అమేఠీ నుంచీ రాహుల్ పోటీ?
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది.
రాయ్బరేలీలో ప్రియాంక!
నేడో రేపో ప్రకటించే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్బరేలీలలో ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. అమేఠీ నుంచి రాహుల్ గాంధీ, రాయ్బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు స్థానాల్లో ప్రచారం ప్రారంభించడానికి ముందు శ్రీరాముడి పూజల నిమిత్తం వీరు అయోధ్యలో నూతన రామాలయానికి వెళ్లనున్నట్లు సమాచారం. జనవరి 22న జరిగిన బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ దూరంగా ఉండడంపై అధికారపక్షం పెద్దఎత్తున విమర్శలు చేస్తూ వస్తోంది. ఎన్నికల ప్రచారంలో దానినో ప్రధానాంశంగా ప్రజల్లోకి తీసుకువెళ్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్, ప్రియాంక అక్కడికి వెళ్లనున్నట్లు వస్తున్న వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్ జరిగే స్థానాల్లో ఈ రెండూ ఉన్నాయి. నామినేషన్ దాఖలుకు మే 3 వరకు గడువు ఉంది. రాహుల్, ప్రియాంక వేర్వేరు రోజుల్లో నామపత్రాలు సమర్పించనున్నట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీచేస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతలో భాగంగా అక్కడ శుక్రవారం పోలింగ్ జరగనుంది. అది ముగిసిన తర్వాత అమేఠీపై కాంగ్రెస్ అధికారిక ప్రకటన చేయవచ్చని భావిస్తున్నారు. 2004 నుంచి వరుసగా మూడుసార్లు అమేఠీకి ప్రాతినిధ్యం వహించిన రాహుల్.. 2019 లోక్సభ ఎన్నికల్లో అక్కడ ఓటమిపాలయ్యారు. అప్పుడు భాజపా నుంచి నెగ్గిన స్మృతి ఇరానీ ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే స్థానంలో పోటీ చేస్తున్నారు. రాయ్బరేలీకి 2004 నుంచి సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించి ఇటీవల రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఆ స్థానం నుంచి ప్రియాంక పోటీ చేస్తారని ప్రచారంలో ఉంది. సోదరి వరసయ్యే ప్రియాంకపై రాయ్బరేలీ నుంచి పోటీ చేయడానికి భాజపా ఎంపీ వరుణ్గాంధీ నిరాకరించారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంతవరకు ఆ పార్టీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించలేదు.
ఎన్నికలు మోదీ చేజారిపోయాయి: రాహుల్
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలు కమలం చేజారిపోయాయన్నది ప్రధాని నరేంద్రమోదీకి తెలుసునని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తమ పార్టీ ఇస్తున్న గ్యారంటీలకు, మోదీ గ్యారంటీలకు మధ్య స్పష్టమైన తేడా ఉందన్నారు. ‘భారతీయుల ప్రభుత్వం’ (గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్స్) ఏర్పాటుకు కాంగ్రెస్ హామీ ఇస్తోందని గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పేద మహిళలకు నెలకు రూ.8,500 ఇవ్వడం, యువతకు ఏటా రూ.లక్ష లభించే ఉద్యోగాలు కల్పించడం, 30 లక్షల ఖాళీల భర్తీ, కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత వంటి హామీలను తాము ఇస్తున్నామని గుర్తుచేశారు. ‘‘మోదీ మాత్రం అదానీ సర్కారు ఏర్పాటుకు హామీ ఇస్తున్నారు. దేశ సంపద అంతా కొద్దిమంది బిలియనీర్ల జేబుల్లోకి వెళ్తుంది. విరాళాల వ్యాపారంతో దోచుకుంటారు. రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి పాతర వేస్తారు. రైతులకు రుణాలందవు. రెండు పార్టీల హామీల మధ్య తేడా సుస్పష్టం’’ అని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ఈ ఎన్నికలు జరుగుతున్నాయని, దీనిలో కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ఆయన మరో వీడియో సందేశంలో ఓటర్లను కోరారు. ప్రజల అంశాలతో మ్యానిఫెస్టోను తాము రూపొందించామని, దానిలో ప్రజావాణి ఉందని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే