విపక్ష కూటమికి మూడంకెలూ కష్టమే
లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి మూడంకెలకు చేరుకోవడం కూడా కష్టమేనని, ప్రభుత్వ ఏర్పాటు దరిదాపులకు వచ్చే అవకాశం లేని ఈ పార్టీలు అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.
ఔరంగజేబు ఆరాధకులతో ‘నకిలీ’ శివసేన దోస్తీ
మహారాష్ట్ర, గోవా ర్యాలీల్లో ప్రధాని మోదీ
కొల్హాపుర్, వాస్కో: లోక్సభ ఎన్నికల్లో విపక్ష కూటమి మూడంకెలకు చేరుకోవడం కూడా కష్టమేనని, ప్రభుత్వ ఏర్పాటు దరిదాపులకు వచ్చే అవకాశం లేని ఈ పార్టీలు అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులను తీసుకువచ్చే ఆలోచన చేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపుర్, గోవాలోని వాస్కోలలో శనివారం ఎన్నికల ర్యాలీలను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో కాంగ్రెస్ పార్టీ ఇలాగే అయిదేళ్లలో ఇద్దరు ముఖ్యమంత్రులు మారే రొటేషన్ ఒప్పందాలు చేసిందన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు కేటాయించిన 27 శాతం రిజర్వేషన్ల కోటాలోకి ముస్లింలను చొప్పించిన కర్ణాటక మోడల్ను దేశమంతా విస్తరించాలని యోచిస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. దక్షిణ భారతాన్ని కొత్త దేశంగా ప్రకటించాలని కర్ణాటక, తమిళనాడు ఇండియా కూటమి నేతలు మాట్లాడుతున్నారని, ఛత్రపతి శివాజీ మహరాజ్ గడ్డపై పుట్టిన ప్రజలు దీన్ని అనుమతిస్తారా? అని ప్రశ్నించారు. ఇక్కడి నకిలీ శివసేన నేతలు ఔరంగజేబును ఆరాధించేవారితో చేతులు కలిపారని, బాలాసాహెబ్ ఠాక్రే బతికుండి దీన్ని చూస్తే కుంగిపోయేవారని ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఉద్దేశించి మోదీ విమర్శలు చేశారు. ఇప్పటిదాకా జరిగిన రెండు దశల ఎన్నికల్లోనూ ఎన్డీయే ఆధిక్యంలో ఉన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాదికల్లా పేదలకు మూడు కోట్ల పక్కా గృహాలు నిర్మిస్తామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు.
ఈవీఎంలను తప్పుబట్టిన కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) పనితీరును తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశానికి క్షమాపణ చెప్పాలని మోదీ డిమాండ్ చేశారు. గోవాలోని వాస్కో ఎన్నికల సభలో ప్రధాని మాట్లాడుతూ.. పలు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో భాజపాకు గోవా మోడల్ లాంటిదన్నారు. పౌరుల ఆకాంక్షలను నెరవేర్చే ఎన్డీయే సిద్ధాంతాలకు, స్వార్థ లక్ష్యాలతో తమ కుటుంబాల రక్షణకు పనిచేస్తున్న ఇండియా కూటమికి మధ్య జరుగుతున్న పోరాటంగా తాజా ఎన్నికలను ప్రధాని అభివర్ణించారు. గోవా మత్స్యకారులకు బీమా కవరేజీ పెంచుతామన్నారు. ‘‘కాంగ్రెస్ ‘యువరాజు’ మీ సంపద తనిఖీకి విదేశాల నుంచి ఎక్స్రే మిషను తెస్తారట. ఆ తర్వాత మీ సంపదను ఇతరులకు పంచుతారు. కాంగ్రెస్కు ఇష్టమైన ఆ ఓటుబ్యాంకు ఏదో మీకందరికీ తెలుసు’’ అని ప్రధాని అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం