భాజపా, కాంగ్రెస్.. నువ్వానేనా!
దేశంలోకెల్లా అతిచిన్న రాష్ట్రమైన గోవాలో సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రెండు లోక్సభ స్థానాలు (ఉత్తర గోవా, దక్షిణ గోవా) ఉన్నాయి.
గోవాలోని రెండు స్థానాల్లోనూ హోరాహోరీ
దేశంలోకెల్లా అతిచిన్న రాష్ట్రమైన గోవాలో సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో రెండు లోక్సభ స్థానాలు (ఉత్తర గోవా, దక్షిణ గోవా) ఉన్నాయి. రెండుచోట్లా భాజపా, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు కనిపిస్తోంది. వికసిత్ భారత్, మోదీ గ్యారంటీల ప్రస్తావనతో కమలనాథులు ప్రచారంలో దూసుకుపోతుండగా.. కాంగ్రెస్ అభ్యర్థులు తమ పార్టీ గ్యారంటీలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పార్లమెంటులో తమ వాణికి అంతగా ప్రాధాన్యం దక్కడం లేదంటూ కొన్నేళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న గోవా ప్రజలు ఈ దఫా ఎవరికి పట్టం కడతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఉత్తర గోవా: పాత పోరు
ఇది భాజపాకు కంచుకోట! ఆ పార్టీ తరఫున కేంద్రమంత్రి శ్రీపాద్ నాయక్ (71) మరోసారి పోటీ చేస్తున్నారు. పాతికేళ్లుగా ఇక్కడ ఆయనదే విజయం. అయితే దీర్ఘకాలంగా అధికారంలో ఉండటంతో నియోజకవర్గ ప్రజల్లో ఆయనపై కొంత వ్యతిరేకత పెరిగింది! స్థానికంగా కొందరు ఎమ్మెల్యేలు కూడా ఆయనకు పెద్దగా సహకరించడం లేదని తెలుస్తోంది. వరుసగా ఆరోసారి విజయం సాధించాలన్న ఆయన ప్రయత్నాలకు ఇవి కొంత విఘాతం కలిగించేవే. అయితే మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మద్దతు ఉండటం నాయక్కు కలిసొచ్చే విషయం. కాంగ్రెస్ ఇక్కడ 77 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి రమాకాంత్ ఖలప్కు టికెట్ ఇచ్చింది. ఆయన 1999లో ఇదే స్థానంలో శ్రీపాద్ నాయక్పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అప్పటికి ఖలప్ సిట్టింగ్ ఎంపీ. పాతికేళ్ల తర్వాత నాయక్, ఖలప్ ఉత్తర గోవాలో మరోసారి ముఖాముఖి తలపడుతుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. మరోవైపు- రెవల్యూషనరీ గోవన్స్ పార్టీ తరఫున 39 ఏళ్ల మనోజ్ పరబ్ బరిలో నిలిచారు. సీనియర్ నేతలకు తాను గట్టి పోటీ ఇస్తున్నానని, భాజపా కంచుకోటను బద్ధలు కొట్టి విజయం సాధిస్తానని ఆయన ధీమాగా చెబుతున్నారు.
దక్షిణ గోవా: యువ జోరు
ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం. అయితే ఈ దఫా ఇక్కడ భాజపా, కాంగ్రెస్ రెండూ కొత్తవారిని బరిలో దింపాయి. మీడియా రంగంలో ఉన్న పల్లవి డెంపోకు కమలదళం టికెట్ ఇచ్చింది. ఆమె పారిశ్రామికవేత్తల కుటుంబం నుంచి వచ్చారు. పల్లవి క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆలయాలు, చర్చిలను ఎక్కువగా సందర్శిస్తున్నారు. అభివృద్ధి, ప్రధాని మోదీ విజన్ గురించి ప్రసంగాల్లో తరచూ ప్రస్తావిస్తున్నారు. నౌకాదళంలో కెప్టెన్గా పనిచేసిన విరియాటో ఫెర్నాండెజ్ ఇక్కడ హస్తం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రజాగళాన్ని పార్లమెంటులో బలంగా వినిపిస్తానని ఆయన హామీ ఇస్తున్నారు. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గోవాను నాశనం చేస్తోందంటూ మండిపడుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మద్దతు ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ