వలస నేతలకే టికెట్లు
లోక్సభ ఎన్నికల టికెట్లలో ఒడిశాలోని ప్రధాన రాజకీయ పార్టీలు వలస నేతలకే ప్రాధాన్యమిచ్చాయి.
ఒడిశాలో బిజద, భాజపాల తీరిదీ..
లోక్సభ ఎన్నికల్లో వారికే చోటు
భువనేశ్వర్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల టికెట్లలో ఒడిశాలోని ప్రధాన రాజకీయ పార్టీలు వలస నేతలకే ప్రాధాన్యమిచ్చాయి. ఇలా వచ్చిన వారికి అలా టికెట్లు కేటాయించాయి. రాష్ట్రంలో బిజూ జనతాదళ్ (బిజద), భాజపాలు రెండూ వలస నేతలకే ప్రాధాన్యమివ్వడం గమనార్హం. అందులో కీలక నియోజకవర్గాలున్నాయి.
నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలపై విమర్శలు చేస్తూ బిజద పక్కలో బల్లెంలా మారిన భువనేశ్వర్ భాజపా సిటింగ్ ఎంపీ అపరాజిత సారంగిని ఓడించాలన్న లక్ష్యంతో ఆమెకు ప్రత్యర్థిగా ఎవర్ని నిలబెట్టాలన్న దానిపై సీఎం గట్టి కసరత్తు చేశారు. పార్టీ నుంచి 12 మంది అగ్ర నేతలు ఆసక్తి కనబరిచినా చివరకు కాంగ్రెస్ అగ్ర నేత సురేష్ రౌత్రాయి చిన్న కుమారుడు సిద్ధార్థ రౌత్రాయికు టికెట్ ఖరారు చేశారు. ప్రైవేటు విమానయాన సంస్థలో పైలట్గా పని చేసి ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన సిద్ధార్థను నవీన్ పార్టీలో చేర్చుకుని భువనేశ్వర్ అభ్యర్థిగా చేశారు.
బొలంగీర్లో సురేంద్ర రాణిస్తారా?
పశ్చిమ ఒడిశాలోని మరో కీలకమైన బొలంగీర్ లోక్సభ పరిధిలోని ఓటర్లు ప్రతిసారీ రాజ పరివారానికి చెందిన వారినే ఆదరిస్తున్నారు. ఇక్కడ భాజపా తరఫున బరిలోకి దిగుతున్నవారే ఎన్నికవుతున్నారు. సిటింగ్ ఎంపీ సంగీతా కుమారి సింగ్దేవ్ను భాజపా మళ్లీ అభ్యర్థిగా నిలిపింది. బొలంగీర్ రాణిగా ప్రజల్లో ఆమెకు ఆదరణ ఉంది. ఈ స్థానంలో సంగీత మరిది, యువరాజు కాళికేష్ నారాయణ్ సింగ్దేవ్ను బిజద నుంచి నిలపాలని నవీన్ నిర్ణయించారు. ఇంతలో కాంగ్రెస్ వీడి వచ్చిన మాజీ మంత్రి సురేంద్ర సింగ్ బోయ్కు సీటు కేటాయించారు.
అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సంబల్పూర్
రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్న సంబల్పూర్ సీటు ఈసారి ఎవరిపరం కానుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదిహేనేళ్ల సుదీర్ఘ కాలం తర్వాత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంబల్పూర్ భాజపా అభ్యర్థిగా రంగంలోకి దిగారు. నవీన్ ప్రభుత్వంపై తరచూ విమర్శలు చేస్తున్న ధర్మేంద్రను ఓడించడానికి తీవ్రంగా ఆలోచించిన నవీన్ రాజకీయాల్లో ఘనాపాటిగా ఖ్యాతి ఉన్న బిజద రాజకీయ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి ప్రణవ ప్రకాష్ దాస్ అలియాస్ బొబిని నిలబెట్టారు.
పూరీ ప్రతిష్ఠాత్మకం
ప్రతిష్ఠాత్మక పూరీ లోక్సభ స్థానంలో గతసారి భాజపా స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూసింది. ఈసారి ఆ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలన్న ధ్యేయంతో ఉంది. బహుముఖ ప్రజ్ఞాశాలి, భాజపా జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రను మళ్లీ అభ్యర్థిగా చేసింది. అధికారంలో లేకపోయినా గడిచిన ఐదేళ్లు సంబిత్ పూరీ వాసులకు సేవలందించారు. పూరీ సిటింగ్ (బిజద) ఎంపీ పినాకి మిశ్ర ఎన్నికైన తర్వాత ప్రజలకు దూరమయ్యారు. హస్తినకే పరిమితమయ్యారు. ఆయన పట్ల వ్యతిరేకత ఉందని గమనించిన సీఎం మహారాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ మాజీ అధికారి అరూప్ పట్నాయక్ను నిలబెట్టారు. ఈయన పూరీ వాసి.
రాజకీయాల్లో ఘనాపాటి భర్తృహరి
మాజీ సీఎం దివంగత హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు భర్తృహరి మెహతాబ్ ఆరు సార్లు కటక్ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. బిజద ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన రాజకీయాల్లో ఘనాపాటిగా ముద్రపడ్డారు. ఒడిశా నుంచి వెలువడుతున్న ప్రముఖ ఒడియా దినపత్రిక ‘ప్రజాతంత్ర’కు భర్తృహరి ప్రధాన సంపాదకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో భర్తృహరి తన పత్రికలో బిజద వైఫల్యాలను ఎండగట్టి అధినేతకు కొరకరాని కొయ్యగా మారారు. ఆయనకు ఈసారి బిజద టికెట్ దక్కకపోవచ్చన్న అంచనాల మధ్య భర్తృహరి ఆ పార్టీ వీడి కషాయం కండువా ధరించి కటక్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన దూకుడుకు అడ్డుకట్ట వేసే నేత ఎవరన్న దానిపై కసరత్తు చేసిన సీఎం పారిశ్రామిక రంగంలో ప్రతిభాశాలిగా ఖ్యాతి గాంచిన సంతృప్తి మిశ్రను పార్టీలోకి చేర్చుకుని బరిలోకి దించారు.
బ్రహ్మపురకు భృగు
మరో ప్రతిష్ఠాత్మక బ్రహ్మపుర స్థానంలో సిట్టింగ్ ఎంపీ చంద్రశేఖర్ సాహును కాదని భాజపా నుంచి వచ్చిన భృగుబక్షి పాత్రను బిజద అభ్యర్థిగా నవీన్ ప్రకటించారు. గతంలో బిజదలో అగ్ర నేతగా చలామణి అయిన గోపాల్పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రదీప్ కుమార్ పాణిగ్రహిని పార్టీ నుంచి తొలగించిన తర్వాత ఆయన కాషాయం కండువా ధరించారు. మంత్రిగా పని చేసిన ప్రదీప్ సీఎంకు సవాల్ విసిరారు. దీంతో ప్రదీప్ను భాజపా బ్రహ్మపుర బరిలో దించింది. ప్రస్తుత ఎన్నికల్లో కండువాలు మార్చిన ప్రదీప్, భృగుల మధ్య పోరు ఆసక్తికరంగా మారనుంది.
కేంద్రపాడా ఈసారి ఎవరో?
కేంద్రపాడాలో క్రితంసారి భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త బైజయంత్ పండా మళ్లీ అభ్యర్థి అయ్యారు. నవీన్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా గుర్తింపు ఉన్న బైజయంత్ గతంలో బిజదలో అగ్రనేత, 2014 నుంచి 2019 వరకు కేంద్రపడ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన బైజయంత్కు తర్వాత కాలంలో సీఎంతో సంబంధాలు సన్నగిల్లాయి. భాజపాలో చేరిన ఆయన గతసారి పోటీచేసి ఓడిపోయారు. ఈసారి మళ్లీ బరిలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి బిజదలోకి వచ్చిన అంశుమన్ మహంతిని నవీన్ నిలబెట్టారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్