రాయ్బరేలీలో రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే.
నామినేషన్ల చివరిరోజు నిర్ణయం
అమేఠీ నుంచి కేఎల్ శర్మ
దిల్లీ, రాయ్బరేలీ, అమేఠీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ యూపీలోని రాయ్బరేలీ స్థానం నుంచి కూడా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగారు. కేరళలోని వయనాడ్ నుంచి ఆయన పోటీ చేయగా అక్కడ పోలింగ్ కూడా ముగిసిన విషయం తెలిసిందే. దీనికి అదనంగా.. తాను ఇదివరకు ప్రాతినిధ్యం వహించిన అమేఠీ నుంచి గానీ, తల్లి సోనియాగాంధీని రెండు దశాబ్దాలుగా లోక్సభకు పంపుతూ వస్తున్న రాయ్బరేలీ నుంచి గానీ ఆయన బరిలో దిగవచ్చని గత కొద్దిరోజులుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. తర్జనభర్జనల అనంతరం సోనియా కుటుంబం చివరకు రాయ్బరేలీవైపే మొగ్గింది. పార్టీ విధేయుడైన సీనియర్ నేత కిశోరీలాల్ శర్మ (కె.ఎల్.శర్మ)కు అమేఠీలో అవకాశమిచ్చింది. గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన ఆయన గత ఇరవై ఏళ్లుగా ఈ రెండు ప్రతిష్ఠాత్మక స్థానాలనూ సోనియా కుటుంబం తరఫున పర్యవేక్షిస్తూ వస్తున్నారు. రాహుల్, శర్మ.. ఇద్దరూ శుక్రవారం తమ నామపత్రాలు సమర్పించారు. రాయ్బరేలీలో అట్టహాసంగా సాగిన రాహుల్ నామినేషన్ కార్యక్రమానికి సోనియా, ప్రియాంక, రాబర్ట్ వాద్రా, మల్లికార్జున ఖర్గే వంటి అగ్రనేతలంతా హాజరయ్యారు. తాజా పరిణామాలతో ప్రియాంక ఈసారి పోటీ చేయడం లేదని స్పష్టమైంది. సోనియా 2004 నుంచి 2024 వరకు రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించి, ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో సోనియా చేతిలో ఓడిపోయిన ప్రతాప్ సింగ్నే మరోసారి భాజపా అక్కడ బరిలోకి దించింది.
వారసత్వం కాదు.. బాధ్యత: కాంగ్రెస్
పోరాట బరి నుంచి పారిపోయినవారు దేశానికి నేతృత్వం వహిద్దామనుకుంటున్నారని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన ప్రయోగం విఫలమవుతుందని హోంమంత్రి అమిత్షా వ్యాఖ్యానించారు. ‘ఓడిపోయిన సీటులో గాంధీ కుటుంబం మళ్లీ పోటీ చేయదు. రాహుల్ అమేఠీలో ఓడినందుకు దానిని విడిచిపెట్టారు. ఇప్పుడు రాయ్బరేలీలో ఓడిపోతే ఆ స్థానాన్ని కూడా వదిలేస్తారు. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్లా గాంధీ కుటుంబం నుంచి రాహులే ఇక్కడ చివరివారు’ అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఎన్నికలకు ముందే అమేఠీలో ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని అక్కడి భాజపా అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతిఇరానీ ఎద్దేవా చేశారు. విమర్శలకు కాంగ్రెస్ తరఫున పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరణ ఇచ్చారు. దీర్ఘకాల వ్యూహంతోనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తమ ఎత్తుగడ భాజపా, దాని మద్దతుదారులను కలవరపెడుతోందని పేర్కొన్నారు. ‘ఇది వారసత్వం కాదు. ఒక బాధ్యత, విధి. అమేఠీ, రాయ్బరేలీ మాత్రమే కాదు.. దేశం మొత్తం గాంధీ కుటుంబానికి బలమైన కోట. ఉత్తర్ప్రదేశ్ నుంచి మూడుసార్లు, కేరళ నుంచి ఒకసారి రాహుల్ ఎంపీగా గెలిచారు’ అని చెప్పారు.
ప్రియాంక ఒకచోటకు పరిమితం కాకూడదనే..
ప్రియాంక దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మోదీ అసత్యాలను ఎండగడుతున్నారని, అందుకే ఆమె ఒక్క నియోజకవర్గానికే పరిమితం కాకూడదని భావించామని జైరాం తెలిపారు. ఎక్కడైనా ఉప ఎన్నిక ద్వారా ఆమె పార్లమెంటుకు వెళ్లవచ్చని చెప్పారు. అమేఠీ నుంచి రాహుల్పై పోటీ చేయడమే ఇప్పటివరకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఉన్న గుర్తింపు అని, ఇకపై ఆమెకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం ఉండబోదని అన్నారు.
రాహుల్ ఆస్తులు రూ.20 కోట్లు
తనకు రూ.20 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నట్లు రాహుల్గాంధీ ప్రకటించారు. దీనిలో రూ.3.81 కోట్ల షేర్లు సహా చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు. బ్యాంకులో దాచుకున్న రూ.26.25 లక్షలు, బంగారం బాండ్లుగా రూ.15.21 లక్షలు దీనిలో కలిపి ఉన్నాయి. స్థిరాస్తుల విలువను రూ.11.15 కోట్లుగా పేర్కొన్నారు. సొంతంగా సముపార్జించిన ఆస్తులు రూ.9.04 కోట్లు, వారసత్వంగా వచ్చినవి రూ.2.10 కోట్లు అని చూపించారు. చేతిలో నగదు రూ.55వేలు ఉందని, అప్పులు రూ.49.79 లక్షలు ఉన్నాయని తెలిపారు. 22-23 ఆర్థిక సంవత్సరంలో రాహుల్ వార్షిక సంపాదన రూ.1.02 కోట్లు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆయన ఎం.ఫిల్. చేశారు. మోదీ సమాజ్ను కించపరిచేలా మాట్లాడినందుకు రెండేళ్ల జైలుశిక్ష పడిందని, దానిని సుప్రీంకోర్టు కొట్టివేసిందని ఆయన వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..
-
బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది సజీవ దహనం
-
మనీషా కొయిరాలకు క్షమాపణలు చెప్పిన సోనాక్షి సిన్హా.. ఎందుకంటే!