చెరిగిపోతున్న వామపక్ష ముద్ర!
దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతమవుతున్నా.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు.
గత రెండు ఎన్నికల్లో గణనీయంగా తగ్గిన ఓట్లు, సీట్లు
ఈనాడు, దిల్లీ: దేశంలో కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు బలోపేతమవుతున్నా.. స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచీ ఉన్న వామపక్షాల ప్రాబల్యం మాత్రం విస్తరించడం లేదు. తొలి సార్వత్రిక ఎన్నికల నుంచి 2009 నాటి ఎన్నికల వరకు అవి పోటీ చేసిన స్థానాలు, దక్కించుకున్న సీట్లు, ఓట్లు కాస్త అటూఇటూగా ఒకేస్థాయికి పరిమితమయ్యాయి. పైగా 2014 నుంచి వామపక్షాల ప్రభావం మరింత తగ్గుముఖం పట్టింది.
కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా..
1964లో సీపీఐ నుంచి విడిపోయి సీపీఎం పుట్టుకొచ్చింది. అంతకుముందు జరిగిన తొలి మూడు సార్వత్రిక ఎన్నికల్లో సీపీఐ 1962లో గరిష్ఠంగా 29 సీట్లు, 9.94% ఓట్లు దక్కించుకుంది. ఇప్పటికీ ఆ పార్టీకి అత్యుత్తమ ప్రదర్శన అదే. సీపీఎం 2004లో గరిష్ఠంగా 43 సీట్లు గెలుచుకుంది. తొలినాళ్లలో దేశంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా వామపక్షాలు పనిచేశాయి. క్రమంగా ఆ పార్టీకి వ్యతిరేకంగా భావసారూప్య పార్టీలతో జట్టుకట్టడంతో.. పొత్తులు, సీట్ల సర్దుబాటులో భాగంగా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత..
వామపక్షాలు 1989 వరకు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంతో పనిచేశాయి. ఆ ఏడాది కేంద్రంలో ఏర్పడిన వీపీ సింగ్ ప్రభుత్వానికి బయటినుంచి మద్దతిచ్చాయి కూడా. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత వాటి పంథా మారింది. భాజపా వ్యతిరేక విధానాన్ని గట్టిగా ఆచరణలో పెట్టాయి. అప్పటినుంచి కాంగ్రెస్కైనా మద్దతివ్వడానికి సిద్ధపడ్డాయే తప్ప.. కమలదళం నీడను కూడా సహించకుండా ముందుకుసాగాయి! దానివల్ల కాంగ్రెస్ వ్యతిరేక పాత్రను వామపక్షాలకు బదులు క్రమంగా ప్రాంతీయ పార్టీలు ఆక్రమించాయి. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, ఒడిశాలో బిజద, బిహార్లో ఆర్జేడీ, జేడీయూ, ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, పంజాబ్లో శిరోమణి అకాలీదళ్, అస్సాంలో అస్సాం గణపరిషత్ పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేక భావజాల ఓటర్లను తమవైపునకు తిప్పుకోగలిగాయి. హిందూత్వ ప్రభావం అధికంగా ఉండే గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లాంటి రాష్ట్రాల్లో భాజపా బాగా బలపడింది. దాంతో వామపక్షాలు సంప్రదాయబద్ధంగా వస్తున్న పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళకే పరిమితం కావాల్సి వచ్చింది. అంతకుమించి విస్తరించే పరిస్థితులను అవి సృష్టించుకోలేకపోయాయి. 1957 ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో సీట్లు సాధించిన సీపీఐ.. 2019 నాటికి ఒకేఒక్క రాష్ట్రానికి పరిమితమైంది. సీపీఎంకు 1991లో అత్యధికంగా 7 రాష్ట్రాల్లో విజయాలు లభించగా, 2019 నాటికి అది 2 రాష్ట్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
కొత్త నాయకత్వం కొరవడి..
వామపక్షాలు ఇప్పటికీ పేరుకు చాలా రాష్ట్రాల్లో పోటీ చేస్తున్నా.. విజయాలు మాత్రం విస్తరించడం లేదు. వర్తమాన రాజకీయాల్లో కనిపిస్తున్న డబ్బు, కులం, మతం, ప్రాంతం, అవినీతి పోకడలను ప్రోత్సహించకపోవడంతోపాటు అంతర్గతంగా కొత్త నాయకత్వాన్ని తయారుచేసుకోలేకపోవడం ఇందుకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. వామపక్షాల్లో సీపీఎందే పెద్దన్న పాత్ర. పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళల్లో ఆ పార్టీ దీర్ఘకాలంపాటు అధికారంలో కొనసాగింది. మిగిలిన వామపక్షాల బలం దీనిపైనే ఆధారపడి ఉంది. పశ్చిమబెంగాల్, త్రిపురల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించకపోవడం వల్లే తాము తీవ్రంగా దెబ్బతిన్నట్లు ఆ పార్టీలో అంతర్గత అభిప్రాయం ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాన్ని గుణపాఠంగా తీసుకొని కేరళలో యువరక్తాన్ని ప్రోత్సహించడంతో.. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడం సాధ్యమైందన్న భావన కనిపిస్తోంది. 2004 నుంచి 2014 వరకు యూపీయే ప్రభుత్వ హయాంలో జరిగిన 2జీ, ఇతర కుంభకోణాలు, అమెరికాతో అణు ఒప్పందాలకు వ్యతిరేకంగా వామపక్షాలు ఉద్యమించాయి. కానీ ఆ ఉద్యమాల ఫలితాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం వామపక్షాల ప్రాబల్యానికి కేరళ ఒక్కటే కేంద్రంగా మారింది. దాన్ని నిలబెట్టుకోవడంతోపాటు కొత్త ప్రాంతాలకు విస్తరించడం వాటి ముందున్న సవాల్.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ