వయనాడ్లో ఓటమి భయంతోనే.. రెండోచోట యువరాజు పోటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు.
కాంగ్రెస్కు ఆల్టైం అతి తక్కువ స్థానాలు
బెంగాల్లో ద్వితీయశ్రేణి పౌరుల్లా హిందువులు: మోదీ
బర్ధమాన్, కృష్ణానగర్, బీర్భూమ్ (పశ్చిమబెంగాల్): కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆయన కొత్త సీటు వెదుక్కొంటారని తాను ముందే చెప్పానని గుర్తు చేశారు. కాంగ్రెస్ యువరాజు (రాహుల్ను ఉద్దేశించి) కేరళలోని వయనాడ్లో ఓడిపోతాననే భయంతోనే రాయ్బరేలీ బరిలోకి దిగుతున్నారని విమర్శించారు. అమేఠీ నుంచి పోటీ చేయడానికి భయపడి రాయ్బరేలీ పారిపోయారని ఎద్దేవా చేశారు. శుక్రవారం పశ్చిమబెంగాల్లోని బర్ధమాన్, దుర్గాపుర్, కృష్ణానగర్, బీర్భూమ్ ఎన్నికల సభల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోపాటు తృణమూల్ సర్కారుపై ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు అతితక్కువ సీట్లు వస్తాయి. 50 దాటడం కూడా కష్టమే. కాంగ్రెస్ చరిత్రలో ఈ ఎన్నికల్లో గెలిచేవే అతి తక్కువ సీట్లు. దీనిపై ఎలాంటి ఒపీనియన్ పోల్స్ అవసరం లేదు’’ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అధికారమిస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషను కోటాలు లాక్కొని ‘జిహాదీ ఓటుబ్యాంకు’కు కట్టబెడుతుందని విమర్శించారు. హిందువులను భాగీరథి నదిలో విసిరేస్తామంటూ టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు ప్రకటించారని, ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) వ్యతిరేకిస్తున్న బెంగాల్ సర్కారు హిందువులను ద్వితీయశ్రేణి పౌరులుగా చేసిందని మండిపడ్డారు. స్కూల్ సర్వీస్ కమిషన్ కుంభకోణం కారణంగా రాష్ట్రంలో ఉద్యోగాలు కోల్పోయినవారిలో ఎలాంటి తప్పు చేయని టీచర్లు, అభ్యర్థుల సహాయార్థం భాజపా రాష్ట్ర శాఖ ప్రత్యేక లీగల్సెల్, సామాజిక మాధ్యమ వేదిక ఏర్పాటు చేస్తుందని మోదీ ప్రకటించారు. సందేశ్ఖాలీ అల్లర్ల నిందితుడు షేక్ షాజహాన్ను కాపాడాలని చూసిన బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి సమాధి తవ్వుతోందని ప్రధాని విరుచుకుపడ్డారు.
భూములు, మద్యం, గనులు, ఇసుక ఝార్ఖండ్లో ఏదీ వదలడం లేదు
రాంచీ, చాయీబాసా: ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) - కాంగ్రెస్ సంకీర్ణ సర్కారు నేతలు పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారని, రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకొంటున్నారని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. ఝార్ఖండ్ రాష్ట్రం చాయీబాసాలోని టాటా కళాశాల మైదానంలో శుక్రవారం ఏర్పాటుచేసిన ‘మహా విజయ్ సంకల్ప్ సభ’ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సంథాల్ పరగనాల డివిజనులో చొరబాట్లను ప్రోత్సహిస్తున్న జేఎంఎం సర్కారు పొరుగున ఉన్న బెంగాల్ తరహాలో ఓటుబ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. దీని కారణంగా గిరిజన జనాభా తగ్గుతోందని, స్థానిక మహిళలకు రక్షణ ఉండటం లేదని తెలిపారు. సంకీర్ణ సర్కారు నేతలు గిరిజనుల భూములు, ఆర్మీ భూములు, మద్యం, గనులు, ఇసుక.. ఇలా ఏదీ వదలడం లేదన్నారు. ఝార్ఖండ్ రాష్ట్రాన్ని భాజపా ఏర్పాటుచేసిందని, తమ శవాల మీదుగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయండన్న నేతలతో నేడు జేఎంఎం చేతులు కలిపిందని ప్రధాని విమర్శించారు. శుక్రవారం సాయంత్రం ఝార్ఖండ్ రాజధాని రాంచీలో మోదీ గంటసేపు భారీ రోడ్షో నిర్వహించారు. చాయీబాసా నుంచి రాంచీ చేరుకోగానే స్థానిక బిర్సా కూడలిలోని గిరిజన పోరాటవీరుడు బిర్సాముండా విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించారు. రోడ్షో అనంతరం రాజ్భవన్కు చేరుకొన్న మోదీకి గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ స్వాగతం పలికారు. ఝార్ఖండ్లో శనివారం కూడా ప్రధాని ఎన్నికల ప్రచారం కొనసాగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
ఏపీలో ఎన్నికల ముందు తర్వాత హింసపై సిట్ ..ఐజీ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు
-
గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. త్వరలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్!
-
మనీలాండరింగ్ కేసులో ఇరుక్కున్నారు.. రూ. 60లక్షలు చెల్లించండి!