కాంగ్రెస్ వస్తే మీ పిల్లల ఆస్తి ముస్లింలకు..
కాంగ్రెస్ ‘హస్తం’లో విదేశీ శక్తుల ప్రమేయం కనపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆరోపించారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది స్పష్టమవుతోందన్నారు.
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్
హమీర్పుర్: కాంగ్రెస్ ‘హస్తం’లో విదేశీ శక్తుల ప్రమేయం కనపడుతోందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకుర్ ఆరోపించారు. ఆ పార్టీ మ్యానిఫెస్టోలో ఇది స్పష్టమవుతోందన్నారు. ‘‘మీ పిల్లల ఆస్తిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. మీ ఆస్తి మీ పిల్లలకే చెందాలా లేక ముస్లింలపరం కావాలా అన్నది మీరే తేల్చుకోవాలి’’ అని ఆయన హిమాచల్ప్రదేశ్లోని హమీర్పుర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరుగుదొడ్ల నుంచి ఇళ్ల వరకూ, గ్యాస్ సిలిండర్ల నుంచి ఆహార ధాన్యాల వరకూ తాము ముస్లింలకు సమాన హక్కులు కల్పించామన్నారు. వీటిని మతం కోణంలో చూడలేదని చెప్పారు. మతం, ప్రాంతం ప్రాతిపదికన దేశాన్ని విభజించాలని కాంగ్రెస్ భావిస్తోందని ఆయన ఆరోపించారు. ‘‘దేశాన్ని ముక్కలుగా చేయాలనుకునే ‘తుక్డే.. తుక్డే ముఠా’ ఆలోచనతీరును కాంగ్రెస్ పూర్తిగా ఒంటబట్టించుకుంది. అందువల్ల దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను సమర్థిస్తారా లేక ఐక్యంగా ఉంచే శక్తులను ఆదరిస్తారా అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రి అయినప్పుడు.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి చెందిన 55 శాతం ఆస్తి ప్రభుత్వ ఖజానాకు చెందాలన్న నిబంధన ఉండేది. అయితే తన ఆస్తిని రక్షించుకోవడానికి రాజీవ్ గాంధీ ఆ నిబంధనను మార్చారు’’ అని చెప్పారు. మరోవైపు అనురాగ్ ఠాకుర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. ఇది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. ఈ మేరకు శనివారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీ, ఉత్తర్ఫ్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ల అడుగుజాడల్లో ఠాకుర్ నడుస్తున్నారని విమర్శించింది. ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్.. ఎన్నికల సంఘాన్ని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
-
బహిరంగ చర్చకు సిద్ధమే.. ప్రధాని స్పందనేంటో చెప్పండి: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. -
75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధాని.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా
75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. -
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా? సీఎం నవీన్ పట్నాయక్కు మోదీ సవాల్
ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. -
భాజపా టికెట్ నిరాకరించిన వేళ.. వరుణ్ గురించి స్పందించిన మేనకాగాంధీ
పీలీభిత్ ఎంపీ వరుణ్ గాంధీకి మరోసారి భాజపా టికెట్ ఇవ్వకపోవడంపై ఆయన తల్లి మేనకా గాంధీ(Maneka Gandhi) స్పందించారు. ఏమన్నారంటే..? -
మోదీజీ.. ఇందిరాగాంధీ నుంచి ఆ లక్షణాలు నేర్చుకోండి: ప్రియాంక గాంధీ
ప్రజల కష్టాలు వినడానికి బదులు.. తనను టార్గెట్ చేశారంటూ ఎన్నికల వేళ ప్రధాని మోదీ వాపోతున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. -
మోదీ తర్వాత మీ ప్రధాని అభ్యర్థి ఎవరు? భాజపాకు కేజ్రీవాల్ ప్రశ్న
Arvind Kejriwal: ఆమ్ ఆద్మీ ఒక పార్టీ కాదని, ఓ సిద్ధాంతమని కేజ్రీవాల్ అన్నారు. తమను అణగదొక్కేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ తర్వాత భాజపా నుంచి ఎవరు ప్రధాని అవుతారని ప్రశ్నించారు. -
ఐదేళ్లలో భారత్ను తయారీ కేంద్రంగా మారుస్తాం: ఖర్గే
కాంగ్రెస్ అధికారం చేపడితే దేశాన్ని తయారీ హబ్గా మారుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. -
పాక్ బాంబులను కొనేవారే లేరు.. : అయ్యర్ వ్యాఖ్యలపై మోదీ సెటైర్
PM Modi: ఓటు బ్యాంకును కోల్పోతామన్న భయంతోనే ముంబయి పేలుళ్లపై కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదని ప్రధాని అన్నారు. ఇప్పుడు పాక్ పేరు చెప్పి సొంత దేశాన్ని ఆ నేతలు భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. -
మోదీ ఆఫర్.. నో చెప్పిన శరద్ పవార్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ(Modi) ఇచ్చిన ఆఫర్ను శరద్ పవార్(Sharad Pawar) తోసిపుచ్చారు. -
దిల్లీలో నేడు కేజ్రీవాల్ రోడ్షో
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై విపక్ష ఇండియా కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఉద్దేశించి మధ్యప్రదేశ్లోని రత్లాం నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది
కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసిందని, భవిష్యత్తులో తమ రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అంగీకరించారు. -
మీ వ్యాఖ్యలతో ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం
సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ డేటాపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
కాంగ్రెస్లో విలీనమయ్యే బదులు.. ఎన్డీయేతో చేతులు కలపండి
కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడంకన్నా భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) అధినేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ఒడిశా అసెంబ్లీ బరిలో హేమాహేమీలు
ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 147. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కనీసం 74 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. -
అమృత్పాల్ సింగ్ మొత్తం ఆస్తి రూ.1,000.. అస్సాం జైలు నుంచి నామినేషన్
‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ అధిపతి, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ (31) తనకున్న మొత్తం ఆస్తి వెయ్యి రూపాయలుగా ఎన్నికల ప్రమాణ పత్రంలో వెల్లడించాడు. -
రాజ్యాంగాన్ని 80సార్లు సవరించిన కాంగ్రెస్
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది. -
పనితీరుపై కాకుండా పాక్ చర్చ ఎందుకు?
ఎన్నికలు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇక్కడి అంశాలపై కాకుండా పాకిస్థాన్పై చర్చ ఎందుకని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. -
ఓటేయండి.. సగం ధరకే సినిమా చూడండి
‘ఓటు వేయండి.. ఆపై మీకు నచ్చిన థియేటర్లో సగం ధరకే సినిమా చూడండి’ అంటూ పట్నా సాహిబ్ లోక్సభ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
కన్నౌజ్ పోరు.. ‘అత్తరు’ గుబాళింపు ఎటువైపో ?
మే 13న జరిగే పోలింగ్లో కన్నౌజ్ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.