సంక్షిప్త వార్తలు (7)
రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించబోదు. ఇది మోదీ గ్యారంటీ. రామాలయాన్ని నిర్మించినవారు కావాలా, కరసేవకులపై కాల్పులు జరిపించినవారు కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. ఇప్పటికే ముగిసిన తొలి రెండు దశల్లోనే భాజపా 100 సీట్లు సాధిస్తుంది.
ఇప్పటికే మాకు 100 సీట్లు
- యూపీ ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్షా
రిజర్వేషన్లను భాజపా ఎప్పటికీ తొలగించబోదు. ఇది మోదీ గ్యారంటీ. రామాలయాన్ని నిర్మించినవారు కావాలా, కరసేవకులపై కాల్పులు జరిపించినవారు కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలి. ఇప్పటికే ముగిసిన తొలి రెండు దశల్లోనే భాజపా 100 సీట్లు సాధిస్తుంది. మోదీ తప్ప మరెవరైనా దేశాన్ని సమర్థంగా నడపగలరా? విపక్షానికి ప్రధాని అభ్యర్థి ఎవరు?
మాది అభివృద్ధి పథం
- అహ్మదాబాద్లో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్
సరికొత్త, పురోగామి భారత్ను తీర్చిదిద్దడానికి పక్కా గ్యారంటీ మా మ్యానిఫెస్టో. కాంగ్రెస్ది మాత్రం అంతా విభజనవాదం, బుజ్జగింపు రాజకీయం. సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. పేదరికాన్ని మాత్రం నిర్మూలించలేకపోయింది. మేం 8-9 ఏళ్లలోనే 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చాం. కాంగ్రెస్కు నాయకత్వం, విధానం లేవు.
భాజపాకు సహకరిస్తున్న కాంగ్రెస్, సీపీఎం
- మాల్దా జిల్లాలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో భాజపాకు కాంగ్రెస్, సీపీఎం సహకరిస్తున్నాయి. ఆ పార్టీలకు ఓటు వేస్తే భాజపాకు వేసినట్లే. ఎన్నికల తర్వాత ‘ఇండియా’ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో మా పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మా ప్రభుత్వంపై కాంగ్రెస్, సీపీఎం కుట్రలు చేస్తున్నాయి. గెలుపుపై భయంతోనే మోదీ ఇప్పుడు మహిళల మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నారు. మాకు ప్రతి మతం ముఖ్యం.
అసత్యమేవ పరాజయతే
- ఎక్స్ వేదికగా, యూపీ సభల్లో సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
అబద్ధాలే పునాదిగా ఉన్నవారికి ఓటమి తప్పదు. అసత్యమేవ పరాజయతే. యూపీలో రిజర్వేషన్లను తొలగించిన భాజపా ఇప్పుడు వాటిని ఎవరు తొలగించినా ఊరుకోబోమని నిస్సిగ్గుగా చెబుతోంది. ఆ విషయాన్ని ఓటర్లు నిలదీయాలి. తప్పుడు ప్రకటనలు యూపీ ఓటర్లను మరింత ఆగ్రహానికి గురిచేస్తాయి. మూడోదశలో భాజపాకు ఒక్క స్థానమూ రాదు. రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నవారిని ప్రజలు మార్చేస్తారు.
మంగళసూత్రం ధరించని ప్రియాంక.. నెహ్రూ ఆత్మ కన్నీరుపెడుతుంది
- మధ్యప్రదేశ్లోని గునాలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
ప్రియాంక గాంధీ వంటి నకిలీగాంధీలు ఓట్ల కోసం తమ ఇంటిపేరు వాడుకుంటున్నారు. మంగళసూత్రమైనా ధరించని మునిమనవరాలు ప్రియాంక తమ కుటుంబంలో పుట్టిందని జవహర్లాల్ నెహ్రూ ఆత్మ తప్పకుండా కన్నీరుపెడుతుంది. సాధారణంగా ఆడపిల్లకి పెళ్లయ్యాక అత్తవారి ఇంటిపేరే వర్తిస్తుంది. ఓట్లయావ ఉన్న కొందరు మాత్రం ఈరోజుకీ గాంధీ పేరు వాడుకుంటున్నారు. అసలైన గాంధీ వారసులు ఎక్కడున్నారు?
దిల్లీలో బలహీన ప్రభుత్వమే మమతకు కావాలి
- పశ్చిమబెంగాల్లోని బహరంపుర్లో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటును మేం కోరుకుంటున్నాం. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాత్రం దిల్లీ గద్దెపై బలహీన ప్రభుత్వం ఉండాలని ఆశిస్తున్నారు. అవినీతి, వేధింపులు, వివక్ష, బుజ్జగింపు రాజకీయాలకు మమతా బెనర్జీ ప్రభుత్వం మారుపేరుగా మారిపోయింది. ఈ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది.
ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే భాజపా గెలుపు సులువుకాదు
- యూపీలోని మురేనాలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి
ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా సాగితే, ఈవీఎంలను తారుమారు చేయకపోతే భాజపా గెలుపు అంత సులభం కాదు. దర్యాప్తు సంస్థల్ని గతంలో కాంగ్రెస్ రాజకీయమయం చేసినట్లే ఇప్పుడు భాజపా చేస్తోంది. పేదవారికి ఉచితంగా రేషన్ ఇవ్వడం కంటే వారికి ఉపాధి కల్పించడం అసలైన పరిష్కారం. ఇప్పటికీ దేశ సరిహద్దులు సురక్షితంగా లేకపోవడం ఆందోళనకరం. భాజపా, కాంగ్రెస్లు అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్
-
కర్నూలులో చెరువు వద్ద ముగ్గురు ట్రాన్స్జెండర్ల అనుమానాస్పద మృతి
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు