icon icon icon
icon icon icon

అజిత్‌ పవార్‌ కుమారుడికి ‘వై ప్లస్‌’ భద్రత

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తనయుడు పార్థ్‌ పవార్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించింది.

Published : 24 Apr 2024 05:09 IST

పుణె: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ తనయుడు పార్థ్‌ పవార్‌కు లోక్‌సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మావల్‌ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసి ఓటమిపాలైన ఆయన ప్రస్తుతం తన తల్లి సునేత్ర తరఫున చురుగ్గా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు వై ప్లస్‌ భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పుణె పోలీస్‌ కమిషనర్‌ అమితేశ్‌కుమార్‌ తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా పార్థ్‌కు రక్షణ కల్పించినట్లు ఎన్సీపీ నేత ఒకరు తెలిపారు. తాజా పరిణామంపై అజిత్‌ బంధువు, ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్‌) నేత రోహిత్‌ పవార్‌ స్పందించారు. రాజకీయ నాయకుల పిల్లలు, ఎమ్మెల్యేలు, సినీ నటులకు భద్రత కల్పించేందుకే ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొన్నారు. సామాన్యుల భద్రతను విస్మరిస్తున్నారని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img