ప్రజలను నమ్మించి మోసం చేసిన మోదీ
ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం కర్ణాటకలోని సేడం, గుర్మిట్కల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు.
కర్ణాటక ప్రచార సభల్లో రేవంత్రెడ్డి
ఈనాడు-హైదరాబాద్, బెంగళూరు: ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. సోమవారం కర్ణాటకలోని సేడం, గుర్మిట్కల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘గత పదేళ్లలో ప్రజలకు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. నల్లధనాన్ని తెచ్చి ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పి మోసం చేశారు. 40 కోట్ల మంది పేదలతో బ్యాంకు ఖాతాలు తెరిపించిన మోదీ.. వారి ఖాతాల్లో ఒక్క పైసా కూడా వేయలేదు. భాజపాను ఓడించి, ప్రజలకు అండగా ఉండే కాంగ్రెస్ను గెలిపించుకోవాలి. మీ కోసం కొట్లాడేవారికే ఓటువేయండి. భాజపా నేతలకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసేందుకే మోదీ 400 సీట్లు కావాలంటున్నారు. రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటు వేయండి. మోదీ విధానాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. కర్ణాటకలో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను గెలిపించి.. మోదీని గద్దె దించడానికి సహకరించాలి. మోదీకి గుజరాత్ అండగా ఉన్నట్లే.. ఖర్గేకు కర్ణాటక అండగా నిలవాలి. కాంగ్రెస్లో ఓ సాధారణ కార్యకర్త కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టవచ్చని మల్లికార్జున ఖర్గే నిరూపించారు. ఇవి కర్ణాటక, గుజరాత్ మధ్య జరుగుతున్న ఎన్నికలు. మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయం. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఐదు గ్యారంటీ హామీలను ప్రభుత్వం అమలు చేసింది. తెలంగాణలోనూ ఆరు గ్యారంటీల్లోని హామీల్లో ఐదింటిని అమలు చేస్తున్నాం. గత లోక్సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి 25 మంది భాజపా అభ్యర్థులను ఎంపీలుగా ప్రజలు గెలిపిస్తే.. కర్ణాటకకు మోదీ ఇచ్చింది ఒకే ఒక్క క్యాబినెట్ మంత్రి పదవి. గుజరాత్లో 26 మంది ఎంపీల్లో ఏడుగురికి మంత్రి పదవులు దక్కాయి. ఇది కర్ణాటకకు జరిగిన అన్యాయం. కరవు వచ్చినా ఆయన ఇచ్చిందేమీ లేదు. కనీసం బెంగళూరుకు నీళ్లు కూడా ఇవ్వలేదు’’ అని విమర్శించారు.
ప్రజ్వల్ రేవణ్ణ వ్యవహారంపై ఏం బదులిస్తారు: ప్రియాంక
దేశానికి ఎంతో మంది ప్రధానులు వచ్చారని.. వారంతా సత్యమార్గంలో నడిచారని, మోదీ మాత్రం ఏమీ చేయలేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ తప్పుపట్టారు. సేడం సభలో ఆమె ప్రసంగించారు. మహిళల మంగళసూత్రాల గురించి ప్రధాని మోదీ పదే పదే మాట్లాడుతున్నారని.. ఎంతో మంది మహిళలపై అత్యాచారానికి పాల్పడిన ఎన్డీఏ నేత ప్రజ్వల్ రేవణ్ణ తరఫున ప్రచారం చేసిన మోదీ, అమిత్ షాలు నేడు ఏం బదులిస్తారని ప్రశ్నించారు. క్రీడాకారులను వేధించినా, మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడినా మోదీ మౌనంగా ఉంటారని మండిపడ్డారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ మోదీ, అమిత్షాలు నిత్యం కాంగ్రెస్ను విమర్శించటం తప్ప ప్రజలకు ఏం చేశారో చెప్పరన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం
-
గతేడాది ‘ఫైనల్’ ఓవర్ పునరావృతం అవుతుందనుకున్నా: రుతురాజ్ గైక్వాడ్