‘వారసత్వ పన్ను’పై రాజకీయ దుమారం
ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి.
ఆర్జించిన సొమ్ములో వారసులకు 45 శాతమే
అమెరికాలో ఆ పద్ధతి బాగుందన్న పిట్రోడా
మండిపడ్డ మోదీ, అమిత్షా, నిర్మల
పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్
దిల్లీ: ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి. అమెరికాలో వారసత్వ పన్ను (ఇన్హెరిటెన్స్ టాక్స్) అమల్లో ఉందని దీని ప్రకారం.. ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45 శాతమే అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘..ఇదో ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్లో మాత్రం ఎవరైనా వెయ్యికోట్ల డాలర్లు సంపాదించి చనిపోతే ఆయన వారసులకు ఆ వెయ్యికోట్ల డాలర్లూ వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి.. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది.
ఇవి పౌరులకు న్యాయం చేస్తాయా?
-భాజపా
పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త సంపదకు, ఒక రైతు సొత్తుకు మధ్య చాలాతేడా ఉంటుందని పేర్కొంది.
నేను చెప్పింది వక్రీకరించారు
-శాం
కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నం జరుగుతోందని, ఒక వ్యక్తిగా ఒక టీవీ ఛానల్కు తాను చెప్పిన మాటల్ని ‘గోడీ మీడియా’ వక్రీకరించడం దురదృష్టకరమని పిట్రోడా ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల మంగళసూత్రాలను, బంగారాన్ని దోచుకుంటుందని మోదీ చెప్పింది అవాస్తవమని, అలాగే 55 శాతం సంపద తీసుకుంటామని ఎవరూ అనలేదని వివరించారు. ‘ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను యథాలాపంగా, ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించాను. కాంగ్రెస్తో సహా ఏ పార్టీకీ దీనితో సంబంధం లేదు’ అని చెప్పారు. వారసత్వ పన్ను గురించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో జయంత్ సిన్హా 2014లోనే చెప్పారని, ఆ తర్వాత కూడా ఆర్థిక మంత్రులు వాటి గురించి అనుకూలంగా మాట్లాడారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ చెప్పారు.
చనిపోయినవారి ఆస్తుల్నీ వదలరట
-మోదీ
చనిపోయిన వ్యక్తుల ఆస్తుల్నీ కాంగ్రెస్ దోచుకుంటుందని మోదీ తీవ్రంగా విమర్శించారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘మధ్యతరగతిపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం యువరాజు, రాజకుటుంబ సలహాదారు చెప్పారు. యువరాజు తండ్రికీ ఆయనే సలహాదారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. మీరు చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. మీ పిల్లలకు లభించదు. ప్రజలు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే (జిందగీ కే సాథ్ భీ లూట్.. ఔర్ జిందగీ కే బాద్ భీ లూట్) ఆ పార్టీ సూత్రంలా ఉంది. కాంగ్రెస్ పార్టీని తమ పూర్వీకుల ఆస్తిగా ఆ వ్యక్తులు (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తున్నారు. దానిని వారి పిల్లలకు అందించారు. దేశ ప్రజలు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడట్లేదు. ప్రమాదకర ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’’ అని దుయ్యబట్టారు.
లాక్కొని ఎవరికిస్తారో తెలుసా?
‘మన విలువలే ఇన్నాళ్లూ మనల్ని పరిరక్షిస్తున్నాయి. మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు తమకున్న కొద్దిపాటి ఆభరణాలను వారసుల కోసం భద్రంగా ఉంచేవారు. రుణాలు తీసుకోవడం, కష్టపడి సంపాదించి కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టుకోవడం ప్రజలకు అలవాటు. మన మూలాలను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రజల రిజర్వేషన్లపైనే కాకుండా ఆదాయం, ఆస్తిపాస్తులపైనా ఆ పార్టీ కళ్లు పడ్డాయి. ప్రతి ఇంటినీ, కప్బోర్డులను, ప్రతి కుటుంబాన్నీ ఎక్స్రే తీసి, ఆభరణాలు, మంగళసూత్రాలు వంటివాటిని లాక్కొని వాళ్లు ఎవరికి ఇస్తారో మీకు తెలుసా? ఆ పాపాన్ని చూస్తూ వదిలేయాలా?’ అని మోదీ ప్రశ్నించారు. మెజారిటీ ప్రజల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని మైనారిటీలకు పంచాలన్న కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పిట్రోడా వ్యాఖ్యలు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. వారసత్వ ఆస్తులపై పన్నువల్ల పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లినట్లవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థీకృత దోపిడీకి తెరలేస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లకు ప్రత్యేక రీఛార్జి?
-
తెలంగాణ అసెంబ్లీలో శనివారం ప్రశ్నోత్తరాలు రద్దు.. నేరుగా బడ్జెట్ పద్దు పైనే చర్చ
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్
-
‘వాట్సప్’ భారత్లో సేవలు నిలిపివేయదు: కేంద్రం స్పష్టీకరణ
-
ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ఛాన్సలర్ పదవికి ఇమ్రాన్ ఖాన్ పోటీ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM