మాటల మంటలపై కదిలిన ఈసీ
ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలనలోకి తీసుకుంది. దీనిపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు గురువారం నోటీసు జారీ చేసింది.
భాజపా, కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు
మోదీ, రాహుల్, ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ
ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి
దిల్లీ: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ విపక్షాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం (ఈసీ) పరిశీలనలోకి తీసుకుంది. దీనిపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు గురువారం నోటీసు జారీ చేసింది. రాజస్థాన్లో ప్రధాని మోదీ చేసిన వివాదాస్పద ప్రసంగంపై సోమవారం(ఈనెల 29)లోగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ పేరును ఆ నోటీసులో నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం. అయితే, ఒక ప్రధాన మంత్రి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ వచ్చిన ఫిర్యాదులను ఈసీ పరిశీలనకు తీసుకోవడం ఇదే మొట్టమొదటి సారని సీనియర్ అధికారులు తెలిపారు. ఆ నోటీసుతో పాటు ప్రధాని మోదీ రాజస్థాన్ ప్రసంగంపై కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ(ఎం), పౌర సమాజ బృందాలు చేసిన ఫిర్యాదులను ఎన్నికల సంఘం జత చేసింది. పార్టీ స్టార్ క్యాంపెయినర్ల రాజకీయ ప్రసంగాలు ఉన్నత ప్రమాణాలను పాటించేలా ఉండాలని భాజపా అధ్యక్షుడు నడ్డాకు ఈసీ స్పష్టం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని చిత్తశుద్ధితో పాటించేలా చూసుకోవాలని తెలిపింది. ఉన్నత పదవుల్లోని నేతలు చేసే ప్రసంగాలకు ప్రభావ తీవ్రత అధికంగా ఉంటుందని గుర్తు చేసింది. స్టార్ క్యాంపెయినర్ల వివాదాస్పద ప్రసంగాలపై చర్యలకు ఉపక్రమించే తొలి అడుగులో భాగంగా ఆయా పార్టీల అధ్యక్షులను బాధ్యులను చేయడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం నిబంధనలను ఈసీ వర్తింపజేస్తోంది.
2019 లోక్సభ ఎన్నికల్లోనూ ప్రధాని మోదీపై విపక్షాలు ఫిర్యాదు చేయగా ఈసీ క్లీన్చిట్ ఇచ్చింది. అయితే, అప్పటి ఎలక్షన్ కమిషనర్ అశోక్ లావాసా ఈసీ నిర్ణయంపై తన అసమ్మతిని తెలిపారు.
కాంగ్రెస్కూ అదే తరహాలో నోటీసు
ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డాకు నోటీసు పంపిన తరహాలోనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేపై వచ్చిన ఫిర్యాదులపైనా ఈసీ స్పందించింది. హస్తం పార్టీ నేతల పేర్లు ప్రస్తావించకుండానే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు విడిగా నోటీసు పంపించింది. వారిపై భాజపా చేసిన ఫిర్యాదులను జత చేసింది. సోమవారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ కేరళలో చేసిన ప్రసంగాలపై, ప్రధాని మోదీపై వ్యాఖ్యలకు భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపిన విషయం తెలిసిందే. దళితుడిననే కారణంతో తనను అయోధ్య రామాలయం ప్రారంభానికి ఆహ్వానించలేదంటూ ఖర్గే ఆరోపించడం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని భాజపా ఫిర్యాదులో పేర్కొంది.
ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే: సీపీఎం
ప్రధాని మోదీ వివాదాస్పద ప్రసంగంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసినందుకు, విద్వేషాలను రెచ్చగొట్టినందుకు ప్రధానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఈసీని కోరారు.
ప్రధానిపై ఫిర్యాదులకు జాగ్రత్తగా స్పందించిన ఈసీ : జైరాం రమేశ్
ప్రధాని మోదీపై ఫిర్యాదుల విషయానికి వచ్చే సరికి ఎన్నికల సంఘం చాలా చాలా జాగ్రత్తగా స్పందించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు. ఈసీ నోటీసులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ వినియోగిస్తున్న భాష.. ప్రజాప్రాతినిధ్య చట్టం, సుప్రీంకోర్టు తీర్పులను తీవ్రంగా ఉల్లంఘించేలా ఉంటోందన్నారు. ‘మరికొందరు భాజపా అభ్యర్థులు చేస్తున్న ప్రసంగాలపైనా ఫిర్యాదు చేశాం. ఈసీ నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇస్తామ’ని జైరాం రమేశ్ తెలిపారు. మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయీ, మన్మోహన్ సింగ్లపై ఎన్నడూ ఈసీకి ఫిర్యాదులు రాలేదని గుర్తు చేశారు. ప్రధాని మోదీపై ఫిర్యాదు చేయడం ఇది రెండోసారని పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?