మళ్లీ ప్రత్యేక ‘గూర్ఖాలాండ్’ వాదం!
లోక్సభ ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర డిమాండు అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆయా పార్టీలు ఈసారి సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ చూపుతామని హామీ ఇస్తున్నాయి.
లోక్సభ ఎన్నికల వేళ తెరపైకి..
‘శాశ్వత’ పరిష్కారానికి పార్టీల హామీ
దార్జీలింగ్: లోక్సభ ఎన్నికల వేళ మరోసారి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్ర డిమాండు అంశం తెరపైకి వచ్చింది. దీంతో ఆయా పార్టీలు ఈసారి సమస్యకు ‘శాశ్వత పరిష్కారం’ చూపుతామని హామీ ఇస్తున్నాయి. 2014 ఎన్నికల వరకూ ప్రత్యేక గూర్ఖాలాండ్ అంశం ప్రధానంగా ఉన్నా.. 2019 నాటికి ఈ అంశం మరుగునపడింది. మళ్లీ ఈ ఎన్నికల్లో తెరపైకి వచ్చింది. 2019లో గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం), జీఎన్ఎల్ఎఫ్ లాంటి పార్టీలు అభివృద్ధి, ప్రజాస్వామ్య పునరుద్ధరణ వంటి అంశాలను తెరపైకి తెచ్చాయి. గత ఆరేళ్లలో ఇక్కడి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో బలంగా ఉన్న జీజేఎం పూర్తిగా బలహీనపడింది. దార్జీలింగ్లో రెండో విడతలో భాగంగా ఈ నెల 26వ తేదీన పోలింగ్ జరగనుంది.
కొత్త పార్టీల రాకతో..
ఈ ప్రాంతంలో కొత్తగా రెండు పార్టీలు పుట్టుకొచ్చాయి. అందులో ఒకటి.. అజోయ్ ఎడ్వర్డ్స్ నేతృత్వంలోని హమ్రో పార్టీ. 2022లో జరిగిన దార్జీలింగ్ మున్సిపల్ ఎన్నికల్లో ఈ పార్టీ విజయం సాధించింది.
- అనిల్ థాపా నేతృత్వంలో భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్ మోర్చా (బీజీపీఎం) పేరుతో మరో పార్టీ ఏర్పాటైంది. ఈ పార్టీ 2022లో గూర్ఖాలాండ్ ప్రాంతీయ పాలక మండలి (జీటీఏ) ఎన్నికల్లో ఘన విజయం సాధించింది.
- ఈ రెండు పార్టీలు కనీస సౌకర్యాలు, జీవన ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాయి.
మళ్లీ ప్రత్యేక డిమాండ్
- లోక్సభ ఎన్నికలు రావడంతో మళ్లీ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. ఈ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం అంశాన్ని పార్టీలు గుర్తు చేస్తున్నాయి.
- వచ్చే ఐదేళ్లలో శాశ్వత పరిష్కారం చూపుతామని భాజపా హామీ ఇచ్చింది. ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందని, ఐదేళ్లలో తుది పరిష్కారం లభిస్తుందని దార్జీలింగ్ నుంచి మళ్లీ ఎన్నిక కోసం ప్రయత్నిస్తున్న భాజపా అభ్యర్థి రాజు బిస్తా తెలిపారు. రాజ్యాంగానికి కట్టుబడి నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు. అయితే అది ప్రత్యేక రాష్ట్రమేనా అనే అంశాన్ని ఆయన స్పష్టం చేయలేదు. 2009 నుంచి జీజేఎం మద్దతుతో ఈ సీటును భాజపా గెలుస్తూ వస్తోంది. ఈసారి శాశ్వత పరిష్కారం చూపకపోతే వచ్చే ఎన్నికల్లో భాజపాకు మద్దతు ఇవ్వబోమని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి స్పష్టం చేశారు. శాశ్వత పరిష్కారం అంటే తమ ఉద్దేశంలో ప్రత్యేక గూర్ఖాలాండ్ అనే అని తేల్చి చెప్పారు.
- బిమల్ గురుంగ్ నేతృత్వంలోని జీజేఎం ప్రత్యేక రాష్ట్రంపై తుది అల్టిమేటం ఇచ్చింది. కొండ ప్రాంత సమస్యకు స్పష్టమైన హామీ ఇస్తేనే భాజపాతో కలిసి పని చేస్తామని చెబుతోంది.
- 2019లో దార్జీలింగ్ సీటును బిస్తా 4 లక్షలకుపైగా మెజారిటీతో గెలుచుకున్నారు. 59శాతం ఓట్లు ఆయనకు వచ్చాయి. 2017లో 104 రోజులపాటు జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా తృణమూల్ వేధింపులపై కోపంతో అప్పట్లో ప్రజలు బిస్తాకు మద్దతుగా నిలిచారు.
టీ, టూరిజానికి ప్రసిద్ధి
దార్జీలింగ్ ప్రాంతం టీ తోటలు, టూరిజం, కలప పరిశ్రమలకు ప్రసిద్ధి. ప్రత్యేక రాష్ట్రం కోసం ఇక్కడ 1980 నుంచి హింసాత్మక ఉద్యమాలు జరుగుతున్నాయి. చివరిసారిగా 2017లో 104 రోజులపాటు ఆందోళనలు సాగాయి. దార్జీలింగ్ ప్రాంతంలో గూర్ఖా వర్గంతోపాటు లేప్చాలు, షెర్పాలు, భూటియాలు ఉన్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి గూర్ఖాలాండ్ విడిపోవాలనే డిమాండు శతాబ్దం కిందటి నుంచి ఉన్నా 1986లో జీఎన్ఎల్ఎఫ్ నాయకుడు సుభాశ్ ఘీషింగ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించడంతో తీవ్ర రూపం దాల్చింది. 1988లో దార్జీలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటు సందర్భంగా జరిగిన హింసలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత 2011 వరకూ కౌన్సిల్ కొనసాగింది. 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్.. జీటీఏ ఏర్పాటు చేసింది. కేంద్రం, రాష్ట్రం, జీజేఎం మధ్య ఒప్పందంలో భాగంగా ఇది ఏర్పాటైంది. దీనికి గురుంగ్ నాయకత్వం వహించారు. ఆ తర్వాత మళ్లీ 2013లో, 2017లో ఉద్యమాలు జరిగాయి.
సొంత పార్టీ నుంచే పోటీ
ఈసారి బిస్తాపై భాజపా ఎమ్మెల్యే బిష్ణు ప్రసాద్ శర్మ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఈ ప్రాంత సమస్యను సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ పరిధిలోనే ఈ ప్రాంత సమస్యకు రాజకీయ పరిష్కారం చూపుతామని ఆయన చెబుతున్నారు.
- కాంగ్రెస్, లెఫ్ట్, హమ్రో పార్టీ కూటమి తరఫున భారతీయ గూర్ఖా పరిసంఘ్ అధ్యక్షుడు మునీశ్ తమాంగ్ బరిలోకి దిగారు. గూర్ఖాలాండ్కు చెందిన న్యాయవాది అయిన ఆయన.. భాజపా ఇక్కడి ప్రజలను మోసం చేసిందని ఆరోపిస్తున్నారు.
- బీజీపీఎంతో జట్టు కట్టిన తృణమూల్ తమ అభ్యర్థిగా మాజీ ఉన్నతాధికారి గోపాల్ లామాను పోటీకి నిలిపింది. తృణమూల్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని ఆయన అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?