ప్రజాక్షేత్రంలో శివసేనలకు పరీక్ష
శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి.
ప్రజల మద్దతు ఎవరికో తేల్చనున్న ముంబయి
మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల ముఖాముఖి
ముంబయి: శివసేన పార్టీల మధ్య కీలక పోరు ముంబయిలో జరగనుంది. ఇక్కడి మొత్తం 6 నియోజకవర్గాల్లో 3 చోట్ల రెండు శివసేనలే ముఖాముఖి తలపడుతున్నాయి. ఏక్నాథ్ శిందే, ఉద్ధవ్ ఠాక్రేలకు ఇది ఒక రకంగా పరీక్షే. అధికారికంగా శివసేనను శిందే వర్గం దక్కించుకున్నా ప్రజా క్షేత్రంలో ఎవరికి మద్దతుందో ఈ ఎన్నికల ద్వారా తేలనుంది. మిగిలిన 3 నియోజకవర్గాల్లో రెండు చోట్ల భాజపా, కాంగ్రెస్ మధ్య, మరో చోట శివసేన (ఉద్ధవ్), భాజపాల మధ్య పోరు సాగుతోంది. ముంబయిలో మే 20వ తేదీన పోలింగ్ జరగనుంది. శివసేన, ఎన్సీపీల్లో చీలికల తర్వాత జరుగుతున్న అతి పెద్ద ఎన్నికలివే. ఇటీవల ఆంధేరీ ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగినా శిందే శివసేన, భాజపా పోటీ చేయలేదు.
ముంబయి నగరంలో 24 లక్షల మంది ఓటర్లున్నారు. సబర్బన్లో 74 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
పోటీలో ఎవరెవరు?
- దక్షిణ ముంబయిలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అరవింద్ సావంత్, శిందే వర్గానికి చెందిన యామిని జాదవ్ తలపడుతున్నారు.
- దక్షిణ మధ్య ముంబయిలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అనిల్ దేశాయ్, శిందే వర్గానికి చెందిన రాహుల్ శెవాలే పోటీ పడుతున్నారు. - వాయవ్య ముంబయిలో ఉద్ధవ్ వర్గానికి చెందిన అమోల్ కీర్తికర్, శిందే వర్గానికి చెందిన రవీంద్ర వైకర్ తలపడుతున్నారు.
- ఉత్తర మధ్య ముంబయిలో కాంగ్రెస్ నుంచి వర్షా గైక్వాడ్, భాజపా తరఫున న్యాయవాది ఉజ్వల్ నికం పోటీ చేస్తున్నారు. - ఉత్తర ముంబయిలో భాజపా తరఫున కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, కాంగ్రెస్ తరఫున భూషణ్ పాటిల్ పోటీ పడుతున్నారు. - ఈశాన్య ముంబయిలో భాజపా నుంచి మిహిర్ కొటెకా, ఉద్ధవ్ పార్టీ నుంచి సంజయ్ దినా పాటిల్ పోటీ చేస్తున్నారు.
తొలిసారి కాంగ్రెస్కు ఓటేయనున్న ఠాక్రే
బాంద్రాలో ఉంటున్న ఉద్ధవ్ ఠాక్రే తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేయనున్నారు. ఆయన ఉంటున్న ప్రాంతం కాంగ్రెస్ తరఫున వర్షా గైక్వాడ్ పోటీ చేస్తున్న ఉత్తర మధ్య ముంబయి నియోజకవర్గంలోకి వస్తుంది.
శివసేనల మధ్య పోటీ జరగనున్న స్థానాలు
- దక్షిణ ముంబయి
- దక్షిణ మధ్య ముంబయి
- వాయవ్య ముంబయి
భాజపా, ఉద్ధవ్ పార్టీల మధ్య..
ఈశాన్య ముంబయి
భాజపా, కాంగ్రెస్ మధ్య..
- ఉత్తర ముంబయి
- ఉత్తర మధ్య ముంబయి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు.
తాజా వార్తలు
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే