icon icon icon
icon icon icon

పట్నాసాహిబ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా మీరాకుమార్‌ తనయుడు

బిహార్‌లోని పట్నాసాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ తనయుడు అన్షుల్‌ అవిజిత్‌ పోటీ చేయనున్నారు.

Published : 24 Apr 2024 05:08 IST

పట్నా: బిహార్‌లోని పట్నాసాహిబ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్‌ మీరాకుమార్‌ తనయుడు అన్షుల్‌ అవిజిత్‌ పోటీ చేయనున్నారు. బరిలో దిగేందుకు మీరాకుమార్‌ విముఖత వ్యక్తం చేయడంతో తనయుడికి అధిష్ఠానం అవకాశమిచ్చింది. 2008లో పునర్విభజన తర్వాత ఏర్పాటైనప్పటి నుంచి ఈ నియోజకవర్గం భాజపా కంచుకోట. గతసారి ఎన్నికల్లో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శతృఘ్న సిన్హాను ఓడించిన కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈసారి కూడా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. జూన్‌ ఒకటో తేదీన చివరి దశలో పోలింగ్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img