సంక్షిప్త వార్తలు (5)
ఓబీసీ కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ దేశాన్ని ఇస్లామీకరించడం, విభజించడం దిశగా ముందుకు తీసుకువెళ్లే చర్య.
దేశాన్ని ఇస్లామీకరించడానికే ముస్లిం కోటా
ఓబీసీ కోటా నుంచి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న కాంగ్రెస్ హామీ దేశాన్ని ఇస్లామీకరించడం, విభజించడం దిశగా ముందుకు తీసుకువెళ్లే చర్య. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులను దూరం చేయాలని కాంగ్రెస్ కోరుకుంటోంది.
ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
ప్రజల మధ్య చీలికను కోరుకుంటున్న మోదీ
దేశ ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలనుకుంటున్న ప్రధాని మోదీకి వ్యతిరేకంగా విపక్ష ఇండియా కూటమి పోరాడుతోంది. భాజపా పాలనలోని తప్పుడు నిర్ణయాలను సరిదిద్దుతాం. స్వతంత్రంగా వ్యవహరించేలా ఎన్నికల కమిషన్ను మార్చాల్సి ఉంది. న్యాయవ్యవస్థ కూడా స్వతంత్రంగా వ్యవహరించేలా చూడాలి.
శ్రీనగర్ ఎన్నికల ప్రచారంలో ఎన్సీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా
డైనోసర్ జాతిలా అంతరించిపోనున్న కాంగ్రెస్
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కుటుంబ పెద్ద చనిపోయిన తర్వాత ఆస్తిలో 55 శాతం మాత్రమే వారసులకు వెళ్లేలా చట్టం వస్తుంది. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు త్వరలోనే కనుమరుగవుతాయి. కాంగ్రెస్ పార్టీ తీరు చూస్తుంటే త్వరలోనే ఆ పార్టీ డైనోసర్ జాతిలా అంతరించిపోతుంది.
ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
భాజపాను క్లీన్బౌల్డ్ చేయండి
వారు(భాజపా) బౌలింగ్ చేయలేరు.. బ్యాటింగ్ చేయలేరు. మేం ఆరు బంతులకు ఆరు సిక్స్లు కొడతాం. ప్రజలంతా భాజపాను క్లీన్బౌల్డ్ చేయాలి. ఈ ఎన్నికల్లో భాజపా వ్యతిరేక రాజకీయాలకు తెరపడుతుంది. కన్నౌజ్ సౌగంధం మళ్లీ గుబాళిస్తుంది.
కన్నౌజ్లో నామినేషన్ దాఖలు సందర్భంగా ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
‘మోదీ కీ గ్యారంటీ’ మాయంతో..
అబద్ధాల బాటలో భాజపా
ఉనికిలోకి రాకుండానే ‘మోదీ కీ గ్యారంటీ’ హామీ మాయం కావడంతో భాజపా భయం గుప్పిట్లోకి జారుకుంది. దీంతో ‘సంపద పునఃపంపిణీ’ ‘వారసత్వ పన్ను’ వంటి అంశాలపై తయారు చేసిన వివాదాలను పట్టుకువేలాడుతోంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోతో కాషాయ దళం గిలగిల్లాడుతోంది.
దిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.