కన్నడనాడు.. ఎవరికో గ్యారంటీ!
కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కన్నడసీమలో లోక్సభ ఎన్నికల తొలిదశ సమరం రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది.
నేడు 14 నియోజకవర్గాల్లో తొలివిడత
రెండు కూటములకూ కీలక సమరం
ఈనాడు, బెంగళూరు: కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న కన్నడసీమలో లోక్సభ ఎన్నికల తొలిదశ సమరం రెండు పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. అసెంబ్లీ పోరు సాగిన ఏడాదిలోపే రెండు ప్రధాన పార్టీలూ మరోసారి తలపడుతున్నాయి. కాకపోతే ఆ ఎన్నికల్లో త్రిముఖ పోరు సాగితే ఇప్పుడు ద్విముఖ పోరే. అప్పట్లో జేడీ-ఎస్ విడిగా పోటీచేయగా ఈసారి భాజపాతో జట్టుకట్టి, ఉనికి చాటేందుకు పోరాడుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో గెలుచుకున్న 25 స్థానాలను మళ్లీ సాధించుకోవాలని భాజపా, ఈ లక్ష్యానికి గంటికొట్టాలని కాంగ్రెస్ అన్నివిధాలా ప్రయత్నిస్తున్నాయి. మోదీ గ్యారంటీల పేరుతో భాజపా, ఐదు గ్యారంటీలంటూ కాంగ్రెస్.. ప్రచారం పూర్తిచేశాయి. 14 స్థానాల్లో కాంగ్రెస్ అన్నిచోట్లా పోటీ చేస్తుండగా ఎన్డీయే పక్షాలుగా భాజపా 11 చోట్ల, జేడీ-ఎస్ మూడుచోట్ల బరిలో ఉన్నాయి. గతసారి ఈ 14లో కాంగ్రెస్, జేడీ-ఎస్ ఒక్కో స్థానాన్నే గెలుచుకోగా మిగిలినవి భాజపా పరమయ్యాయి. ఈసారి బరిలో ఉన్న ప్రముఖుల్లో హెచ్.డి.కుమారస్వామి, శోభా కరంద్లాజె, సి.ఎన్.మంజునాథ, యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, డి.కె.సురేశ్, తేజస్వీసూర్య తదితరులు ఉన్నారు.
భాజపా: సామాజిక అస్త్రాలు
ప్రచారం కోసం ప్రధాని నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చి.. గత ఐదేళ్లలో అందించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి పథకాలపై విస్తృత ప్రచారం చేశారు. కాంగ్రెస్ హామీలు ఆచరణ సాధ్యం కానివంటూ- భాజపా గ్యారంటీలపై విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. బెంగళూరులో చివరి పర్యటనలో సామాజిక అస్త్రాలను సంధించారు. స్వేచ్ఛగా ప్రార్థనలు చేయలేని స్థితిలో హిందువులు ఉంటారని, కాంగ్రెస్ వంటి ప్రమాదకారి పార్టీకి అవకాశం ఇవ్వొద్దని హెచ్చరించారు.
కాంగ్రెస్: అభయ హస్తం
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన ఐదు గ్యారంటీలనే కాంగ్రెస్ ఈ ఎన్నికలకు రక్షగా భావిస్తోంది. జాతీయ స్థాయిలో ప్రకటించిన 25 గ్యారంటీలనూ ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది. పది నెలలుగా అమలుచేసిన పథకాల లబ్ధిదారులను విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్డీయే సర్కారు పదేళ్లలో రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమంటూ ఖాళీ చెంబుతో ప్రచారం చేసింది. లౌకికవాదాన్ని పార్టీ విధానంగా ప్రకటించుకునే జేడీ-ఎస్.. భాజపాతో చేయి కలపటాన్ని విమర్శిస్తూ మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఎన్డీయే: దళపతులకు అండ
2019 ఎన్నికల్లో అప్పటి విపక్ష పార్టీలైన కాంగ్రెస్, జేడీ-ఎస్ సమాజంలో తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయని మోదీ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో పరిస్థితి మారిపోయింది. 92 ఏళ్ల వయసులోనూ తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది మోదీని మళ్లీ ప్రధానిగా చూడడానికే అంటూ మాజీ ప్రధాని దేవెగౌడ ఇటీవల భావోద్వేగానికి లోనయ్యారు. తన లక్ష్యం కాంగ్రెస్ను ఓడించటమేనని ప్రచారం చేసిన జేడీ-ఎస్.. ఈ ఎన్నికల్లో మూడింటిలో కనీసం రెండైనా సాధించాలని చూస్తోంది.
తొలి విడత ఇలా..
మొత్తం స్థానాలు: 14
- నియోజకవర్గాలు: ఉత్తర, కేంద్ర, దక్షిణ, గ్రామీణ బెంగళూరు; ఉడుపి - చిక్కమగళూరు, హాసన, దక్షిణ కన్నడ, చిత్రదుర్గ, తుమకూరు, మండ్య, మైసూరు, చామరాజ నగర, చిక్కబళ్లాపుర, కోలారు
- పోలింగ్ కేంద్రాలు : 30,602
- ఓటర్లు : 2,88,19,342
- పురుషులు : 1,44,28,099
- మహిళలు : 1,43,88,176
- ఇతరులు : 3,067
- అభ్యర్థులు : 247 (పురుషులు - 226, మహిళలు-21)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మ స్వర్గం నుంచే తమ్ముణ్ని ఆశీర్వదించి ఉంటుంది
‘‘అమ్మ ఈ లోకంలో లేకపోయినా, తప్పకుండా స్వర్గం నుంచే నరేంద్ర భాయీని ఆశీర్వదించి ఉంటుంది’’ అంటూ చెమ్మగిల్లిన కళ్లతో సోమాభాయీ మోదీ అన్నారు. -
పాకిస్థాన్ను సంతోషపరిచే వ్యక్తిని గెలిపించాలా.. లేదా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారు
పాకిస్థాన్ను సంతోషపరిచే నాయకుడిని ఎన్నుకోవాలా? లేక దేశాన్ని బలోపేతం చేసే నేతను గెలిపించాలా అన్నది ఓటర్లు నిర్ణయిస్తారని భాజపా మంగళవారం పేర్కొంది. -
మూడో దశలో 64.58% పోలింగ్
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. -
అబద్ధాలాడే వారిని తిరస్కరించండి: సోనియా
అబద్ధాలు చెప్పేవారిని, విద్వేషాన్ని రెచ్చగొట్టేవారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పిలుపునిచ్చారు. అందరికీ సమానమైన, మెరుగైన అవకాశాలు లభించేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. -
ముస్లిం రిజర్వేషన్లకు నేను అనుకూలం : లాలూ
ముస్లింలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందించేందుకు తాను అనుకూలమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్యాదవ్ వ్యాఖ్యానించారు. -
ఏడోదశ ఎన్నికలకు నోటిఫికేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో చిట్టచివరిదైన ఏడో దశలో 57 లోక్సభ స్థానాల్లో జూన్ ఒకటో తేదీన ఎన్నికలు నిర్వహించడానికి మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. -
జీఎస్టీని సవరిస్తాం.. అగ్నివీర్ను రద్దుచేస్తాం
సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే వస్తు-సేవల పన్ను (జీఎస్టీ)ను సవరించి ఒకే శ్లాబుగా చేయడంతో పాటు, సైనిక నియామకాలకు ఉద్దేశించిన అగ్నివీర్ పథకాన్ని రద్దుచేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రకటించారు. -
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’
అయోధ్యలోని రామ మందిరానికి ‘బాబ్రీ తాళం’ వేయకుండా, కశ్మీర్లో ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురాకుండా కాంగ్రెస్ పార్టీని అడ్డుకునేందుకే ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వాలని తాను కోరుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. -
ముస్లింలకు వ్యతిరేకం కాను : మోదీ
ఇస్లాంను, ముస్లింలను తాను వ్యతిరేకించనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల సమరం వాడీవేడిగా జరుగుతున్న తరుణంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన ప్రధాని ఈ విధంగా స్పందించారు. -
మేనల్లుడిపై మాయావతి వేటు
తన రాజకీయ వారసుడిగా ఉన్న మేనల్లుడు, బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్పై పార్టీ అధ్యక్షురాలు మాయావతి వేటు వేశారు. -
భాజపాలోకి రాధికా ఖేడా
కాంగ్రెస్ను వీడిన రాధికా ఖేడాతో పాటు నటుడు శేఖర్ సుమన్ భాజపాలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే, జాతీయ మీడియా విభాగం ఇన్ఛార్జి అనిల్ బలూనీ సమక్షంలో వారు మంగళవారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. -
సంక్షిప్త వార్తలు
సార్వత్రిక సమరానికి సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన పోలింగ్ డేటాలో వైరుద్ధ్యాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం లేఖ రాశారు. -
ముగిసిన మూడోదశ.. 60 శాతం పోలింగ్ నమోదు
మూడో దశ ఎన్నికల్లో భాగంగా సాయంత్రం 5 గంటల వరకు 60.19 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం (Election Commission) వెల్లడించింది. -
మోదీ ప్రభుత్వంలో ఆ హక్కులన్నీ పారిశ్రామికవేత్తలకే : రాహుల్గాంధీ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. -
ఆ తెగల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సత్ఫలితాలిస్తోన్న ఈసీ చర్యలు
మారుమూల ప్రాంతాల్లోని వారికి కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ బూత్లు ఏర్పాటుచేయడం.. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించడం కోసం ఈసీ అన్ని రకాల చర్యలు చేపడుతోంది. -
పశువుల మేత మేసిన నేత.. రిజర్వేషన్లపై మాటలా?: లాలూపై మోదీ ఫైర్
PM Modi: ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. లాలూ దాణా కుంభకోణం గురించి ప్రస్తావిస్తూ గట్టిగా చురకలంటించారు. -
ఆ వీడియోను తొలగించండి : ‘ఎక్స్కు’ ఈసీ ఆదేశం
ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కర్ణాటక భాజపా షేర్ చేసిన ఓ వీడియోను తొలగించాలని ‘ఎక్స్’ను ఈసీ ఆదేశించింది. -
పరిస్థితులు ఏవైనా అధికారమే భాజపా లక్ష్యం : వీడియో సందేశంలో సోనియా విమర్శలు
ఎలాంటి పరిస్థితుల్లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా భాజపా ముందుకువెళ్తోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) విమర్శించారు. -
భాజపాలోకి నటుడు శేఖర్ సుమన్
ఇటీవల కాంగ్రెస్ను వీడిన నటుడు శేఖర్ సుమన్, కాంగ్రెస్ మాజీ నేత రాధికా ఖేడా ఇద్దరూ భాజపాలో చేరారు. -
మొన్న పూరీ.. నేడు చండీగఢ్.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు
చివరి నిమిషంలో అభ్యర్థులు వీడుతుండటం ఆయా పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. -
మీ ఓటు ఏం చేయగలదో తెలుసా..: ప్రధాని మోదీ
నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఆయన మధ్యప్రదేశ్లో నిర్వహించిన సభలో పలు ఆరోపణలు చేశారు.