కళంకిత కాంగ్రెస్ కలలు కంటోంది
కళంకిత నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కోవాలని కలలు కంటోందని, ముగిసిన రెండు దశల లోక్సభ ఎన్నికల పోలింగులో ‘ఇండియా’ కూటమి ఇప్పటికే ఓడిపోయిందన్న విషయాన్ని గ్రహించడం లేదని ప్రధాని మోదీ అన్నారు.
ఇండియా కూటమిలో నాయకత్వ యుద్ధం
ఫేక్ వీడియోలతో భాజపాపై దుష్ప్రచారం
మహారాష్ట్ర, కర్ణాటక సభల్లో ప్రధాని మోదీ
పుణె, సోలాపుర్, సతారా: కళంకిత నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని లాక్కోవాలని కలలు కంటోందని, ముగిసిన రెండు దశల లోక్సభ ఎన్నికల పోలింగులో ‘ఇండియా’ కూటమి ఇప్పటికే ఓడిపోయిందన్న విషయాన్ని గ్రహించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. సోమవారం మహారాష్ట్ర, కర్ణాటక ప్రచారసభల్లో ఆయన మాట్లాడారు. సోలాపుర్ ర్యాలీలో మోదీ ప్రసంగిస్తూ.. దేశ ప్రజలు ఇప్పటికే పదేళ్లు తనను పరీక్షించారని, మరోవైపు విపక్ష ఇండియా కూటమిలో నాయకత్వ సంక్షోభం ఉందన్నారు. దీని కోసం జరిగిన మహాయుద్ధంలో దేశాన్ని దోచుకునేలా అయిదేళ్లకు అయిదుగురు ప్రధానమంత్రుల ఫార్ములాతో ఓ ఒప్పందానికి విపక్షాలు వచ్చాయన్నారు. ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోలేనివారి చేతికి దేశ పరిపాలన పగ్గాలు అందించి, మళ్లీ ఆ తప్పు చేస్తారా? అని మోదీ ప్రశ్నించారు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీని ఉద్దేశించి విమర్శలు చేస్తూ.. నాయకత్వానికి తమ కూటమిలో పలువురు నేతలు ఉన్నట్లు ‘నకిలీ’ శివసేన చెబుతోందని, వారి లక్ష్యమంతా ‘మలాయ్’ (వెన్న/అవినీతికి సూచికగా) తినడమేనని ఎద్దేవా చేశారు. పుణె సభలో మాట్లాడిన మోదీ ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ పేరెత్తకుండా రాజకీయాల్లో అస్థిరతల యుగానికి నాంది పలికిన ‘సంచార ఆత్మ’గా ఆయనను అభివర్ణించారు. కాంగ్రెస్ను వీడుతున్నవారంతా ఆ పార్టీ ఇప్పుడు మావోయిస్టుల నియంత్రణలోకి వెళ్లిపోయినట్లు చెబుతున్నారన్నారు.
పెద్ద సంఘటన సృష్టిస్తారేమో!
భాజపా సారథ్యంలోని తమ సర్కారును ప్రత్యర్థులు నేరుగా ఎదుర్కొనలేక, కృత్రిమమేధను దుర్వినియోగం చేస్తూ నకిలీ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నట్లు ప్రధాని ఆరోపించారు. పశ్చిమ మహారాష్ట్ర సతారా జిల్లా కరాడ్ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘‘వచ్చే నెల ఓ పెద్ద సంఘటన సృష్టించాలని వీరంతా చూస్తున్నారు. ఇటువంటి వీడియోలపై అధికారులకు ఫిర్యాదు చేయండి’’ అని ప్రజలను కోరారు. ఈ వీడియోల వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని తాను కోరుతున్నట్లు ప్రధాని చెప్పారు.
కర్ణాటక ఖజానా ఖాళీచేసిన వసూల్ గ్యాంగ్
ఈనాడు, బెంగళూరు: ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మతప్రాతిపదికన రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని, తాను అలా జరగనివ్వనని ప్రధాని మోదీ అన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు భాజపా వైపు ఉన్నందున మైనార్టీలను బుజ్జగించాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. కర్ణాటకలోని బాగల్కోటె ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. స్థానిక కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్పకాలంలోనే రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్.. ప్రభుత్వాన్ని నడపటం లేదని, వసూల్ గ్యాంగ్ను నడుపుతోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు