భాజపాకు మేలు చేసేలా రాహుల్ వ్యాఖ్యలు.. అందుకే ఆయన ‘పాత పేరు’ ప్రస్తావించా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘పాత పేరు’తో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం సమర్థించుకున్నారు.
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
కన్నూర్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘పాత పేరు’తో ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మంగళవారం సమర్థించుకున్నారు. రాహుల్ ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు భాజపాకు, దర్యాప్తు సంస్థలకు మేలు చేసేవిలా ఉండటంతోనే తానావిధంగా స్పందించాల్సి వచ్చిందన్నారు. ఆయన అలా వ్యవహరించడం పూర్తిగా పరిణతి లేకుండా ఉండటమేనన్నారు. ‘‘అందుకే రాహుల్ తన పాత పేరు దిశగా వెళ్లకూడదు’ అని అన్నట్లు విలేకరులతో విజయన్ పేర్కొన్నారు. ఈ నెల 19న కేరళలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. కేరళ సీఎం విజయన్ను కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అరెస్టు చేయకపోవడం తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ దశాబ్దం క్రితం రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘అమూల్ బేబీ’ అని పేర్కొనడాన్ని తాను ప్రస్తావించానని విజయన్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాజకీయ క్రీడాకలాపం!
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. -
గుజరాత్లో ‘గాంధీ’ వ్యూహం..!
రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్లో నవ్సారీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. -
ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్
గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం లేదు. -
కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు. -
తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే?
రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. -
మూడోదశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. -
మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు
‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా. -
కేజ్రీవాల్ గొంతు నొక్కేయడానికే అరెస్టు
ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. -
సొంత పార్టీ నేతపై ‘విమర్శ’
హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు. -
సందేశ్ఖాలీ కుట్ర బయటపడింది: మమత
పశ్చిమబెంగాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే సందేశ్ఖాలీ ఘటనలపై భాజపా అసత్య ప్రచారం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. -
కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు. -
దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్
తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ దిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి
తనను గాంధీ కుటుంబానికి ప్యూన్గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్ అమేఠీ అభ్యర్థి కేఎల్ శర్మ స్పందించారు. -
నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. -
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు. -
రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయం: అమిత్ షా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. -
‘ఇండియా’ గెలుపు పక్కా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ధీమా వ్యక్తం చేశారు. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.