రాహుల్ను ప్రధాని చేయాలని పాకిస్థాన్ తహతహ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజును భారత్కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
గుజరాత్ సభల్లో మోదీ
ఆనంద్, సురేంద్రనగర్, జూనాగఢ్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ యువరాజును భారత్కు తదుపరి ప్రధాని చేయాలని పొరుగు దేశం పాకిస్థాన్ తహతహలాడుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకోసం పాక్ నేతలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తున్నారని తెలిపారు. గురువారం గుజరాత్లోని ఆనంద్, సురేంద్రనగర్, జూనాగఢ్ ఎన్నికల సభల్లో మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ పాక్కు ‘భక్తురాలు’ (మురీద్) అనే విషయం అందరికీ తెలుసని, ఈ రెండింటి మధ్యనున్న భాగస్వామ్యం ఇప్పుడు బయటపడిందన్నారు. ‘‘దేశంలో కాంగ్రెస్ నానాటికీ బలహీనపడుతోంది. ఇక్కడ ఆ పార్టీ అస్తిత్వాన్ని కోల్పోతుంటే.. అక్కడ పాకిస్థాన్ కన్నీళ్లు పెట్టుకుంటోంది’’ అని దుయ్యబట్టారు. భారత్లో 26/11 ముంబయి ఉగ్రదాడుల నాటి బలహీన సర్కారు, 2014కు ముందున్న అవినీతి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావాలని శత్రు దేశాలు కోరుకుంటున్నాయని చెప్పారు. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన ఫవాద్ హుసేన్ తన సోషల్ మీడియా ఖాతాలో రాహుల్గాంధీ గురించి ఓ పోస్ట్ పెడుతూ ‘రాహుల్ ఆన్ ఫైర్’ అని రాసుకొచ్చారు. ఆ మరుసటిరోజే మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గతంలో ఉగ్రవాదులను ఎగుమతి చేసి, బాంబులు పట్టుకొన్న ఆ దేశం చేతుల్లో ఇపుడు బొచ్చె ఉందని ప్రధాని విమర్శించారు. ఖర్గే ఇటీవల ఛత్తీస్గఢ్ సభలో దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ఇపుడు హిందువుల నడుమ విభేదాలు సృష్టించాలని చూస్తోందని ధ్వజమెత్తారు. ‘‘కాంగ్రెస్ రాజకుటుంబానికి సవాలు చేస్తున్నా. ఆర్టికల్ 370 పునరుద్ధరణ, సీఏఏ రద్దు, ట్రిపుల్ తలాఖ్ నిషేధం రద్దు వంటి అంశాలు మీ రహస్య అజెండాలో ఉంటే ముందుకువచ్చి చెప్పండి. మీరెంత ధైర్యవంతులో చూస్తాను’’ అని మోదీ అన్నారు. సర్దార్ పటేల్ లేకపోతే జూనాగఢ్ కూడా పాకిస్థాన్కు వెళ్లిపోయేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎవరూ నివాసం లేరని కచ్ ఎడారిని ఇతర దేశాలకు ఇచ్చేస్తుందని, ఎవరూ అడగకపోతే హిమాయల శిఖరాలను సైతం అమ్మేస్తుందని మోదీ విరుచుకుపడ్డారు.
ఓట్ జిహాద్ అంటే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే
కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ మేనకోడలు, సమాజ్వాదీ పార్టీ నాయకురాలు మరియా ఆలం ఓట్ జిహాద్కు పిలుపునివ్వడంపైనా మోదీ మండిపడ్డారు. ‘‘ఇప్పటివరకు లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ గురించి విన్నాం. ఇండియా కూటమి నేతలు ఓట్ జిహాద్ గురించి చెబుతున్నారు. మదర్సాలో కాకుండా బాగా చదువుకున్న ముస్లిం కుటుంబానికి చెందిన మహిళ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. దీన్ని ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడూ ఖండించలేదే?’’ అని ప్రధాని ప్రశ్నించారు. ‘‘రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకొని నృత్యం చేయడం కాదు, దాని విశిష్టత తెలుసుకోవాలంటే మోదీ దగ్గరకు రా’’ అని రాహుల్కు సవాలు విసిరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం