బెదిరిపోం.. లొంగిపోం..
కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము బెదిరిపోయేది, లొంగేది లేదని విపక్ష నేతలు తేల్చిచెప్పారు.
ప్రజాస్వామ్యానికి ఎన్డీయేతో హాని
ఒత్తిళ్లకు లొంగనివారిని జైలు పాల్జేస్తున్నారు
రాంచీ సభలో విపక్ష నేతల ధ్వజం
రాంచీ: కేంద్రంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా తాము బెదిరిపోయేది, లొంగేది లేదని విపక్ష నేతలు తేల్చిచెప్పారు. అన్నిరకాల వ్యవస్థల్ని గుప్పిటపెట్టుకుని ముఖ్యమంత్రుల్ని జైలు పాల్జేస్తున్న భాజపాను సాగనంపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీతో ప్రజాస్వామ్యానికి హాని కలుగుతుందన్నారు. రాంచీలో ఆదివారం ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో 28 పార్టీల నేతలు పాల్గొని ప్రసంగించారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ శక్తి బలంగా ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ అయినా, భాజపాకు చెందిన ఇతర నేతలైనా కూటమిని విచ్ఛిన్నం చేయలేరన్నారు. ఝార్ఖండ్లో ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేందుకు ఒప్పుకోనందుకే ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్టు చేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే తన ప్రసంగంలో ఆరోపించారు. తాము ప్రజలకే తప్పిస్తే ప్రధాని వంటి నేతలకు భయపడేది లేదన్నారు. గిరిజనుల్ని అంటరానివారుగా భాజపా భావిస్తుందని, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రామాలయ ప్రాణప్రతిష్ఠకు గానీ, పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవానికి గానీ ఆహ్వానించనేలేదని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో కమలనాథులు 150-180 స్థానాలకే పరిమితమవుతారని జోస్యం చెప్పారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ- రాజ్యాంగాన్ని మారుస్తామని భాజపా నేతలు అంటున్నారని, అలాచేసే అధికారం ఎవరికీ లేదని తెలిపారు. అవినీతిపరుల్ని భాజపాలో చేర్చుకోవడమే మోదీ చెబుతున్న గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
శ్రీరాముడు అందరివాడు
-ఫరూక్ అబ్దుల్లా
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ- శ్రీరాముడు కేవలం హిందువులకే పరిమితం కాదని, రాముడు అందరివాడని చెప్పారు. కొందరు మాత్రం రాముడు తమకే చెందుతాడన్నట్లుగా వ్యవహరిస్తున్నారని పరోక్షంగా భాజపాని విమర్శించారు.
సోరెన్, కేజ్రీవాల్ల కోసం ఖాళీగా కుర్చీలు
వేదికపై అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ల కోసం రెండు కుర్చీలను ఖాళీగా విడిచిపెట్టారు. జేఎంఎం అధినేత శిబు సోరెన్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఝార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్, పంజాబ్ సీఎం భగవంత్మాన్, ప్రియాంక చతుర్వేది (శివసేన యూబీటీ), దీపాంకర్ భట్టాచార్య (సీపీఐ ఎంల్) తదితరులు హాజరయ్యారు. కారాగారం నుంచి సోరెన్ పంపిన సందేశాన్ని ఆయన భార్య కల్పన చదివి వినిపించారు. విపక్షపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను మార్చాలని భాజపా ప్రయత్నిస్తున్నా ప్రజాస్వామ్యం విఫలం కావడాన్ని అనుమతించేదే లేదని ఆ సందేశంలో సోరెన్ పేర్కొన్నారు.
అస్వస్థతతో రాహుల్గాంధీ గైర్హాజరు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వల్ప అస్వస్థతకు గురైన కారణంగా రాంచీ సభకు హాజరు కాలేదని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
నా భర్తను జైల్లో చంపాలనుకుంటున్నారు
-సునీత
కేంద్ర సర్కారు తన భర్తను కారాగారంలోనే చంపాలనుకుంటోందని, అందుకే ఆయనకు ఇన్సులిన్ ఇచ్చేందుకు అంగీకరించడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఈ సభలో ఆరోపించారు. ‘నా భర్తకి మధుమేహం ఉంది. ఆయనకు రోజుకు 50 యూనిట్ల ఇన్సులిన్ ఇవ్వాలి. దానిని ఇవ్వనివ్వడం లేదు. ఆయనపై అభియోగాలేవీ రుజువు కావు. జైలు తలుపులు బద్దలుగొట్టుకుని కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లు బయటకు వస్తారు’ అని సునీత చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
అదృశ్యమైన ఆ నటుడు.. ఎట్టకేలకు 24 రోజుల తర్వాత ఇంటికి
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్