తేజస్వీని ఆపేదెలా?
బిహార్లో అత్యధిక స్థానాలపై పట్టును నిలుపుకోవాలని చూస్తున్న ఎన్డీయే కూటమికి ఆర్జేడీ యువ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రూపంలో అడ్డంకి ఎదురవుతోంది.
బిహార్లో చెమటోడుస్తున్న ఎన్డీయే
మోదీ, అమిత్ షాల ప్రత్యేక దృష్టి
పట్నా నుంచి నీరేంద్ర దేవ్
బిహార్లో అత్యధిక స్థానాలపై పట్టును నిలుపుకోవాలని చూస్తున్న ఎన్డీయే కూటమికి ఆర్జేడీ యువ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రూపంలో అడ్డంకి ఎదురవుతోంది. ఇక్కడ పోటీ గట్టిగా ఉందని భాజపా వ్యూహకర్తలే అభిప్రాయపడుతుండటంతో ప్రధాని మోదీ, అమిత్ షాలు తరచూ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 4 సీట్లలో శుక్రవారం పోలింగ్ జరిగింది. ఈ నాలుగు నియోజకవర్గాలకు ప్రధాని మోదీ మూడు సార్లు వచ్చారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనిని బట్టే పోటీ ఎంత తీవ్రంగా ఉందనేది అర్థమవుతోంది. బిహార్లో 40కి 40 సీట్ల లక్ష్యానికి తేజస్వీ యాదవ్ గట్టిగా ఎదురు నిలుస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ 39 సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ ఒక్క కిషన్గంజ్లోనే గెలిచింది.
అత్యంత వెనుకబడిన వారికి ప్రాధాన్యం
అత్యంత వెనుకబడిన వర్గాలకు తేజస్వీ ప్రాధాన్యం ఇస్తున్నారు. తద్వారా ఇండియా కూటమిని ఎక్కువ మందికి చేరువ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్లా-నిషాద్ వర్గానికి చెందిన ముకేశ్ సాహ్ని పార్టీ వికాశ్ శీల్ ఇన్సాన్ పార్టీకి (వీఐపీ) మూడు సీట్లు ఇచ్చారు. దీంతో ఝంఝార్పుర్, తూర్పు చంపారన్, గోపాల్గంజ్లలో ఎన్డీయేకు గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ పార్టీకి ఒక సీటు ఇస్తానని ఎన్డీయే కూడా బేరాలాడటం గమనార్హం.
- తూర్పు చంపారన్లో సీనియర్ నేత, వ్యవసాయ మంత్రి రాధామోహన్ సింగ్ను మరోసారి భాజపా బరిలోకి దింపింది. 2019 ఎన్నికల్లోనూ వికాశ్ శీల్ పార్టీకి మధుబని, ముజఫర్పుర్, ఖగారియా సీట్లను ఆర్జేడీ కేటాయించింది. ఈ మూడింట్లో ఆ పార్టీ ఓడిపోయింది.
- పుర్ణియాలో ఆర్జేడీకి పప్పూ యాదవ్ రూపంలో ఇబ్బంది ఎదురవుతోంది. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇక్కడ ఆర్జేడీ తరఫున భీమా భారతి పోటీ చేస్తున్నారు. పప్పూ యాదవ్ గెలవకపోయినా ఆర్జేడీకి నష్టం చేకూర్చే అవకాశముంది. ఇక్కడ ఎన్డీయే తరఫున సంతోశ్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు.
- రామ మందిరం అంశం ఊహించినంతగా ప్రభావం చూపడం లేదని ఆధ్యాత్మిక నగరం గయలోని భాజపా కార్యకర్తలే కొందరు అంటున్నారు. అయోధ్య అంశం ఓట్లు రాల్చే అవకాశం పెద్దగా లేదని చెబుతున్నారు. అందుకే మోదీ బిహార్లోని ప్రతి సభలోనూ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠకు కాంగ్రెస్ రాలేదని విమర్శలు చేస్తున్నారని పేర్కొంటున్నారు.
23 సీట్లలో ఆర్జేడీ పోటీ
రాష్ట్రంలోని 23 సీట్లలో ఆర్జేడీ పోటీ చేస్తోంది. తేజస్వీ యాదవ్ ప్రతిష్ఠ పెరుగుతోందని, నీతీశ్ ప్రభ తగ్గుతోందని ఆర్జేడీ సీనియర్ శివానంద్ తివారీ తెలిపారు. దివంగత రాం విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ ఎన్డీయేతో కలిసి పోటీ చేస్తున్నారు. 7శాతం ఉన్న దళిత ఓట్లపై పాస్వాన్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన ఈసారి విజయం సాధించడం కష్టమేనని చాలామంది చెబుతున్నారు. చిరాగ్పై నమ్మకంతో అమిత్ షా.. ఆయనకు 5 సీట్లు ఇచ్చారు. ఇది చిరాగ్కు అంచనాలకు మించి ప్రాధాన్యం ఇవ్వడమేననే వాదన ఉంది. అంతేకాకుండా చిరాగ్ చిన్నాన్న పశుపతి కుమార్ పారస్ను పట్టించుకోలేదు.
- 2019 ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటునూ గెలవలేదు. యాదవుల ప్రాబల్యమున్న మాధేపుర లాంటి ప్రాంతాల్లోనూ భాజపా విజయఢంకా మోగించింది. ఇది ఆశ్చర్యపరిచింది.
- సీమాంచల్లోని ముస్లింలు ఈసారి ఏం చేస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.
మాకే మద్దతంటున్న ఎన్డీయే
సహజ భాగస్వాములమైన తమ కూటమినే బిహార్ ప్రజలు ఆదరిస్తారనే నమ్మకంతో భాజపా, జేడీయూ ఉన్నాయి. ‘గత 8 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6సార్లు భాజపా, జేడీయూ కలిసి పోటీ చేశాయి. ఒకసారి విడిగా పోటీ చేశాయి. మరోసారి ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కలిసి బరిలోకి దిగాయి. ఇందులో ఎక్కువసార్లు మేమే గెలిచాం’ అని భాజపా ఐటీ సెల్ విభాగాధిపతి అమిత్ మాలవీయ పేర్కొన్నారు.
- ‘ఆర్జేడీ ముస్లిం-యాదవ్’ కార్డు పని చేయదు. 2019 ఎన్నికల్లో దానిని మేం ఛేదించాం. బిహార్ ప్రజలు కులమతాలకు అతీతంగా నీతీశ్కు మద్దతుగా నిలుస్తారు’ అని జేడీయూ నేత రాజీవ్ రంజన్ స్పష్టం చేశారు.
- మోదీ మ్యాజిక్ బిహార్లో పని చేస్తుందని, ఇది అన్నింటికంటే ఎక్కువని భాజపా నేత రాంకృపాల్ యాదవ్ తెలిపారు.
మోదీకి ప్రత్యామ్నాయం లేదనడం భావ దారిద్య్రం
‘ఈ ఎన్నికలు రాజ్యాంగ విలువలను కాపాడుకోవడంతోపాటు దాని బలోపేతానికి సంబంధించినవి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతోపాటు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని అందించాల్సి ఉంది. ప్రజల గొంతుకను వినిపించాల్సి ఉంది. ఒకే అంశం చుట్టూ తిరగడం కాకుండా ప్రజల నిజమైన అవసరాలను గుర్తించాల్సి ఉంది. ప్రపంచ సూచీలో మన మీడియా స్వేచ్ఛ ఏ స్థానంలో ఉందో మనందరికీ తెలుసు. ఇవీ అసలైన ఎన్నికల అంశాలు. మన ముందు ఎన్నో అవకాశాలున్నాయి. ప్రతిపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. మోదీకి ప్రత్యామ్నాయం లేదనడం భావ దారిద్య్రానికి నిదర్శనం.’
తేజస్వీ యాదవ్
నీతీశ్ రాకతో..
ఎన్డీయేలోకి జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ రాకతో కిషన్గంజ్లోనూ ఆధిక్యం సాధిస్తామనే ఆశాభావంతో భాజపా ఉంది. దీంతో 40 సీట్లూ గెలవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. జేడీయూవల్ల ముస్లింల ఓట్లు పడి గెలుస్తామని అనుకుంటోంది. కానీ ఆర్జేడీ పార్టీ ప్రస్తుతం తేజస్వీ చేతుల్లో బలంగా ఉంది. ఆరోగ్యం, వయసు కారణంగా లాలూ ప్రసాద్ బాధ్యతలను కుమారుడికి వదిలేశారు.
తేజస్వీ సభలకు భారీగా..
‘తేజస్వీ యాదవ్కు యువతలో భారీగా మద్దతు లభిస్తోంది. ఆయన సభలకు భారీగా జనం వస్తున్నారు. ఆయన యువతలో కొత్త ఆశలను చిగురింపజేస్తున్నారు’ అని పట్నాలోని ఉద్యోగి ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇది నూతన ఆర్జేడీ. తన తండ్రిలాగా తేజస్వీ కేవలం ముస్లింలు, యాదవ్ల ఓట్లపైనే ఆధారపడటం లేదు. ఆయన స్మార్ట్ సోషల్ ఇంజినీరింగ్ చేస్తున్నారు. అన్ని సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు’ అని రాజకీయ విశ్లేషకుడు జాంతు దేయ్ పేర్కొన్నారు.
మోదీ, నీతీశ్ ప్రభావమున్నా..
కొన్ని అంశాల్లో మోదీ, నీతీశ్ల ప్రభావమున్నా కీలక విషయాల్లో యువత ఆర్జేడీపట్ల అనుకూలంగా ఉన్నారనిపిస్తోంది. 15ఏళ్లపాటు పాలించిన లాలూ 2005లో ఓటమితో మరుగునపడిపోయారు. అప్పటి నుంచి కూటములను మారుస్తూ నీతీశ్ 19ఏళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన శకమూ అయిపోయిందని, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ముఖ్యమంత్రి వస్తారని భాజపా ఆశగా ఉంది. ఇటు తమ ప్రభుత్వం వస్తుందని ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమీ నమ్మకంగా ఉంది. లాలూ కుమారుడు ముఖ్యమంత్రి పదవిని అధిరోహిస్తారని భావిస్తోంది.
ఎన్నో అంశాలు
1990ల నాటి పరిస్థితులు ఇప్పుడు బిహార్లో లేవు. పలు అంశాలు ఇక్కడ ఇప్పుడు ప్రభావితం చేస్తున్నాయి. అప్పట్లో లాలు కరిష్మా ఆర్జేడీకి విజయాలను అందించింది. అప్పట్లో మాదిరిగా కులాల వారీగా ఓట్లు పడే పరిస్థితీ అంతగా లేదంటున్నారు. సామాజికవర్గాల ఓట్లు గంపగుత్తగా ఎవరికీ పడటం లేదు. ప్రస్తుతం రామ మందిరం, శాంతి భద్రతల అంశం, నీతీశ్ పాలనతోపాటు మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, నిరుద్యోగం వంటివి ప్రాధాన్యాంశాలుగా ఉన్నాయి. మరుగు దొడ్ల అంశమూ ఎన్నికల్లో ప్రభావం చూపే పరిస్థితి వచ్చింది.
- జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయం లేదనే ప్రచారం ఎన్డీయేకు కలిసివచ్చే అంశం.
- నీతీశ్ను వద్దనుకునేవారు ఆర్జేడీ, భాజపాల మధ్య చీలిపోయారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!
-
ఆ ప్రాజెక్ట్కు ఓకే చెప్పినందుకు బాధపడ్డా: టబు
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు