‘మహా’ ఉత్కంఠ!
మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వదినా మరదళ్ల సవాల్తో సెగలు కక్కుతున్న బారామతి, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు బరిలో నిలిచిన సతారా, కొల్హాపుర్లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది.
మూడో విడతలో మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్
జాబితాలో బారామతి, కొల్హాపుర్, రత్నగిరి-సింధుదుర్గ్
మహాయుతి, మహా వికాస్ అఘాడీ మధ్య హోరాహోరీ
ఈనాడు ప్రత్యేక విభాగం
మహారాష్ట్రలో మొత్తం లోక్సభ స్థానాలు - 48
మూడో విడతలో పోలింగ్ జరిగేవి 11
బరిలో మొత్తం అభ్యర్థులు 258
ఓటింగ్ తేదీ మే 7
మహారాష్ట్రలో మూడో విడత సార్వత్రిక ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. వదినా మరదళ్ల సవాల్తో సెగలు కక్కుతున్న బారామతి, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ వారసులు బరిలో నిలిచిన సతారా, కొల్హాపుర్లతోపాటు మొత్తంగా 11 స్థానాలకు ఈ దశలో పోలింగ్ జరగనుంది. వీటిలో- సతారా, కొల్హాపుర్, బారామతి, సాంగ్లీ, సోలాపుర్, మాధా, హాట్కణంగ్లే పశ్చిమ మహారాష్ట్రలోనివి కాగా.. లాతూర్, ఉస్మానాబాద్ మరాఠ్వాడా ప్రాంతంలోని స్థానాలు. రాయ్గడ్, రత్నగిరి-సింధుదుర్గ్ నియోజకవర్గాలు కొంకణ్ ప్రాంతంలో ఉన్నాయి. మెజార్టీ సీట్లలో పోరు ప్రధానంగా మహాయుతి (ఎన్డీయే), మహా వికాస్ అఘాడీ (ఇండియా) కూటముల మధ్యే హోరాహోరీగా ఉంది.
బారామతి: ఎవరిదో పైచేయి
మూడో విడతలో అందరి దృష్టీ ప్రధానంగా బారామతిపైనే కేంద్రీకృతమైంది. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలే ఎన్సీపీ (ఎస్పీ) తరఫున బరిలో నిలిచారు. పార్టీ అధినేత శరద్ పవార్ కుమార్తె ఈమె. పవార్ సోదరుడి కుమారుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ ఎన్సీపీ తరఫున ఈ స్థానంలో పోటీ చేస్తున్నారు. అజిత్ నిరుడు ఎన్సీపీని చీల్చిన సంగతి తెలిసిందే. బారామతి పవార్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ సూలే 2009 నుంచి ఎంపీగా ఉన్నారు. అంతకుముందు వరుసగా ఆరుసార్లు శరద్ పవార్ విజయం సాధించారు. ఇప్పుడు సూలే ఓడితే.. ఆయనకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లవుతుంది. పార్టీ శ్రేణులపై పట్టు కోల్పోయే ముప్పు కూడా ఉంటుంది. అందుకే కుమార్తె విజయం కోసం శరద్ పవార్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఉస్మానాబాద్ : కుటుంబ పోరు
ఈ స్థానంలోనూ కుటుంబ పోరు కనిపిస్తోంది. భాజపా తరఫున ఎమ్మెల్యే రాణా జగ్జీత్సిన్హ్ పాటిల్ సతీమణి అర్చనా పాటిల్ పోటీ చేస్తున్నారు. జగ్జీత్సిన్హ్ సమీప బంధువైన సిట్టింగ్ ఎంపీ ఓంప్రకాశ్ రాజె నింబాల్కర్కు శివసేన (యూబీటీ) టికెట్ ఇచ్చింది.
కొల్హాపుర్: కాంగ్రెస్కు వీబీఏ, ఎంఐఎం మద్దతు
ఇక్కడ కాంగ్రెస్ తరఫున శ్రీమంత్ శాహూ ఛత్రపతి మహరాజ్ బరిలో దిగారు. ఈయన ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరు. సీఎం ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన.. సంజయ్ మండ్లిక్కు టికెట్ ఇచ్చింది. ప్రకాశ్ అంబేడ్కర్ నాయకత్వంలోని వీబీఏ, అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం ఈ స్థానంలో శ్రీమంత్ శాహూకు మద్దతు ప్రకటించాయి.
సాంగ్లీ: త్రిముఖ పోటీ
మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తరఫున రెజ్లర్ చంద్రహార్ పాటిల్, భాజపా నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్కాకా పాటిల్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్పై తిరుగుబావుటా ఎగరేసిన విశాల్ పాటిల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో త్రిముఖ పోటీ నెలకొంది. 1976-85 మధ్య మూడుసార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వసంత్దాదా పాటిల్ మనవడు విశాల్.
సోలాపుర్ (ఎస్సీ): ఎమ్మెల్యేల పోరు
ఇక్కడ భాజపా రామ్ సాత్పుతేకు టికెట్ ఇవ్వగా, కాంగ్రెస్ ప్రణీతి శిందేను బరిలో దించింది. వీరిద్దరూ సిట్టింగ్ ఎమ్మెల్యేలే. మాజీ సీఎం, కేంద్ర మాజీ హోంమంత్రి సుశీల్కుమార్ శిందే కుమార్తె ప్రణీతి.
- సతారాలో ఛత్రపతి శివాజీ వారసుల్లో ఒకరైన శ్రీమంత్ ఛత్రపతి ఉదయన్రాజె భోసలే భాజపా తరఫున బరిలో నిలిచారు. భోసలే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇక్కడ ఎన్సీపీ (ఎస్పీ) తరఫున మాజీమంత్రి శశికాంత్ శిందే పోటీ చేస్తున్నారు.
- రత్నగిరి-సింధుదుర్గ్లో పోరు ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ భాజపా తరఫున కేంద్రమంత్రి, మాజీ సీఎం నారాయణ్ రాణె బరిలో ఉన్నారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన వినాయక్ రౌత్ (శివసేన-యూబీటీ) నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
- హాట్కణంగ్లేలో శివసేన (యూబీటీ) నుంచి సత్యజీత్ పాటిల్, శివసేన తరఫున ధైర్యశీల్ మానే పోటీ చేస్తున్నారు. ఇక్కడ మాజీ ఎంపీ రాజు శెట్టి (స్వాభిమానీ పక్ష) బరిలో దిగడంతో త్రిముఖ పోటీ ఉంది.
- మాధాలో సిట్టింగ్ ఎంపీ రంజిత్సిన్హ్ నాయక్-నింబాల్కర్ (భాజపా), ఎన్సీపీ (ఎస్పీ) నేత ధైర్యశీల్ మోహితె-పాటిల్ హోరాహోరీగా తలపడుతున్నారు.
- లాతూర్ (ఎస్సీ) భాజపా సిట్టింగ్ ఎంపీ సుధాకర్ శృంగారే, కాంగ్రెస్ అభ్యర్థి శివాజీరావ్ కాల్గే నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు.
- రాయ్గడ్లో ఎన్సీపీ రాష్ట్రాధ్యక్షుడు, సిట్టింగ్ ఎంపీ సునీల్ తట్కరే బరిలో ఉన్నారు. శివసేన (యూబీటీ) నుంచి అనంత్ గీతే పోటీ చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ