కాంగ్రెస్ వస్తే.. సంపదంతా ముస్లింలకే
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.
అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నేతలు మహిళల మంగళ సూత్రాల్నీ వదలరు
రాజస్థాన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు
ఇది విద్వేష ప్రసంగమే.. మండిపడిన కాంగ్రెస్
జైపుర్, దిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ ఉదాహరించారు. ఆదివారం రాజస్థాన్లోని జాలౌర్, భీన్మాల్తోపాటు బాంస్వాడా ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. ‘‘ప్రజల వద్ద ఉన్న బంగారంతో సహా సంపద మొత్తం సర్వే చేసి అందరికీ సమానంగా ‘పునఃపంపిణీ’ చేస్తామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చెప్పింది. ఆ మేరకు దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువమంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. మీ ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? అర్బన్ నక్సలిజం మనస్తత్వం ఉన్న ఆ పార్టీ నాయకులు మహిళల మంగళ సూత్రాలను కూడా వదలరు. మీ కష్టార్జితం చొరబాటుదారుల పాలు కావడం మీకు సమ్మతమేనా?’’ అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. వామపక్షాల ఉచ్చులో చిక్కిన కాంగ్రెస్ మావోయిజం సిద్ధాంతాలను అమలుచేయాలని చూస్తోందన్నారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. మొదటిదశ లోక్సభ ఎన్నికల పోలింగు సరళిని చూసి అసంతృప్తికి గురైన మోదీ మరిన్ని అబద్ధాలతో, విద్వేష వ్యాప్తితో ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తింది. భారతదేశ చరిత్రలో మోదీ స్థాయిలో మరే ప్రధాని ఆ పదవి ప్రతిష్ఠను ఇంతగా దిగజార్చలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ‘‘అధికారం కోసం అబద్ధాలు చెప్పడం, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేయడం ఆరెస్సెస్, భాజపా ఇచ్చే శిక్షణలో ప్రత్యేకత’’ అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రతి భారతీయుడి సమానత్వం కోరుకొంటుందని, ప్రధాని తీరు చూస్తుంటే గోబెల్స్ లాంటి మన నియంత కుర్చీ కదులుతోందని స్పష్టమవుతోందని ఖర్గే అన్నారు.
ఇండియా కూటమి దారం తెగిన గాలిపటం
దేశంలో ఒకనాడు 400కు పైగా స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ నేడు 300 నియోజకవర్గాల్లో సొంతంగా పోటీ చేయడం కూడా కష్టంగా ఉందని, ఆ పార్టీ చేసిన పాపాలకు దేశం శిక్షిస్తోందని రాజస్థాన్ సభల్లో మోదీ అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితిని ఆ పార్టీ ఎదుర్కొంటోందని విమర్శించారు. ‘ఇండియా’ పేరుతో విపక్షాలు ఏర్పాటు చేసినది అవకాశవాద కూటమి అని, అది ఆకాశంలోకి ఎగరకముందే దారం తెగిన గాలిపటం లాంటిదని ప్రధాని అభివర్ణించారు. ‘‘ఎన్నికల క్షేత్రంలో పోటీ పడేందుకు వెనుకాడుతున్నవారు ఈసారి రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వచ్చారు. ఇదీ కాంగ్రెస్ దుస్థితి’’ అంటూ పరోక్షంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. మొదటిదశ ఎన్నికల్లో రాజస్థాన్లో సగభాగం ఇప్పటికే కాంగ్రెస్ను శిక్షించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని యూపీఏ సర్కారులో ప్రధానిని ఎవరూ పట్టించుకోలేదని, పాలన అంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడిచిందని ఆరోపించారు. అప్పటి క్యాబినెట్ ఆమోదించిన ఆర్డినెన్సును సొంత పార్టీ నాయకుడే మీడియా సమావేశంలో చించి పక్కన పడేశారని రాహుల్గాంధీని ఉద్దేశించి విమర్శించారు. అస్థిరతకు మారుపేరైన ఇటువంటి పార్టీ దేశాన్ని నడపగలదా? అని ఓటర్లను ప్రధాని ప్రశ్నించారు.
మొదటిదశతో మోదీలో అసంతృప్తి
-రాహుల్
మోదీ అబద్ధాల తీవ్రత చూస్తుంటే మొదటిదశ లోక్సభ ఎన్నికల పోలింగు సరళి ఆయనను ఎంతగా అసంతృప్తికి గురిచేసిందో తెలుస్తోందని, అందుకే ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నంలో భాగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ స్పందించారు. తమ పార్టీ విప్లవాత్మక మ్యానిఫెస్టోకు విపరీతమైన మద్దతు వస్తోందని ఆదివారం ‘ఎక్స్’ ద్వారా రాహుల్ పేర్కొన్నారు. దేశం ఇపుడు తన సమస్యల ఆధారంగా ఓటు వేస్తుందని వ్యాఖ్యానించారు. యువత, మహిళలు, రైతులు, దళితులకు సంబంధించిన అంశాలపై మాట్లాడకుండా రాజస్థాన్ ర్యాలీల్లో మోదీ అబద్ధాలు చెబుతున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. మొదటిదశ పోలింగు సరళిని చూసి ఒత్తిడికి గురైన మోదీ మానసిక సమతుల్యతను కోల్పోయినట్లుందని ఆయన ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ‘‘గుర్తుపెట్టుకోండి. భాజపా దక్షిణ్ మే సాఫ్, ఉత్తర్ మే హాఫ్ (దక్షిణ భారతంలో శూన్యం, ఉత్తర భారతంలో సగమే)’’ అన్నారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో హిందూ - ముస్లిం అని ఎక్కడ ఉందో ప్రధాని చూపాలని కాంగ్రెస్ మీడియా ఇన్ఛార్జి పవన్ ఖేడా సవాలు విసిరారు. ‘పునః పంపిణీ’ గురించి అందులో మాట్లాడలేదని, సమగ్ర సామాజిక, ఆర్థిక కులగణన తమ విధానమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
అమెజాన్-ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ రివార్డులు ఉండవిక..
-
సీనియర్లుగా జట్టులో మీ బాధ్యత అదే కదా..: హర్భజన్
-
ఆ బాలుడికి పోలీస్స్టేషన్లో పిజ్జా, బిర్యానీ
-
అంతరిక్షంలో ఆయుధాలు.. అమెరికా-రష్యా మాటల యుద్ధం
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్ అభ్యర్థన వెనక స్టార్ హీరో సతీమణి
-
ఏఐపై ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇన్ఫోసిస్ సీటీఓ సూచనలు