ఎడ్లబళ్లలో.. చక్రాల కుర్చీల్లో.. నిబద్ధత చాటుకున్న ఓటర్లు
కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా చక్రాల కుర్చీల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారు ఒకరైతే, ఎడ్లబళ్లలో తరలివచ్చి హక్కు వినియోగించుకున్నవారు మరికొందరు. ఎండ పెరిగితే కష్టమని భావించి ఉదయాన్నే ఓటు వేయడానికి వచ్చినవారు ఇంకొందరు.
బెంగళూరులో ఓటు వేసినవారికి దోశ, లడ్డూ ఫ్రీ
పోలింగ్ బూత్లకు రావాలంటూ అగ్రనేతల పిలుపు
దిల్లీ: కదల్లేని పరిస్థితుల్లో ఉన్నా చక్రాల కుర్చీల్లో పోలింగ్ కేంద్రాలకు వచ్చినవారు ఒకరైతే, ఎడ్లబళ్లలో తరలివచ్చి హక్కు వినియోగించుకున్నవారు మరికొందరు. ఎండ పెరిగితే కష్టమని భావించి ఉదయాన్నే ఓటు వేయడానికి వచ్చినవారు ఇంకొందరు. ఓటు వేసినట్లు వేలికి సిరాగుర్తు చూపిస్తే అల్పాహారం ఉచితంగా తీసుకోవచ్చని అవకాశం ఇచ్చిన రెస్టారెంట్లు మరికొన్ని. లోక్సభ ఎన్నికల రెండోదశ కింద శుక్రవారం పోలింగ్ జరిగిన ప్రాంతాల్లో ఇలాంటి భిన్న దృశ్యాలు కనిపించాయి.
రెస్టారెంట్ల ముందు బారులు
ఓటువేసి వచ్చినవారికి బెంగళూరు నగరంలోని వివిధ హోటళ్లు దోశ, లడ్డూ, కాఫీతో పాటు ఇతర ఆహార పదార్థాలను ఉచితంగా లేదా తక్కువ ధరకు అందించాయి. దీంతో పలు రెస్టారంట్ల వద్ద భారీసంఖ్యలో జనం బారులుదీరారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. బేకరీలు, వినోద కేంద్రాలు, పార్కులు, కొన్ని టాక్సీ సర్వీసులు 20-30 శాతం రాయితీ ఇచ్చాయి. గత లోక్సభ ఎన్నికల్లో బెంగళూరులో పోలింగ్ 54% దాటకపోవడంతో ఈసారి కొత్త ఆలోచనలతో చాలామంది ముందుకు వచ్చారు.
క్యూలో నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బెంగళూరులోని పోలింగ్బూత్ వద్ద క్యూలో నిల్చొని ఓటు వేశారు. మాజీ క్రికెటర్లు రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, ప్రముఖ నటుడు ప్రకాశ్రాజ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి, కేంద్రమంత్రి శోభా కరంద్లాజె తదితరులు ఇదే నగరంలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. వేర్వేరు రాష్ట్రాల్లో ఓట్లు వేసిన ప్రముఖుల్లో విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుటుంబం, పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ శెకావత్, మళయాళ నటుడు సురేశ్ గోపి తదితరులున్నారు.
ఛత్తీస్గఢ్లోని కాంకేర్లో ఓ పోలింగ్ కేంద్రాన్ని పెళ్లిమంటపంలా అలంకరించారు. సంప్రదాయ వివాహ క్రతువుల్ని అక్కడ ప్రదర్శించారు. కాంకేర్తో పాటు రాజ్నంద్గావ్, మహాసముంద్ లోక్సభ స్థానాల్లో సంప్రదాయ దుస్తుల్లో పలువురు వధూవరులు హాజరై ఓటువేశారు. యూపీలోని బులంద్శహర్లో మహిళా ఓటర్లు డోలు వాయించుకుంటూ ఎడ్లబళ్లలో వచ్చారు. రాజస్థాన్లో 108 ఏళ్ల వృద్ధురాలు, జమ్మూ-కశ్మీర్లో 102 ఏళ్ల వృద్ధుడు తమ వయసును లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాజస్థాన్లోని జాలోర్లో ఒకే కుటుంబంలో మూడుతరాలకు చెందిన ఓటర్లు (తాత, తండ్రి, మనవడు) హాజరై అందరినీ ఆకట్టుకున్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో ఓటు వేయడానికి భాజపా అభ్యర్థి నవనీత్ రాణా తన భర్తతో కలిసి బైక్పై వచ్చారు.
ఓటును గుర్తుచేసేలా గూగుల్ డూడుల్
ఆయా సందర్భాలకు తగ్గట్టు హోంపేజీని తీర్చిదిద్దే గూగుల్ ఈసారి ఓటును గుర్తుచేసే చిహ్నాన్ని ప్రదర్శించింది. చేతి చూపుడువేలుకు సిరాముద్ర కనిపించేలా ఏర్పాటు చేసింది. తమ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరగకపోవడాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని పర్భణీ, ఉత్తర్ప్రదేశ్లోని మథుర, తూర్పు త్రిపుర నియోజకవర్గాల పరిధిలో కొందరు గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. చేతితో రూపొందించిన పట్టువస్త్రాలను ప్రోత్సహించాలంటూ కర్ణాటకలోని చామరాజనగర జిల్లాలో ఎనిమిది మంది ఎన్నికల అధికారిణులు ప్రత్యేక చీరలు ధరించి విధులు నిర్వర్తించారు. ‘ఎన్నికల పర్వం.. దేశానికి గర్వం’ అనే అర్థమిచ్చే కన్నడ నినాదాన్ని వాటిపై అల్లారు.
బలోపేతం చేయాలని ఒకరు.. కాపాడుకోవాలని ఇంకొకరు..
ఓటర్లంతా పెద్దఎత్తున తరలి రావాలంటూ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్రమోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమతమ సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా పిలుపునిచ్చారు. ‘మీ ఓటు మీ వాణి. పెద్దఎత్తున పోలింగ్ జరిగితే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ముఖ్యంగా యువత, మహిళలు స్పందించాలి’ అని ప్రధాని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలంటూ ఖర్గేతో పాటు రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని, రాజ్యాంగాన్ని కాపాడే సైనికుల్లా నిలవాలని ఖర్గే కోరారు. తదుపరి సర్కారు కొద్దిమంది కుబేరులతో ఏర్పడాలా, 140 కోట్ల మంది భారతీయులతోనా అనేది మీ ఓటు నిర్ణయిస్తుందని దేశ పౌరులకు రాహుల్ చెప్పారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓట్లు వేయాలన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు
-
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM