‘వారసత్వ పన్ను’పై రాజకీయ దుమారం
ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి.
ఆర్జించిన సొమ్ములో వారసులకు 45 శాతమే
అమెరికాలో ఆ పద్ధతి బాగుందన్న పిట్రోడా
మండిపడ్డ మోదీ, అమిత్షా, నిర్మల
పార్టీకి సంబంధం లేదు: కాంగ్రెస్
దిల్లీ: ఎండలతోనే కాకుండా సార్వత్రిక ఎన్నికల ప్రచారంతో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కిన తరుణంలో ‘ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్’ అధ్యక్షుడు శాం పిట్రోడా షికాగోలో చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేకెత్తించాయి. అమెరికాలో వారసత్వ పన్ను (ఇన్హెరిటెన్స్ టాక్స్) అమల్లో ఉందని దీని ప్రకారం.. ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45 శాతమే అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘..ఇదో ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్లో మాత్రం ఎవరైనా వెయ్యికోట్ల డాలర్లు సంపాదించి చనిపోతే ఆయన వారసులకు ఆ వెయ్యికోట్ల డాలర్లూ వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి.. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలకు కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని కాంగ్రెస్ వివరణ ఇచ్చుకుంది.
ఇవి పౌరులకు న్యాయం చేస్తాయా?
-భాజపా
పిట్రోడా వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త సంపదకు, ఒక రైతు సొత్తుకు మధ్య చాలాతేడా ఉంటుందని పేర్కొంది.
నేను చెప్పింది వక్రీకరించారు
-శాం
కాంగ్రెస్ మ్యానిఫెస్టో గురించి ప్రధాని మోదీ చెబుతున్న అబద్ధాల నుంచి దృష్టి మళ్లించడానికి ప్రయత్నం జరుగుతోందని, ఒక వ్యక్తిగా ఒక టీవీ ఛానల్కు తాను చెప్పిన మాటల్ని ‘గోడీ మీడియా’ వక్రీకరించడం దురదృష్టకరమని పిట్రోడా ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల మంగళసూత్రాలను, బంగారాన్ని దోచుకుంటుందని మోదీ చెప్పింది అవాస్తవమని, అలాగే 55 శాతం సంపద తీసుకుంటామని ఎవరూ అనలేదని వివరించారు. ‘ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను యథాలాపంగా, ఒక ఉదాహరణగా మాత్రమే ప్రస్తావించాను. కాంగ్రెస్తో సహా ఏ పార్టీకీ దీనితో సంబంధం లేదు’ అని చెప్పారు. వారసత్వ పన్ను గురించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి హోదాలో జయంత్ సిన్హా 2014లోనే చెప్పారని, ఆ తర్వాత కూడా ఆర్థిక మంత్రులు వాటి గురించి అనుకూలంగా మాట్లాడారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ చెప్పారు.
చనిపోయినవారి ఆస్తుల్నీ వదలరట
-మోదీ
చనిపోయిన వ్యక్తుల ఆస్తుల్నీ కాంగ్రెస్ దోచుకుంటుందని మోదీ తీవ్రంగా విమర్శించారు. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఈ మేరకు స్పందించారు. ‘‘మధ్యతరగతిపై మరిన్ని పన్నులు విధించాలని కొంతకాలం క్రితం యువరాజు, రాజకుటుంబ సలహాదారు చెప్పారు. యువరాజు తండ్రికీ ఆయనే సలహాదారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పొందిన సంపదపై పన్ను విధించాలని ఆయన బహిరంగంగా చెబుతున్నారు. మీరు చెమటోడ్చి కూడబెట్టిన సంపద.. మీ పిల్లలకు లభించదు. ప్రజలు బతికి ఉన్నప్పుడే కాకుండా మరణించిన తర్వాత కూడా వారి సొమ్మును దోచుకోవడం ఒక్కటే (జిందగీ కే సాథ్ భీ లూట్.. ఔర్ జిందగీ కే బాద్ భీ లూట్) ఆ పార్టీ సూత్రంలా ఉంది. కాంగ్రెస్ పార్టీని తమ పూర్వీకుల ఆస్తిగా ఆ వ్యక్తులు (గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి) భావిస్తున్నారు. దానిని వారి పిల్లలకు అందించారు. దేశ ప్రజలు తమ ఆస్తుల్ని పిల్లలకు ఇవ్వడానికి మాత్రం వారు ఇష్టపడట్లేదు. ప్రమాదకర ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’’ అని దుయ్యబట్టారు.
లాక్కొని ఎవరికిస్తారో తెలుసా?
‘మన విలువలే ఇన్నాళ్లూ మనల్ని పరిరక్షిస్తున్నాయి. మన తల్లిదండ్రులు, తాతముత్తాతలు తమకున్న కొద్దిపాటి ఆభరణాలను వారసుల కోసం భద్రంగా ఉంచేవారు. రుణాలు తీసుకోవడం, కష్టపడి సంపాదించి కొద్దికొద్దిగా డబ్బు కూడబెట్టుకోవడం ప్రజలకు అలవాటు. మన మూలాలను దెబ్బతీయాలని కాంగ్రెస్ చూస్తోంది. ప్రజల రిజర్వేషన్లపైనే కాకుండా ఆదాయం, ఆస్తిపాస్తులపైనా ఆ పార్టీ కళ్లు పడ్డాయి. ప్రతి ఇంటినీ, కప్బోర్డులను, ప్రతి కుటుంబాన్నీ ఎక్స్రే తీసి, ఆభరణాలు, మంగళసూత్రాలు వంటివాటిని లాక్కొని వాళ్లు ఎవరికి ఇస్తారో మీకు తెలుసా? ఆ పాపాన్ని చూస్తూ వదిలేయాలా?’ అని మోదీ ప్రశ్నించారు. మెజారిటీ ప్రజల ఆస్తుల్ని స్వాధీనం చేసుకుని మైనారిటీలకు పంచాలన్న కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలకు పిట్రోడా వ్యాఖ్యలు నిదర్శనమని కేంద్ర హోంమంత్రి అమిత్షా చెప్పారు. వారసత్వ ఆస్తులపై పన్నువల్ల పేదలు, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలపై నీళ్లు జల్లినట్లవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇలాంటి వ్యవస్థీకృత దోపిడీకి తెరలేస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు. -
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. -
ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, సునీత, సిసోదియా
ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి. -
రాయ్బరేలీ నుంచి రాహుల్ పోటీ.. వయనాడ్ ప్రజలు ఏమనుకుంటున్నారంటే..?
వయనాడ్తోపాటు రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కూడా పోటీకి దిగారు. ఈ నిర్ణయంపై వయనాడ్ ప్రజల స్పందన ఎలా ఉందంటే..? -
భాజపాలోకి దిల్లీ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు
దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరి సమక్షంలో శనివారం ఆ పార్టీ కండువా కప్పుకొన్నారు. -
మా ‘యువరాజు’ పాదయాత్ర చేశాడు.. మరి ఈ చక్రవర్తి?: మోదీపై ప్రియాంక ఫైర్
Priyanka Gandhi: ప్రధాని మోదీ కోటలో ఉండే చక్రవర్తి అని, ఆయనకు సామాన్యుల కష్టాలు ఎలా తెలుస్తాయని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. -
అప్పుడు కాంగ్రెస్ ఏడుపులు.. ఇప్పుడు పాక్ ఆర్తనాదాలు : మోదీ
ఝార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోదీ (Modi).. అక్కడి అధికార కూటమి జేఎంఎం-కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేశారు. -
డబ్బుల్లేవ్.. పోటీ చేయను: టికెట్ వెనక్కి ఇచ్చిన కాంగ్రెస్ నాయకురాలు
Congress: కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. పార్టీ నిధులు ఇవ్వడం లేదని, తన వద్ద డబ్బుల్లేవని ఒడిశాలో ఓ అభ్యర్థి పోటీకి నిరాకరించారు. తన టికెట్ వెనక్కి ఇచ్చేశారు. -
పోలైన ఓట్ల గణాంకాలు సకాలంలో వెల్లడికి ప్రాధాన్యం
సార్వత్రిక ఎన్నికల్లో ఒకటి, రెండు దశల పోలింగ్లో నమోదైన ఓటింగ్ శాతాన్ని వెల్లడించడంలో జాప్యంతో పాటు ఆ గణాంకాల్లో వ్యత్యాసం ఉండడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న వేళ ఎన్నికల సంఘం(ఈసీ) శుక్రవారం స్పందించింది. -
రాయ్బరేలీలో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. -
వయనాడ్లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. -
ప్రియాంక ఎందుకు పోటీ చేయట్లేదు?
గాంధీ కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ తరఫున ఎవరు పోటీ చేస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రెండు సీట్లలో ఎక్కడా పార్టీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా బరిలో నిలవకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
శివసేన గూటికి తిరిగొచ్చిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్
కాంగ్రెస్ బహిష్కృత నేత, మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ (59) మళ్లీ శివసేన (శిందే) గూటికి చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే సమక్షంలో శుక్రవారం ఆయన శివసేన పార్టీ కండువా కప్పుకొన్నారు. -
లాలూ కుమార్తెపై లాలూ పోటీ!
ఆర్జేడీ కంచుకోట, గతంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించిన సారణ్ నుంచి ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య ఈసారి పోటీలో ఉన్నారు. -
50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?
దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. -
సంక్షిప్త వార్తలు (7)
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. -
రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తేస్తారా?
దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లను తొలగించాలనేది ‘భాజపా-ఆరెస్సెస్’ల స్పష్టమైన దీర్ఘకాల లక్ష్యమని కాంగ్రెస్ ఆరోపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50% పరిమితిని తొలగిస్తారా? -
రాజ్యాంగ మౌలిక సూత్రాల్నిఏ పార్టీ, నాయకుడూ మార్చలేరు: గడ్కరీ
భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలైన లౌకికతత్వం, ప్రాథమిక హక్కులు వంటి వాటిని పార్లమెంటు సహా ఏ పార్టీ, నాయకుడూ మార్చలేరని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. -
రాజ్యాంగ పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తాం
రాజ్యాంగ పీఠికలో ‘లౌకిక’ పదాన్ని చేర్చడం ద్వారా రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీ దాడికి పాల్పడిందని భాజపా ధ్వజమెత్తింది. తాము కేంద్రంలో తిరిగి అధికారంలోకి వస్తే పీఠిక పూర్వరూపాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించింది. -
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
చెస్లో అగ్రస్థానానికి పోటీ పడే ముందు రాహుల్ గాంధీ ముందు రాయ్బరేలీలో గెలవాలని చెస్ లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ సలహా ఇచ్చారు. ఓ యూజర్ పోస్టుకు ఆయన స్పందించారు. -
ఇక అమేఠీలో ర్యాపిడ్ ఫైర్ ప్రచారాలే..!
అమేఠీలో నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక ప్రచారాలే మిగిలిఉన్నాయి. హస్తం పార్టీకి దాదాపు రెండు వారాల సమయం మాత్రమే మిగిలిఉంది. ఈనేపథ్యంలో పార్టీ అభ్యర్థిని ప్రజల్లోకి ఎలా తీసుకెళతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు