రెండోవిడతలో 63.5% పోలింగ్
దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండోదశలో సుమారు 63.5% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూర్తి సమాచారం వచ్చాక ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది.
88 స్థానాల్లో పూర్తయిన ప్రక్రియ
స్వల్ప ఘటనలు మినహా దాదాపు ప్రశాంతం
దిల్లీ, ఈనాడు-బెంగళూరు: దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండోదశలో సుమారు 63.5% మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. పూర్తి సమాచారం వచ్చాక ఇది మరికొంత పెరిగే అవకాశం ఉంది. తొలి విడతలో 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. దాదాపు 65.5 శాతం పోలింగ్ నమోదైంది. రెండో విడత కింద 13 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 నియోజకవర్గాలకు శుక్రవారం నిర్వహించిన పోలింగ్ చాలావరకు ప్రశాంతంగానే ముగిసింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలింగ్ బహిష్కరణ వంటివి కొన్నిచోట్ల కనిపించాయి. శతాధిక వృద్ధులు, ఆసుపత్రుల్లోని రోగులు సయితం ఉత్సాహంగా స్పందించి ప్రజాస్వామ్య స్ఫూర్తి పరిఢవిల్లేలా చేశారు. కొంతమంది ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. మధ్యాహ్నం వేడిమి ఎక్కువగా ఉండడంతో అనేకమంది సాయంత్రం చల్లబడ్డాక ఇళ్లనుంచి బయటకు వచ్చారు. 6 గంటలకు పోలింగ్ ముగియాల్సి ఉన్నా, ఆ సమయంలోపు ఆయా కేంద్రాలకు చేరుకున్నవారంతా ఓటువేసేందుకు అవకాశం ఉండటంతో ఆ తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది.
ఈవీఎంలలో లోపాలు
ఛత్తీస్గఢ్లోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ముగించారు. కేరళ, పశ్చిమ బెంగాల్లలో కొన్ని పోలింగ్ బూత్ల ఈవీఎంలలో లోపాలు తలెత్తాయి. ఆ రెండు రాష్ట్రాల్లో బోగస్ ఓట్ల ఆరోపణలూ వచ్చాయి. బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న 41 మంది రోగులు పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేసేందుకు ఆస్పత్రి యాజమాన్యంతో పాటు ప్రభుత్వ అధికార యంత్రాంగం సహకరించింది. దక్షిణ కన్నడ జిల్లా బెల్థంగడి తాలూకాలోని మారుమూల గ్రామంలో 111 మంది ఓటర్లలో అందరూ ఓట్లు వేయడంతో అక్కడ 100% పోలింగ్ నమోదైనట్లయింది. చామరాజనగర జిల్లాలో రెండువర్గాల మధ్య ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి. ఛత్తీస్గఢ్లోని బస్తర్, కాంకేర్లలో 46 గ్రామాలవారు తమ సొంతగ్రామాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో తొలిసారి ఓటువేశారు.
కేరళలో ఓటు వేశాక 8 మంది మృతి
కేరళలోని పాలక్కాడ్, అలప్పుజ, మలప్పురం తదితర చోట్ల ఓటువేసి వచ్చాక వడదెబ్బ తగలడం వంటి కారణాలతో 8 మంది చనిపోయారు.ఛత్తీస్గఢ్లోని మహాసముంద్ స్థానంలో ఓ ప్రభుత్వ పాఠశాలలో ఎన్నికల విధులకు వచ్చిన మధ్యప్రదేశ్ ప్రత్యేక సాయుధ దళం జవాను ఒకరు తన సర్వీసు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతూ వీడియోను సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసినందుకు బెంగళూరు దక్షిణ నియోజకవర్గ భాజపా అభ్యర్థి తేజస్వీ సూర్యపై కేసు నమోదైంది. ప్రతిసారీ బెంగళూరులో నాలుగు స్థానాల్లో నమోదయ్యే పోలింగ్ కంటే 10శాతం అదనంగా ఓటర్లు ఈసారి పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు.
రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం
అస్సాం 71.11, బిహార్ 55.08, ఛత్తీస్గఢ్ 73.62, జమ్మూకశ్మీర్ 71.91, కర్ణాటక 69.23, కేరళ 65.91, మధ్యప్రదేశ్ 57.88, మహారాష్ట్ర 57.83, మణిపుర్ 77.32, రాజస్థాన్ 64.07, త్రిపుర 79.46, ఉత్తరప్రదేశ్ 54.85, పశ్చిమబెంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదు చేశాయి. తొలిదశలో తమిళనాడు, ఉత్తరాఖండ్, అరుణాచల్ప్రదేశ్, మేఘాలయ, అండమాన్-నికోబార్, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్లలో పోలింగ్ ముగిసింది. తాజాగా రెండోదశ ఎన్నికలతో కేరళ, రాజస్థాన్, త్రిపురల్లో పోలింగ్ ముగిసినట్లయింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్
-
భయపెడుతున్న ఏపీ రెవెన్యూ, ద్రవ్యలోటు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ