ఎంపీ ప్రజ్వల్పై ఎట్టకేలకు వేటు
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జనతా దళ్ (సెక్యులర్) అధినాయకత్వం మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
జనతా దళ్ కీలక నిర్ణయం
బాధిత మహిళలను విచారిస్తున్న సిట్
ఈనాడు, బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జనతా దళ్ (సెక్యులర్) అధినాయకత్వం మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ‘మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడికి పాల్పడినట్లు కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. ఈ వ్యవహారం పార్టీ ప్రతిష్ఠకు, నేతల గౌరవానికి మచ్చ తెచ్చేలా ఉంది. ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో విచారణ జరుపుతోంది. పార్టీ నిబంధనల ప్రకారం ప్రజ్వల్ రేవణ్ణను తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని జేడీఎస్ మహా ప్రధాన కార్యదర్శి కె.ఆర్.శివకుమార్ ఓ ప్రకటన జారీ చేశారు. ఇవే ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హెచ్.డి.రేవణ్ణపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. మరోవైపు ఈ కేసులో 24 గంటల్లోపు విచారణకు హాజరు కావాలని రేవణ్ణ, ప్రజ్వల్కు సిట్ తాఖీదులు జారీ చేసింది. సిట్ సీనియర్ ఏడీజీపీ బి.కె.సింగ్ నేతృత్వంలోని 18 మంది అధికారుల బృందం ఆధారాల సేకరణలో నిమగ్నమైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలను ఎఫ్ఎస్ఎల్ పరిశీలనకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. హాసనలోని హొళెనరసీపుర స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలితో పాటు వీడియోల్లో కనిపిస్తున్న మహిళలను గుర్తించిన సిట్.. వారి నుంచి వివరాలు సేకరించి, కేసును అధ్యయనం చేయనున్నట్లు తెలిపింది.
ఎన్నికల వేళ కుట్ర: కుమారస్వామి
ఎన్నికల సమయంలో ఇలాంటి వీడియోలను విడుదల చేయడం రాజకీయ కుట్రలో భాగమని జనతా దళ్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన మంగళవారం హుబ్బళ్లిలో విలేకరులతో మాట్లాడుతూ ఇలాంటి ఘటన గతంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడి విషయంలోనూ జరిగిందని గుర్తుచేశారు. ‘నాడు ప్రధాని మోదీ, నాటి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సహకారంతో ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆ మాత్రం కృతజ్ఞత లేని కాంగ్రెస్.. ప్రజ్వల్ విషయంలో భాజపాను కూడా దోషిగా చిత్రీకరించే ప్రయత్నం సరికాదు. ప్రజ్వల్ దోషిగా తేలితే పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించేందుకు వెనకాడం. రాష్ట్ర ప్రభుత్వం ఈ వీడియోల్లో ఉన్న మహిళలకు రక్షణ కల్పించే ప్రయత్నం చేయలేదు. వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ కాకుండా చూడాల’ని కోరారు. ఈ వీడియోల వెనుక కాంగ్రెస్ నాయకుడొకరు ఉన్నారంటూ పరోక్షంగా డీకే శివకుమార్నుద్దేశించి ఆరోపించారు. కుమారస్వామి వ్యాఖ్యలపై స్పందించిన శివకుమార్.. తాను ఏదైనా తేల్చుకోవాలంటే నేరుగా ఎన్నికల్లోనే తలపడతానని, ఇలాంటి చిల్లర వీడియోలతో రాజకీయం చేయనని బదులిచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.