అమేఠీ నుంచీ రాహుల్ పోటీ?
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
రాయ్బరేలీలో ప్రియాంక!
నేడో రేపో ప్రకటించే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ప్రచారం ప్రారంభించడానికి ముందు శ్రీరాముడి పూజల నిమిత్తం వీరు అయోధ్యలో నూతన రామాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండడంపై అధికారపక్షం పెద్దఎత్తున విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో దానినో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక అక్కడికి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరిగే స్థానాల్లో ఈ రెండూ ఉన్నాయి. నామినేషన్ దాఖలుకు మే 3 వరకు గడువు ఉంది. రాహుల్, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామపత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా అక్కడ శుక్రవారం పోలింగ్ జరగనుంది. అది ముగిసిన తర్వాత అమేఠీపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. 2019 లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఓటమిపాలయ్యారు. అప్పుడు భాజపా నుంచి నెగ్గిన స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీకి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. సోదరి వరసయ్యే ప్రియాంకపై రాయ్బరేలీ నుంచి పోటీ చేయడానికి భాజపా ఎంపీ వరుణ్గాంధీ నిరాకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఆ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
ఎన్నికలు మోదీ చేజారిపోయాయి: రాహుల్
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు కమలం చేజారిపోయాయన్నది ప్రధాని నరేంద్రమోదీకి తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ పార్టీ ఇస్తున్న గ్యారంటీలకు, మోదీ గ్యారంటీలకు మధ్య స్పష్టమైన తేడా ఉందన్నారు. ‘భారతీయుల ప్రభుత్వం’ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్స్) ఏర్పాటుకు కాంగ్రెస్ హామీ ఇస్తోందని గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పేద మహిళలకు నెలకు రూ.8,500 ఇవ్వడం, యువతకు ఏటా రూ.లక్ష లభించే ఉద్యోగాలు కల్పించడం, 30 లక్షల ఖాళీల భర్తీ, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత వంటి హామీలను తాము ఇస్తున్నామని గుర్తుచేశారు. ‘‘మోదీ మాత్రం అదానీ సర్కారు ఏర్పాటుకు హామీ ఇస్తున్నారు. దేశ సంపద అంతా కొద్దిమంది బిలియనీర్ల జేబుల్లోకి వెళ్తుంది. విరాళాల వ్యాపారంతో దోచుకుంటారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పాతర వేస్తారు. రైతులకు రుణాలందవు. రెండు పార్టీల హామీల మధ్య తేడా సుస్పష్టం’’ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, దీనిలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఆయన మరో వీడియో సందేశంలో ఓటర్లను కోరారు. ప్రజల అంశాలతో మ్యానిఫెస్టోను తాము రూపొందించామని, దానిలో ప్రజావాణి ఉందని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మొన్న పూరీ.. నేడు చండీగఢ్.. నిధులు లేవని టికెట్లను వెనక్కి ఇచ్చేస్తున్న నేతలు
చివరి నిమిషంలో అభ్యర్థులు వీడుతుండటం ఆయా పార్టీలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. -
మీ ఓటు ఏం చేయగలదో తెలుసా..: ప్రధాని మోదీ
నాలుగో విడత ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై పదునైన అస్త్రాలను ఎక్కుపెట్టారు. ఆయన మధ్యప్రదేశ్లో నిర్వహించిన సభలో పలు ఆరోపణలు చేశారు. -
ఓటరే రాజు.. ఓటరే రాణి: ఆకట్టుకుంటోన్న రాయల్ పోలింగ్ బూత్
Lok Sabha Elections: ప్రజాస్వామ్య పండగలో భారీ సంఖ్యలో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద చేసిన ఏర్పాట్లు ఆకట్టుకుంటున్నాయి. -
డ్రాగన్ కుట్రలు.. ఇతర దేశాల ఎన్నికల్లో చైనా జోక్యం ఇలా..
ఇతర దేశాల ఎన్నికల ప్రక్రియలో చైనా జోక్యం పెరుగుతోంది. డ్రాగన్ కుట్రలు ఆందోళన కలిగిస్తున్నాయి. -
కొనసాగుతోన్న మూడో దశ పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
PM Modi: అహ్మదాబాద్లోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో ప్రధాని మోదీ ఓటేశారు. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన మూడో విడత పోలింగ్
Lok Sabha Elections: మూడో విడతలో 17.24 కోట్ల మంది ఓటు వేయనున్నారు. 93 లోక్సభ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది -
నేడే మూడోవిడత.. 93 స్థానాలకు జరగనున్న పోలింగ్
మండుటెండల్లో హోరాహోరీగా సాగుతున్న సార్వత్రిక సమరంలో మరో దశ పోలింగ్కు సర్వం సన్నద్ధమైంది. -
కాంగ్రెస్ కార్యాలయం ఎదుట నిలిపి ఉంచిన కార్లు ధ్వంసం
తమ పార్టీ కార్యాలయం బయట పార్కింగ్ చేసిన డజనుకు పైగా కార్లను కొందరు దుండగులు ధ్వంసం చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. -
ఇకపై పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడే తెలుసుకోవచ్చు
తొలి, రెండో విడతల పోలింగ్ వివరాలను వెల్లడించడంలో ఈసీ జాప్యం చేసిందంటూ విపక్షాలు చేసిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. -
చొరబాట్లను అరికడతాం
పశ్చిమబెంగాల్ ఎదుర్కొంటున్న చొరబాట్ల ముప్పును భాజపా అరికడుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. -
నకిలీ వీడియోలను తొలగించండి
సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న నకిలీ వీడియోలు, అసత్య ప్రచారాలపై ఎన్నికల సంఘం (ఈసీ) కన్నెర్ర చేసింది. -
ప్రజ్వల్లాంటి వారిని సహించకూడదు
కర్ణాటకకు చెందిన జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణలాంటి వారిని సహించకూడదని ప్రధాని మోదీ చెప్పారు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తి మనదేశం దాటి వెళ్లిపోవడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారే కారణమని ఆరోపించారు. -
ఎన్డీయేకు 150 సీట్లైనా రావు
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే పక్షాలకు 150 సీట్లు కూడా రావడం కష్టమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చెప్పారు. -
ఒడిశాలో కమల వికాసం ఖాయం
‘‘ఒడిశాలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అస్తమించే సూర్యుడు. కాంగ్రెస్ ఎప్పుడో కొట్టుకుపోయింది. -
సంక్షిప్త వార్తలు (8)
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. -
మీలాగే నేనూ ఆస్వాదించా
లోక్సభ ఎన్నికల ప్రచారంతో క్షణం తీరికలేకుండా ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి ఆకర్షించింది. -
అక్కడ కాంగ్రెస్ ఓటు ‘నోటా’కే!
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల విజయం కోసం ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. -
ఖలిస్థానీ అనుకూల గ్రూపుల నుంచి నిధుల స్వీకరణ.. కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు..!
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కులు మరింత పెరగనున్నాయి. ఈసారి ఎన్ఐఏ ఆయనపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. -
రామమందిర తీర్పును మార్చేందుకు రాహుల్ యత్నం: కాంగ్రెస్ బహిష్కృత నేత ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై ఆ పార్టీ మాజీ నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. -
‘కంగనకు కాస్త చరిత్ర చెప్పండి’: భాజపాకు కాంగ్రెస్ నేత సలహా
భాజపా నేత కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ నేత ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు కొంచెం చరిత్ర చెప్పాలని సూచించారు.
తాజా వార్తలు
-
సోమవారం ముడతల దుస్తులు ధరించండి..! సీఎస్ఐఆర్ వినూత్న ప్రచారం
-
మూడో నెలా పేటీఎం లావాదేవీలు డౌన్.. టాప్లో ఫోన్పే, గూగుల్పే
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్కు సుప్రీం సూచన
-
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
-
చైనా ఆసుపత్రిలో దారుణం.. కత్తి దాడిలో పలువురి మృతి
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?