‘మత’ రిజర్వేషన్ల ఉద్దేశం లేదని లిఖిత గ్యారంటీ ఇవ్వగలరా?
కాంగ్రెస్ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు.
కాంగ్రెస్ యువరాజుకు ఇదే నా సవాల్
గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని
బనాస్కాంఠా, హిమ్మత్నగర్ (గుజరాత్): కాంగ్రెస్ మత ప్రాతిపదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని అనుకుంటోందని, ఆ పార్టీ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి అటువంటి ఉద్దేశం లేకపోతే లిఖితపూర్వక గ్యారంటీ ఇవ్వగలరా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సవాలు విసిరారు. బుధవారం గుజరాత్లోని డీసా, హిమ్మత్నగర్ పట్టణాల ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మాట్లాడారు. మోదీ, భాజపా ఉన్నంతవరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల విద్య, ఉద్యోగాల రిజర్వేషన్లు సురక్షితమన్నారు. ‘‘కాంగ్రెస్ యువరాజుకు (రాహుల్ను ఉద్దేశించి) నేను సవాలు చేస్తున్నా. ఆయన పార్టీ, వారి మద్దతుదారులు మతం పేరిట ఎన్నడూ రిజర్వేషన్లను దుర్వినియోగం చేయబోమని, రాజ్యాంగంతో ఆడుకోబోమని గ్యారంటీ ఇవ్వాలి. జనరల్ కేటగిరీలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పేదల రిజర్వేషన్లు ముట్టుకోబోమని రెండో గ్యారంటీ కూడా ఇవ్వాలి. ఈ రెండు గ్యారంటీలను కాంగ్రెస్ లిఖితపూర్వకంగా ఇవ్వాలి. అలా వారు ఎప్పటికీ చేయరు’’ అని ప్రధాని తెలిపారు. ‘‘మూడోవిడత కూడా మోదీ అధికారంలోకి వస్తే దేశం రగిలిపోతుందని కాంగ్రెస్ యువరాజు చెబుతున్నారు. వాస్తవానికి ఇపుడు కాంగ్రెస్ రగులుతోంది. ఎందుకంటే వారి కలలన్నీ ఇప్పటికే బూడిదగా మారిపోయాయి’’ అన్నారు.
400 స్థానాల మద్దతున్నా రాజ్యాంగం జోలికి వెళ్లలేదే!
రాజ్యాంగాన్ని మార్చేస్తారని, రిజర్వేషన్లు రద్దు చేస్తారని భాజపాపై కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం పూర్తిగా కల్పితగాధ అని ప్రధాని కొట్టిపారేశారు. ‘‘రాజ్యాంగాన్ని మార్చేందుకే మోదీ 400 స్థానాలు అడుగుతున్నట్లు వాళ్లు (విపక్షాలు) అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. వాళ్లకు తెలియదేమో.. ఇపుడు రద్దుకానున్న లోక్సభలో ఎన్డీయేకు దాదాపు 360 మంది ఎంపీలు ఉన్నారు. బయట నుంచి మద్దతు ఇచ్చిన బీజేడీ, వైకాపా స్థానాలతో కలిపి 400కు ఎప్పుడో చేరుకున్నాం. కానీ, మేమొచ్చింది రాజ్యాంగాన్ని మార్చే పాపం చేయడానికి కాదు’’ అని మోదీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ‘ప్రేమ దుకాణం’ ఎప్పుడో ఫేక్ వీడియోల ఫ్యాక్టరీగా మారిపోయిందన్నారు. ‘‘చాయ్వాలా అని నన్ను తేలిగ్గా తీసుకున్నారు. ధైర్యముంటే ఎదురుగా వచ్చి పోరాడండి. వారి యువరాజు మోదీ వర్గాన్ని, ఓబీసీలను ‘దొంగలు’ అన్నారు. దీనికి దేశమంతా స్పందించి వారిని 40 స్థానాలకు పరిమితం చేసింది. ప్రస్తుత ఎన్నికల్లో మెజార్టీకి కావాల్సిన కనీస స్థానాలకు కూడా పోటీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుచేయడం గురించి మాట్లాడుతోందని ప్రధాని ఎద్దేవా చేశారు.
వారణాసిలో 13న మోదీ నామినేషన్!
లఖ్నవూ: లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి భాజపా తరఫున పోటీ చేస్తున్న ప్రధాని మోదీ నామినేషను దాఖలుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న మోదీ నామినేషను పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ భాజపా వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిర్వహించే భారీర్యాలీకి ముందు కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని దర్శించుకోనున్నట్లు సమాచారం. వారణాసిలో చివరివిడత కింద జూన్ 1న పోలింగు జరగనుంది. మే 7న నోటిఫికేషను వెలువడి, నామినేషన్ల సమర్పణకు 14వ తేదీ వరకు గడువు ఉంటుంది. ఇక్కడ మోదీకి ప్రత్యర్థిగా యూపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్రాయ్ సైతం వరుసగా మూడోసారి పోటీలో ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్
-
చైనాకు తగ్గి.. భారత్కు పెరిగిన విదేశీ పెట్టుబడులు : ఐరాస
-
ఏపీలో ఎన్నికల ముందు.. తర్వాత హింసపై సిట్ దర్యాప్తు
-
దేశంలో ఎన్నడూ చూడని నియంతృత్వ పాలన: కేజ్రీవాల్
-
వాళ్లు అధికారంలోకి వస్తే రామమందిరంపైకి బుల్డోజర్లే: కాంగ్రెస్, ఎస్పీపై మోదీ ధ్వజం