పదహారేళ్లుగా పోరాటం!
ఎన్నికలనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నేతలు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు భిన్నం! ఆయన పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తారు.
ఏడోసారి ఎన్నికల బరిలో దిగుతున్న గిరిజన నాయకుడు
పాల్ఘర్ నుంచి పోటీ చేస్తున్న మోహన్ గుహే
ఎన్నికలనగానే గెలుపు గురించే చాలామంది రాజకీయ నేతలు ఆలోచిస్తుంటారు. కానీ ఓ నాయకుడు ఇందుకు భిన్నం! ఆయన పోరాటం గురించి మాత్రమే ఆలోచిస్తారు. పేరు- మోహన్ గుహే! గత పదహారేళ్లలో ఆయన నాలుగుసార్లు అసెంబ్లీకి, రెండుసార్లు లోక్సభకు పోటీ చేశారు. ఇప్పుడు ఏడోసారి మహారాష్ట్రలోని పాల్ఘర్ లోక్సభ స్థానం నుంచి భారతీయ ఆదివాసీ పార్టీ (బీఏపీ) అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు.
సాధారణ ప్రైవేటు ఉపాధ్యాయుడు
మోహన్ గిరిజన నాయకుడు. తమ వర్గం నేతలు సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో చట్టసభల్లో అడుగుపెట్టాలనేది ఆయన కోరిక. అందులో భాగంగానే తానూ చట్టసభల్లో ప్రవేశించాలనే పట్టుదలతో ఉన్నారు. నిజానికి ఈయన సాధారణ ప్రైవేటు ఉపాధ్యాయుడు. ఠానేలోని ఓ స్కూలులో పనిచేస్తున్నారు. తన వేతనం నుంచి ఏటా రూ.1-2 లక్షలు పొదుపు చేస్తుంటారు. దానికితోడు కొన్ని విరాళాలు సేకరించి ఎన్నికల్లో పోటీకి దిగుతారు. 16 ఏళ్లుగా మోహన్ చేస్తున్నదిదే. ఏదో ఒకరోజు తాను తప్పకుండా చట్టసభలోకి అడుగుపెడతానని ఆయన ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.
నీటి సమస్య తీరుస్తానంటూ..
పాల్ఘర్లో అయిదు ఆనకట్టలు ఉన్నప్పటికీ నేటికీ జిల్లా ప్రజలు నీటి కొరతతో అల్లాడుతున్నారు. తనను గెలిపిస్తే ఆ సమస్యను తీరుస్తానంటూ ఓటర్లకు మోహన్ భరోసా ఇస్తున్నారు. ఆయన భార్య ఒక నర్సు. అందువల్ల ఆయనకు ఆరోగ్య రంగంపై మంచి అవగాహన ఉంది. పాల్ఘర్ లోక్సభ పరిధిలోని గ్రామాల్లో ప్రజారోగ్య పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై చక్కగా ప్రసంగిస్తుంటారు. నాసిక్-దహను మార్గంలో రైల్వేలైన్ నిర్మాణ ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్లో ఉంది. తనను గెలిపిస్తే దీనిపై కేంద్రప్రభుత్వంతో మాట్లాడతానని ఆయన అంటున్నారు. స్థానిక మత్స్యకారులకు కీలకమైన వద్వాన్ పోర్టుకు సంబంధించిన అంశాన్నీ మోహన్ లేవనెత్తుతున్నారు. 2009 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్కు 8 వేల ఓట్లు వచ్చాయి. అదే ఏడాది లోక్సభ ఎన్నికల్లో 13,500 ఓట్లు దక్కించుకున్నారు.
ఈటీవీ భారత్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీలో నేడు కేజ్రీవాల్ రోడ్షో
మద్యం విధానంతో ముడిపడిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు కావడంపై విపక్ష ఇండియా కూటమిలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. -
ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు ఇస్తాం
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ‘మహాలక్ష్మి’ పథకాన్ని ఉద్దేశించి మధ్యప్రదేశ్లోని రత్లాం నియోజకవర్గ హస్తం పార్టీ అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి కాంతిలాల్ భురియా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. -
కాంగ్రెస్ కొన్ని తప్పులు చేసింది
కాంగ్రెస్ కూడా కొన్ని తప్పులు చేసిందని, భవిష్యత్తులో తమ రాజకీయాలను మార్చుకోవాల్సి ఉందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ అంగీకరించారు. -
మీ వ్యాఖ్యలతో ఓటింగ్ శాతంపై ప్రతికూల ప్రభావం
సార్వత్రిక సమరానికి సంబంధించిన పోలింగ్ డేటాపై విపక్ష ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నేతలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖపై కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం తీవ్ర ఆక్షేపణ తెలిపింది. -
కాంగ్రెస్లో విలీనమయ్యే బదులు.. ఎన్డీయేతో చేతులు కలపండి
కాంగ్రెస్లో విలీనమై ఉనికి కోల్పోవడంకన్నా భాజపా నేతృత్వంలోని ఎన్డీయేలో చేరాలని ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ) అధినేతలు శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రేలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. -
ఒడిశా అసెంబ్లీ బరిలో హేమాహేమీలు
ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 147. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కనీసం 74 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. -
అమృత్పాల్ సింగ్ మొత్తం ఆస్తి రూ.1,000.. అస్సాం జైలు నుంచి నామినేషన్
‘వారిస్ పంజాబ్ దే’ అతివాద సంస్థ అధిపతి, ఖలిస్థాన్ సానుభూతిపరుడు అమృత్పాల్ సింగ్ (31) తనకున్న మొత్తం ఆస్తి వెయ్యి రూపాయలుగా ఎన్నికల ప్రమాణ పత్రంలో వెల్లడించాడు. -
రాజ్యాంగాన్ని 80సార్లు సవరించిన కాంగ్రెస్
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని 80 సార్లు సవరించింది. ఇప్పుడేమో మేం రాజ్యాంగాన్ని మార్చేస్తామని ప్రచారం చేస్తోంది. -
పనితీరుపై కాకుండా పాక్ చర్చ ఎందుకు?
ఎన్నికలు మన దేశంలో జరుగుతున్నప్పుడు ఇక్కడి అంశాలపై కాకుండా పాకిస్థాన్పై చర్చ ఎందుకని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. -
ఓటేయండి.. సగం ధరకే సినిమా చూడండి
‘ఓటు వేయండి.. ఆపై మీకు నచ్చిన థియేటర్లో సగం ధరకే సినిమా చూడండి’ అంటూ పట్నా సాహిబ్ లోక్సభ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. -
కన్నౌజ్ పోరు.. ‘అత్తరు’ గుబాళింపు ఎటువైపో ?
మే 13న జరిగే పోలింగ్లో కన్నౌజ్ ‘అత్తరు’ తయారీదారుల మద్దతు ఎవరివైపు ఉంటుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ఎన్నికలు భారత్లో జరుగుతుంటే.. పాకిస్థాన్ ప్రస్తావనెందుకు?: ప్రియాంక గాంధీ
వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎన్నికల ప్రచారంలో భాజపా మతాలను ప్రస్తావిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. -
ఇది ప్రజాస్వామ్య విజయం: సునీత కేజ్రీవాల్
కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్, ఆప్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. -
నామినేషన్ వేసేందుకు పరుగులు పెట్టిన నేత.. ఎందుకంటే..?
Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతోన్న ఓ అభ్యర్థి పరుగులు పెట్టి మరీ నామినేషన్ వేయాల్సి వచ్చింది. -
‘ఇద్దరు భార్యలుంటే రూ.2 లక్షలు’.. లోక్సభ అభ్యర్థి వ్యాఖ్యలతో షాకైన జనం
Congress candidate: మహిళల కోసం పథకాన్ని ఉద్దేశిస్తూ ఓ కాంగ్రెస్ అభ్యర్థి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇద్దరు భార్యలుంటే ఏటా రూ.2 లక్షలు తీసుకోవచ్చని ఆయన చెప్పడంతో ప్రజలు అవాక్కయ్యారు. -
పోలింగ్ కేంద్రంలో ఓటేసిన బాలుడు!
ప్రస్తుతం దేశంలో దశల వారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. -
యోగి పర్యటనలో బుల్డోజర్ల బ్రేక్డ్యాన్స్..
ఉత్తర్ప్రదేశ్లో ఓ ర్యాలీలో బుల్డోజర్లు నృత్యం చేశాయి. ఫరూఖాబాద్ లోక్సభ స్థానం అలీగంజ్లో బుధవారం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. -
రాహుల్ సలహాదారు భారత విభజన గురించి మాట్లాడుతున్నారు
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శాం పిట్రోడా చేసిన ‘వివాదాస్పద’ వ్యాఖ్యలను భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఖండించారు. -
లోక్సభ ఎన్నికలపై మోదీ, రాహుల్ డిబేట్!
లోక్సభ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీల నడుమ బహిరంగ చర్చ జరగాలని ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎ.పి.షా అభిప్రాయపడ్డారు. -
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాపై ప్రతికూల ప్రభావం!
దేశ జనాభాలో హిందువుల వాటా తగ్గి, ముస్లింల శాతం పెరిగిందంటూ ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఇచ్చిన నివేదిక అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాన్ని రాజేసింది. -
బూత్ల వారీగా పోలైన ఓట్లు వెబ్సైట్లో ప్రచురించాలి
లోక్సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన మూడు దశల పోలింగులో బూత్ల వారీగా పోలైన మొత్తం ఓట్ల వివరాలను ఈసీ వెబ్సైటులో ప్రచురించాలని పలువురు సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, పదవీ విరమణ పొందిన సివిల్ సర్వెంట్లు డిమాండ్ చేశారు.