సంక్షిప్త వార్తలు (7)
దిల్లీలో ఆప్తో పొత్తు కాంగ్రెస్లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది.
దిల్లీలో కాంగ్రెస్కు ‘ఆప్’సోపాలు
ఇంటర్నెట్డెస్క్: దిల్లీలో ఆప్తో పొత్తు కాంగ్రెస్లో అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. వారం వ్యవధిలోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. రెండు లోక్సభ సీట్లలోని ఇద్దరు పరిశీలకులు పార్టీని వీడారు. ఆప్తో పొత్తు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో వారు పేర్కొన్నారు. పార్టీ పశ్చిమ, ఉత్తర దిల్లీ పార్లమెంట్ స్థానాల పరిశీలకులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు నీరజ్ బసోయా, నసీబ్ సింగ్ ఈ లేఖలు రాశారు.
ఖర్గేజీ! కాంగ్రెస్ ఓటమికి మిమ్మల్నే నిందిస్తారు
కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దుచేసే ఉద్దేశం మోదీ సర్కారుకు లేదు. అలా చేయాలని ఎవరైనా అనుకున్నా, పార్లమెంటులో మా సభ్యుడు ఒక్కరున్నా కూడా అడ్డుకుంటాం. పదేపదే బిగ్గరగా, బాహాటంగా అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ నైజం. ఒక్క (గాంధీ) కుటుంబం కోసం అబద్ధాలు చెబుతూ పోవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు నా సూచన. ఆ కుటుంబం ఎవరినీ పట్టించుకోదు. జూన్ 4న ఫలితాలు రాగానే అన్నాచెల్లీ (రాహుల్, ప్రియాంక) బాగానే ఉంటారు. ఎన్నికల్లో ఓటమికి 80 ఏళ్ల ఖర్గేయే మాటపడాల్సి ఉంటుంది.
ఛత్తీస్గఢ్లోని కోర్బాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఓటింగ్ శాతం ఆకస్మికంగా ఎలా పెరిగింది?
లోక్సభ రెండు దశల పోలింగ్లో ఓటింగ్ శాతాన్ని ఆలస్యంగా విడుదల చేయడం, అది ఆకస్మికంగా పెరగడం అనుమానాలకు తావిస్తోంది. అంచనాల కంటే అధికారిక ప్రకటనలో ఓటింగ్ 5.75 శాతం ఎక్కువగా ఉంది. భాజపాకు అనుకూలంగా ఓటింగ్ జరగని చోట్ల ఇలాంటి పెరుగుదల ఉంది. ఇది ఆందోళనకరం. కొన్ని ఈవీఎంల ఆచూకీ చాలా రోజులుగా తెలియడం లేదు. భాజపా వాటిని తారుమారు చేసిందేమో?
ముర్షిదాబాద్ జిల్లా ఎన్నికల ర్యాలీలో పశ్చిమ బెంగాల్ సీఎం మమత
పాపాలు చేసిన చేతులతోనే మోదీ పూజలు
దేశ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా, పేదల ఆకలి తీర్చకుండా ప్రధాని మోదీ పాపాలు చేస్తున్నారు. ఆ చేతులతోనే దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయన లక్ష్యం సమాజంలో సౌభ్రాతృత్వాన్ని చెడగొట్టడమే. మోదీ మతిభ్రమించిన వ్యక్తిలా ప్రసంగిస్తుంటారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేసేందుకు కాకుండా, దేశాన్ని ధనికులకు దోచిపెట్టేందుకే ఆయన ప్రధానమంత్రి అయ్యారు.
కర్ణాటకలోని యాద్గిర్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
గాంధీ ఆశయం నెరవేరుతుంది.. కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది
మహాత్మాగాంధీ ఆశయాల్లో రెండింటిని ఈ ఎన్నికల్లో దేశప్రజలు నెరవేర్చనున్నారు. మొదటిది.. రాజకీయాల నుంచి కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోతుంది. రెండోది.. ప్రపంచంలో బలమైన దేశంగా భారత్ను నిలబెట్టడం. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ని రద్దుచేయాలనేది గాంధీ ఆశయం.
ఈశాన్య దిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్
మత ప్రాతిపదికన విభజించకండి
ముస్లింలు ఎవరి హక్కులనూ లాక్కొనిపోరు. ఇతర మతాలను గౌరవించాలని అల్లా ప్రబోధించారు. అన్ని మతాలనూ సమానంగా చూస్తారనే ఉద్దేశంతోనే దేశవిభజన సమయంలో ముస్లిం ఆధిపత్య జమ్మూకశ్మీర్ భారత్తో ఉండాలని నిర్ణయించుకుంది. దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇండియా కూటమికి వ్యతిరేకులంతా దేశానికి వ్యతిరేకులు.
రాజౌరీ జిల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా
డీప్ఫేక్తో కాంగ్రెస్ తప్పుడు ప్రచారం
భయపెట్టడం, గందరగోళపరచడం, వదంతులు వ్యాప్తిచేయడం, ఇప్పుడు డీప్ఫేక్.. అన్నిరకాలుగా దుష్ప్రచారానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అత్యయిక పరిస్థితి విధించి, ప్రజాస్వామ్యాన్ని చెరబట్టింది ఆ పార్టీయే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు మేం హక్కులు కల్పిస్తే కాంగ్రెస్సే వాటిని లాక్కొనిపోయింది. 400 సీట్ల లక్ష్యాన్ని చేరుకోవడంలో యూపీ కీలకంగా నిలుస్తుంది. రాముడిని తిరిగి తీసుకువచ్చినవారికి ప్రజలు మళ్లీ అధికారమిస్తారు.
లఖ్నవూలో పీటీఐ వార్తాసంస్థతో కేంద్ర మంత్రి అనురాగ్ఠాకుర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు