగరి.. బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి.
ఎన్నికల ప్రచారానికి వెళ్తే ప్రజలు నిలదీస్తారనే భయం
అపార్ట్మెంట్లకు ముఖం చాటేస్తున్న అభ్యర్థులు
ఈనాడు, బెంగళూరు: భారతీయ సిలికాన్ వ్యాలీ, ఉద్యాన నగరి.. బెంగళూరులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు అధికార పార్టీకి, విపక్షాలకూ చెమటలు పట్టిస్తున్నాయి. ఈ నగరం పరిధిలోని నాలుగు లోక్సభ స్థానాల్లో పోలింగ్ శాతం ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. దీనికి తోడు ఈ దఫా తెరపైకి వచ్చిన నీటి ఎద్దడి అభ్యర్థులను హడలెత్తిస్తోంది.
బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్సభ నియోజక వర్గాలకు ఈ నెల 26న పోలింగ్ జరగనుంది. రాజకీయ, ఆర్థిక శక్తి క్షేత్రమైన ఈ ఐటీ నగరంలో పాగా వేసేందుకు ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు శక్తి వంచన లేకుండా పోరాడుతుంటాయి. స్థానికేతరులదే ప్రాబల్యమైనందున ఓటరు నాడిని పట్టుకోవడం కత్తిమీద సామే. స్థానిక రాజకీయాలను ఏమాత్రం పట్టించుకోని వలస జీవులు ఎన్నికలంటే తమకు సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తుంటారు. ఆ కారణంగానే ప్రతి ఎన్నికల్లోనూ అతి తక్కువ పోలింగ్ నమోదయ్యే తొలి ఐదు జిల్లాల్లో బెంగళూరు నగరం ఉంటోంది.
అయితే, పోలింగ్పై ఆసక్తి చూపని ఓటర్లనూ నగరంలో నెలకొన్న నీటి సమస్య కదిలించేలా ఉంది. 40 రోజులుగా నగరంలో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎన్నికల తేదీ నాటికి ఇది మరింత విజృంభించవచ్చని తెలుస్తోంది. బెంగళూరు నగరమంతా కావేరి నీటిపైనే ఆధారపడి ఉండటంతో కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేని కారణంగా వారానికి ఒక్కసారి కూడా నీరు అందని పరిస్థితి నెలకొంది. ట్యాంకరుకు రూ.1,500ల నుంచి రూ.2వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. 50ఏళ్లుగా చూడని నీటి సమస్యను నగరం ఎదుర్కోంటోంది. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులు అపార్ట్మెంట్లు, మురికివాడల్లో ఓట్ల కోసం స్వేచ్ఛగా వెళ్లలేకపోతున్నారు.
పార్టీల నిందారోపణలు
ఓటింగ్పై ప్రభావం చూపే నీటి సమస్యపై భాజపా, కాంగ్రెస్లు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది వర్షాలు పడలేదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని భాజపా ఆరోపిస్తోంది. అనధికారింగా లక్ష బోర్లకు అనుమతి, ట్యాంకర్ మాఫియాని అరికట్టలేకపోవటం, కేఆర్ఎస్ జలాశయంలో నీరు లేకున్నా తమిళనాడుకు నీటిని విడుదల చేసిన సర్కారే ఈ సమస్యకు బాధ్యత వహించాలని భాజపా ప్రచారం చేస్తోంది. బెంగళూరు నగరానికి తాగునీటిని సమృద్ధిగా అందించే మేకెదాటు ప్రాజెక్టుకు కేంద్రం ఎందుకు అనుమతి ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. కరువు పరిహారం సకాలంలో చెల్లించని కారణంగానే తాగునీటి సదుపాయాన్ని అందించలేకపోతున్నట్లు కేంద్రంపై ఆరోపణలు చేస్తోంది.
నగరంలో భాజపా పాగా
ఎప్పుడు లోక్సభ ఎన్నికలు నిర్వహించినా బెంగళూరు నగరంలో భాజపా ఆధిపత్యాన్ని చాటుతూనే ఉంది. 2008కు ముందు బెంగళూరు ఉత్తర, బెంగళూరు దక్షిణలు మాత్రమే బెంగళూరు నగర స్థానాలుగా, రామనగర, చిక్కబళ్లాపురలు గ్రామీణ ప్రాంత స్థానాలుగా పరిగణించేవారు. నాలుగు స్థానాలుగా పునర్విభజన తర్వాత కూడా భాజపా మూడింటిని తన ఖాతాలో వేసుకుని నగరంపై పట్టు కొనసాగిస్తోంది. పునర్విభజనకు పూర్వం రెండు స్థానాల్లో ఒకటి తన ఖాతాలో వేసుకునే కాంగ్రెస్ ఆపై పట్టు కోల్పోతోంది. 2009లో ఆ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది.
నగర ఓటర్లను ప్రభావితం చేసే మరికొన్ని అంశాలు
వరద నీటి ముంపు, మౌలిక సదుపాయాల కొరత, 60శాతం కన్నడ నామ ఫలకాల నిబంధన, ప్రైవేటు కంపెనీల్లో స్థానికులకే ఉపాధి, కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత పెరిగిన వివిధ పన్నులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
తిరుపతి చేరుకున్న సిట్ బృందం.. విచారణ ప్రారంభం
-
ప్రత్యేక ట్రేడింగ్ సెషన్.. సెన్సెక్స్ 88+, నిఫ్టీ @ 22,500
-
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
-
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..