శత్రువులే మిత్రులైన వేళ!
మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మిత్రులు శత్రువులుగా.. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాష్ట్రంలో పార్టీలు చీలిపోయి రెండు కూటముల్లో చేరిపోవడంతో ఎవరు ఎటు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి
ముంబయి: మహారాష్ట్రలో విచిత్ర పరిస్థితి నెలకొంది. మిత్రులు శత్రువులుగా.. శత్రువులు మిత్రులుగా మారుతున్నారు. రాష్ట్రంలో పార్టీలు చీలిపోయి రెండు కూటముల్లో చేరిపోవడంతో ఎవరు ఎటు ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది.
- నాందేడ్లో చికలికర్ ఒకప్పుడు శివసేన ఎమ్మెల్యే. చవాన్కు బద్ధ శత్రువు. చికలికర్ 2019లో భాజపాలో చేరారు. నాందేడ్లో ఆయన చవాన్ను ఓడించారు. ప్రస్తుతం చవాన్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన చికలికర్ తరఫున ఈసారి ప్రచారం చేస్తున్నారు.
- మావల్ లోక్సభ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ను శివసేన నేత శ్రీరంగ్ బర్నే ఓడించారు. శరద్ పవార్ కుటుంబంలో ఓటమి చవిచూసిన తొలి వ్యక్తిగా పార్థ్ పవార్ నిలిచారు. 2024కు వచ్చేసరికి అజిత్ పవార్ భాజపా కూటమిలో చేరి తన కుమారుడిని ఓడించిన బర్నే తరఫున ప్రచారం చేస్తున్నారు. బర్నే శిందే నేతృత్వంలోని శివసేన తరఫున బరిలోకి దిగారు.
- శివసేనలో ఉన్న సినీ, టీవీ నటుడు అమోల్ కోల్హేను ఎన్సీపీలోకి తీసుకొచ్చిన అజిత్ పవార్ 2019లో శిరూర్ నుంచి పోటీ చేయించారు. ఆయన అప్పటి సిటింగ్ శివసేన ఎంపీ అధల్రావ్ పాటిల్ను ఓడించారు. కోల్హే ఇప్పుడు శరద్ పవార్ పార్టీలో ఉన్నారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా శిరూర్ సీటు అజిత్ వర్గానికి దక్కింది. దీంతో కోల్హేను ఓడించేందుకు శివసేనలో ఉన్న అధల్రావ్ను ఎన్సీపీ తరఫున అజిత్ పోటీ చేయిస్తున్నారు. ఇప్పుడు కోల్హేకు వ్యతిరేకంగా అజిత్ ప్రచారం చేయాల్సి వస్తోంది. గత ఎన్నికల్లో అధల్రావ్కు వ్యతిరేకంగా ఆయన ప్రచారం చేశారు.
- ముంబయి దక్షిణ మధ్య నియోజకవర్గంలో శిందే శివసేన తరఫున రాహుల్ శివాలే పోటీ చేస్తున్నారు. ఆయన శివసేన నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం శిందే వర్గంలో ఉన్నారు. ఈ సీటులో ఉద్ధవ్ పార్టీ తరఫున అనిల్ దేశాయ్ పోటీ చేస్తున్నారు. దేశాయ్కు మద్దతుగా కాంగ్రెస్ నేత వర్ష గైక్వాడ్ ప్రచారం చేస్తున్నారు. వర్ష తండ్రి ఏక్నాథ్ గైక్వాడ్ను 2014లో శివాలే ఓడించారు.
- బారామతిలో పవార్ కుటుంబంలోనే పోరు సాగుతోంది. తన సోదరి సుప్రియా సూలే తరఫున గత కొన్ని దశాబ్దాలుగా ప్రచారం చేస్తూ వస్తున్న అజిత్ పవార్ ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా రంగంలోకి దిగారు. ఇక్కడ తన సతీమణి సునేత్రా పవార్ను పోటీకి నిలిపారు. ఈ విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. అజిత్ చిన్న తమ్ముడైన శ్రీనివాస్, ఆయన కుటుంబ సభ్యులు సుప్రియా సూలేకు మద్దతు తెలిపారు.
- బీడ్లో ఎంపీ ప్రీతమ్ ముండేను మార్చి ఆమె సోదరి పంకజ ముండేకు భాజపా టికెట్ ఇచ్చింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పంకజను ఆమె కజిన్ ధనంజయ్ ముండే ఓడించారు. ధనంజయ్ ఇప్పుడు అజిత్ పవార్ పార్టీతో ఉన్నారు. దీంతో ఆయన పంకజ తరఫున ప్రచారం చేయాల్సి వస్తోంది.
- రాయ్గఢ్లో గత ఎన్నికల్లో శివసేన ఎంపీ అనంత్ గీతేను ఎన్సీపీకి చెందిన సునీల్ తత్కారే ఓడించారు. అప్పట్లో కాంగ్రెస్ తత్కారేకు మద్దతుగా నిలిచింది. ఇప్పుడు తత్కారే అజిత్ వర్గంలో ఉన్నారు. గీతే ఉద్దవ్తోనే ఉన్నారు. ఇప్పుడు గీతే తరఫున కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ
-
రూ.లక్షల్లో జీతాలు.. ఫలితాలు అంతంతమాత్రమా?
-
ఆర్ఆర్ఆర్ అటవీ భూసేకరణ మళ్లీ మొదటికి..!
-
ధోనీని ఔట్ చేయడమే టర్నింగ్ పాయింట్.. యశ్కే ఈ అవార్డు: డుప్లెసిస్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!