సంక్షిప్త వార్తలు (7)
మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది.
భాజపా నాయకురాలిపై అనుచిత వ్యాఖ్యలు.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
భోపాల్: మధ్యప్రదేశ్ మాజీ మంత్రి, భాజపా నాయకురాలు ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగాలతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు జీతూ పట్వారీపై శుక్రవారం కేసు నమోదైంది. భిండ్, గ్వాలియర్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఇమర్తీ దేవి మాట్లాడినట్లు ఉన్న ఓ ఆడియో క్లిప్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అయితే అది తన గొంతు కాదని ఆమె స్పష్టం చేశారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ ఆడియో క్లిప్పై విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఇమర్తీ దేవిపై జీతూ పట్వారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో గ్వాలియర్లోని డబ్రా పట్టణ పోలీసు స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. మరోవైపు- ఇమర్తీ దేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు జీతూ పట్వారీ ‘ఎక్స్’ వేదికగా క్షమాపణలు తెలిపారు.
ప్రధాని విమానాలను కొనుక్కున్నారుగానీ.. రైతుల రుణాలను మాఫీ చేయలేదు: ప్రియాంక
ఆగ్రా: ప్రధాని మోదీ సొంత అవసరాల కోసం విమానాలను కొనుక్కున్నారుగానీ రైతుల రుణాలను మాఫీ చేయలేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ విమర్శించారు. ఉత్తర్ప్రదేశ్లోని ఫతేహ్పుర్ సీకరీలో కాంగ్రెస్ అభ్యర్థి తరఫున శుక్రవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆమె పాల్గొన్నారు. ‘ఎన్నికలప్పుడు మీ భావోద్వేగాలను వాడుకుని ఆయన ఓట్లు సాధిస్తారు. కానీ మీకు ఏమీ ఇవ్వరు. ఆయన సంపన్నులైన తన స్నేహితులకే అన్నీ ఇస్తారు’ అని ప్రియాంక ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ విస్మరించిన గ్రామీణాన్ని మేం మారుస్తున్నాం
స్వాతంత్య్రానంతరం భారీ పరిశ్రమలు, రహదారులపైనే తొలి ప్రధాని నెహ్రూ దృష్టిసారించడంతో గ్రామీణ ప్రాంతాలు విస్మరణకు గురయ్యాయి. అవి ఎలాంటి సదుపాయాలకు నోచుకోలేదు. దీనివల్ల నగరాలకు వలసలు పెరిగాయి. మోదీ సర్కారు మాత్రం భిన్న విధానాల ద్వారా గ్రామీణ భారతాన్ని మార్చాలని ప్రయత్నిస్తోంది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
పాక్ ఎన్నికల్లో రాహుల్ నెగ్గుతారు
ఒకవేళ పాకిస్థాన్లో ఎన్నికలు జరిగినట్లయితే, రాహుల్గాంధీ అక్కడ పోటీచేస్తే భారీ ఆధిక్యంతో నిస్సందేహంగా నెగ్గుతారు. ఆ దేశంలో ఆయనతో సరితూగలేక మేం చేతులెత్తేస్తాం. ఎందుకంటే అక్కడ ఆయనకు చాలా ప్రజాదరణ ఉంది! మన దేశంలో మాత్రం నరేంద్రమోదీదే గెలుపు.
అస్సాంలోని బార్పెటా లోక్సభ ర్యాలీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ
జూన్ 4 తర్వాత కాంగ్రెస్ను ఖర్గే వెతుక్కోవాలి
లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడిన తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే తన పార్టీ ఎక్కడుందో వెతుక్కునే యాత్ర చేపట్టాలి. ఎందుకంటే ఆ పార్టీ ఇక ఎక్కడా కనిపించదు. కర్ణాటకలో దేశవ్యతిరేక శక్తులతో కలిసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రూ.12 లక్షల కోట్ల అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఒకవైపు, ఒక్క అవినీతి ఆరోపణా లేకుండా 23 ఏళ్లుగా ప్రభుత్వాధినేతగా ఉన్న మోదీ నేతృత్వంలోని భాజపా మరోవైపు ఉన్నాయి. రాహుల్, మోదీల్లో మీకు ఎవరు కావాలి? ఉద్ధవ్ ‘నకిలీ’ శివసేన నడుపుతున్నారు. అసలైన పార్టీ శిందేతోనే ఉంది.
గోవా, కర్ణాటక, మహారాష్ట్ర సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా
ఆడబిడ్డలు ఓడిపోయారు.. అతడే గెలిచాడు
లోక్సభ ఎన్నికల్లో భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ కుమారుడికి టికెట్ ఇవ్వాలన్న భాజపా నిర్ణయంతో కోట్లమంది ఆడపిల్లల మనోధైర్యాన్ని దెబ్బతీశారు. ప్రభుత్వం ఒక వ్యక్తిముందు అంత బలహీనంగా లొంగిపోయిందా? మేం పగలూరాత్రీ ఎంతో పోరాడినా ఇంతవరకు ఆ ఎంపీని అరెస్టు చేయలేదు. శ్రీరాముడి పేరుతో ఓట్లు మాత్రమే కావాలా? ఆయన చూపిన బాటలో నడవరా?
సోషల్ మీడియాలో రెజ్లర్ సాక్షి మలిక్
ఫోన్లలో మాట్లాడేందుకూ ప్రజలు భయపడుతున్నారు
ప్రభుత్వంలో ఎవరు తమ మాటలు వింటున్నారో అనే ఆలోచనతో ప్రజలు ఫోన్లో మాట్లాడడానికే భయపడుతున్నారు. భాజపా పాలనలో ప్రజాస్వామ్యానికి ముప్పు పొంచి ఉంది. మీరు ఎలాంటి దేశంలో జీవించాలనుకుంటున్నారు? మీ పిల్లలు ఎలా ఎదగాలని కోరుకుంటున్నారు? అనే విషయాలు గుర్తుంచుకుని ఓటు వేయండి.
గోవాలో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు