50% రిజర్వేషన్ల పరిమితిని మోదీ ఎత్తేయగలరా?
దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు
ప్రచార సభల్లో రాహుల్ ధ్వజం
పుణె, భువనేశ్వర్: దేశంలో 50శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిమితిని ప్రధాని మోదీ ఎత్తేయగలరా అని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ధ్వంసం చేయడానికి భాజపాతోపాటు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే కుల గణను జరిపి తీరుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన మాట్లాడారు. ఒడిశాలోని రాయగడలో జరిగిన సభలోనూ ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే రాయ్బరేలీలో నామినేషన్ వేయాల్సి ఉన్నందున అక్కడి సభలో ఆయన వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. ‘రాజ్యాంగాన్ని మారిస్తే భారత్ గుర్తింపు కోల్పోతుంది. మేం అధికారంలోకి రాగానే కుల గణన చేపడతామన్న మాటను నిలబెట్టుకుంటాం. 50శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తాం. ఈ పరిమితివల్ల కోట్ల మంది ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. మన పోరాటం రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికే. మోదీ, ఆర్ఎస్ఎస్, భాజపాల పెద్దలు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని చూస్తున్నారు. వారు రాజ్యాంగాన్ని మార్చడం గురించి, రిజర్వేషన్లను ఎత్తేయడం గురించి మాట్లాడుతున్నారు. ఇటువంటి ప్రయత్నాలను మేం ఎన్నటికీ అనుమతించం. దేశంలో 15శాతం మంది దళితులు, 8శాతం మంది గిరిజనులు, 50శాతం ఓబీసీలున్నారు. వీరి మొత్తం జనాభా 73శాతం. కానీ కార్పొరేట్, ఇతర రంగాల్లో వారి ప్రాతినిధ్యం నామమాత్రం. అందుకే కాంగ్రెస్ కుల గణన చేపడతామని చెబుతోంది. వారికి న్యాయం చేస్తామంటోంది’ అని పుణె సభలో రాహుల్ పేర్కొన్నారు.
‘రాజ్యాంగాన్ని రక్షించడానికి ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగంవల్లే దళితులకు, ఆదివాసీలకు, ఇతర బలహీనవర్గాలకు న్యాయం జరుగుతోంది. అలాంటి రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలని భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారు. మేం గిరిజనులను ఆదివాసీలు అని పిలుస్తుంటే భాజపా నేతలు వనవాసీలంటూ అవమానపరుస్తున్నారు. గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అడవులు, నీరు, భూములను అప్పగిస్తుంది. ఒడిశాలోని రైతులు, దళితులు, కార్మికులు, గిరిజనులు, ఓబీసీలకు కొంత నగదు సాయం చేస్తాం. రైతుల రుణాలను మాఫీ చేస్తాం. అంగన్వాడీ, ఆశా వర్కర్ల వేతనాలను రెట్టింపు చేస్తాం’ అని రాయగడలో ప్రదర్శించిన వీడియో సందేశంలో రాహుల్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
ఇక కంటితోనే స్క్రీన్ను ఆపరేట్ చేసేలా: త్వరలో యాపిల్ కొత్త ఫీచర్లు
-
ఆరోగ్యకరమైన ఆహారం.. జొమాటోలో కొత్త ఫీచర్
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు