ముస్లింల ఓట్ల కోసం బడుగుల రిజర్వేషన్లను గుంజుకుంటారు
ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది ‘ఇండియా’ కూటమి విధానమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు.
ఆ మేరకు రాజ్యాంగాన్ని మారుస్తారు
ఇండియా కూటమిపై మోదీ ధ్వజం
మురైనా, ఆగ్రా, బరేలీ: ముస్లిం ఓటుబ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బడుగువర్గాల రిజర్వేషన్లు గుంజుకునేలా రాజ్యాంగాన్ని మార్చాలన్నది ‘ఇండియా’ కూటమి విధానమని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. కర్ణాటకలో కాంగ్రెస్ అనేకమంది ముస్లింలను అక్రమంగా ఓబీసీ జాబితాలో చేర్చిందని ఆరోపించారు. గురువారం మధ్యప్రదేశ్లోని మురైనా, యూపీలోని ఆగ్రా, షాజహాన్పుర్, బరేలీ సభల్లో మాట్లాడిన మోదీ కాంగ్రెస్పై మరోసారి నిప్పులు చెరిగారు. ‘‘నేను కూడా ఓబీసీ వర్గీయుణ్నే. కాంగ్రెస్ కర్ణాటక మోడల్ చూసి నేనే భయపడ్డా. ఇక సామాన్యుల మాటేమిటి?’’ అని అన్నారు. సమాజ్వాదీ పార్టీ మద్దతుతో యూపీలోనూ ఇదే ఆట ఆడాలని కాంగ్రెస్ చూస్తున్నట్లు తెలిపారు. ఓటుబ్యాంకు రాజకీయాల్లో పడి తనను ఎంతగానో నమ్ముకొన్న యాదవులకు, బీసీలకు అఖిలేశ్ పార్టీ ద్రోహం చేస్తోందన్నారు. ఈమధ్య ‘కామ్దార్’ (పనిమంతుడు) అయిన తనను దుర్భాషలాడుతూ ‘నామ్దార్’ (పేరున్న వ్యక్తి) యువరాజు ఆనందిస్తున్నారంటూ రాహుల్గాంధీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. యూపీలో ‘ఇద్దరు యువరాజులు’ బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారని రాహుల్, అఖిలేశ్లపై విమర్శలు గుప్పించారు. దేశ వనరులపై ముస్లింలకు తొలిహక్కు ఉందని కాంగ్రెస్ అంటుండగా, పేదలకు ఉందని తాను అంటున్నట్లు మోదీ తెలిపారు. దేశ ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టి మతపరమైన బుజ్జగింపుల ద్వారా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని ప్రమాదకరమైన ‘పంజా’ (కాంగ్రెస్ చిహ్నం) చూస్తోందన్నారు. దీన్ని అడ్డుకునేందుకే భాజపాకు 400 స్థానాలు కావాలని తాను కోరుతున్నట్లు మోదీ చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో జూన్ 4 తర్వాత తన ప్రభుత్వం వచ్చాక అవినీతిపరుల భరతం పడతానన్నారు.
ఇందిర సంపద కోసం వారసత్వ పన్నును రద్దుచేసిన రాజీవ్: ప్రధాని
రాజీవ్గాంధీ ప్రధానిగా ఉన్నపుడు తన తల్లి ఇందిరాగాంధీ సంపద ప్రభుత్వపరం కాకుండా కాపాడుకునేందుకు 1985లో వారసత్వ హక్కును (ఎస్టేట్ సుంకం) రద్దు చేశారని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందిర కుటుంబంలో నాలుగు తరాలు లబ్ధి పొందాక మళ్లీ ఇపుడు దేశ ప్రజలపై వారసత్వ పన్నును మరింత బలంగా రుద్దాలని కాంగ్రెస్ చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందిరాజీ తన ఆస్తిని కుమారుడు రాజీవ్గాంధీ పేరున రాసినట్లు అప్పట్లో చర్చలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల సంపాదనలో సగభాగాన్ని ‘ఎక్స్రే’ (సర్వే) చేసి మరీ ఈ పన్ను కింద లాక్కొంటుందని మోదీ హెచ్చరించారు. భాజపా ఉన్నంతవరకు ఈ పనిని జరగనివ్వబోమని.. ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ లూటీ ప్రణాళికలకు మధ్య 56 అంగుళాల ఛాతీ గల ‘చౌకీదార్’ గోడలా నిలబడ్డాడని ప్రధాని అన్నారు. ఆర్థిక సర్వే ఒక్కటే కాదు.. దేశంలోని వివిధ సంస్థలు, కార్యాలయాలను కూడా సర్వే చేయాలని విపక్షం చూస్తున్నట్లు తెలిపారు. నాడు మత ప్రాతిపదికన దేశ విభజనకు అంగీకరించిన కాంగ్రెస్ పార్టీ తల్లి భారతి చేతులు తెగనరికిందని దుయ్యబట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
అన్న క్యాంటీన్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని: మంత్రి నారాయణ
-
వీలైనంత త్వరగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలి: సీఎం రేవంత్రెడ్డి
-
జీవో 317తో నష్టపోయిన ఉద్యోగుల వివరాలు ఇవ్వాలి: కేబినెట్ సబ్ కమిటీ
-
పెద్దగా మార్పు ఉండదు.. అది మాత్రమే తేడా: శుభ్మన్ గిల్
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు