హనుమాన్ చాలీసా విన్నా నేరమేనా
హనుమాన్ చాలీసా విన్నా కాంగ్రెస్ నేతలు నేరంగానే పరిగణిస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్న కర్ణాటకలో ఇటీవల ఓ దుకాణదారు హనుమాన్ చాలీసా వింటుండగా కొందరు మూకదాడికి పాల్పడినట్లు మోదీ తెలిపారు.
కాంగ్రెస్ అలాగే చూస్తోంది
విపక్షం కుట్రలు బయటపెట్టా
ప్రధాని మోదీ వ్యాఖ్యలు
జైపుర్: హనుమాన్ చాలీసా విన్నా కాంగ్రెస్ నేతలు నేరంగానే పరిగణిస్తున్నారని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. కాంగ్రెస్ అదికారంలో ఉన్న కర్ణాటకలో ఇటీవల ఓ దుకాణదారు హనుమాన్ చాలీసా వింటుండగా కొందరు మూకదాడికి పాల్పడినట్లు మోదీ తెలిపారు. రాజస్థాన్లోని టోంక్లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై మళ్లీ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలు తమ విశ్వాసాలను పాటించడం కూడా కష్టంగా ఉందన్నారు. గతంలో రాజస్థాన్లోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శ్రీరామనవమి ఉత్సవాలపై ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ‘‘మూడు రోజుల క్రితం కాంగ్రెస్ ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలను నేను బయటపెట్టా. ప్రజల సంపదను దోచుకొని కొంతమంది ‘ఎంపికచేసిన వ్యక్తులకు’ పంచిపెట్టాలన్న వారి కుట్రలను దేశ ప్రజల ముందుంచా. దీంతో విపక్ష కూటమి ఆగ్రహానికి గురై మోదీని తిట్టడం మొదలుపెట్టింది. సంపద పునఃపంపిణీ కోసం సర్వే చేస్తామని వారి నేతలే చెప్పారు. దమ్ముంటే వాస్తవాన్ని అంగీకరించి పోరాడండి. ఎదుర్కోడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని మోదీ సవాలు విసిరారు. బడుగు, బలహీనవర్గాలకు చెందినవారి రిజర్వేషన్లు లాక్కొని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలని చూస్తున్నవారి కుట్రను బయటపెడితే కాంగ్రెస్ ఉలిక్కి పడుతోందని మోదీ అన్నారు. 2004లో ఆ పార్టీ కేంద్రంలో పగ్గాలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ప్రత్యేకకోటా కల్పించే ప్రయత్నం చేసిందని గుర్తు చేశారు.
గోవాకు రాజ్యాంగం వర్తించదని అంబేడ్కర్ను అవమానిస్తారా?
ధంతరీ, సక్తీ (ఛత్తీస్గఢ్): దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని గతంలో కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ కోరగా, ఇప్పుడు అదే పార్టీకి చెందిన గోవా అభ్యర్థి తమ తీరప్రాంత రాష్ట్రంపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దారని అంటున్నారని ప్రధాని మోదీ విస్మయం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తమ ‘యువరాజు’కు (రాహుల్గాంధీ అనే ఉద్దేశంతో) కూడా చెప్పినట్లు ఆ అభ్యర్థి (వి.ఫెర్నాండెజ్, దక్షిణ గోవా) బహిరంగంగా చెబుతున్నాడని తెలిపారు. దేశాన్ని విభజించే ఈ కుట్ర బాబాసాహెబ్ అంబేడ్కర్ను అవమానించినట్టు కాదా? అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్లోని ధంతరీ, సక్తీ జిల్లాల్లో మంగళవారం ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక ఆహ్వానాన్ని కాంగ్రెస్ తిరస్కరించిందని, ఇది రాముడి మాతృసంబంధ మూలాలు ఉన్న నేల, మాత శబరి జన్మస్థలమైన ఛత్తీస్గఢ్ను అవమానించడమే అన్నారు. కాంగ్రెస్ తన అవినీతిని దాచుకునేందుకు ఈ ప్రాంతంలో హింసను ప్రోత్సహించిందని ఆరోపించారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలిస్తామని, ఇది తన గ్యారంటీ అని మోదీ తెలిపారు.
మోదీపై ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
దిల్లీ: ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ చేసిన ‘చొరబాటుదారు’ వ్యాఖ్యలపై తమకు ఫిర్యాదులు అందాయని, వాటిని పరిశీలిస్తున్నామని ఈసీ వర్గాలు వెల్లడించినట్లు ఓ మీడియా కథనం పేర్కొంది. ఇటీవల రాజస్థాన్లోని బాంస్వాడాలో జరిగిన ర్యాలీలో మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్, మరికొందరు కాంగ్రెస్ ప్రతినిధులు విడివిడిగా ఎన్నికల కమిషనర్లను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఈసీ వర్గాల నుంచి స్పందన వచ్చింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ