సంక్షిప్త వార్తలు (5)
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది.
ఆప్ ప్రచార తారల్లో కేజ్రీవాల్ దంపతులు
దిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఆయన భార్య సునీత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఈ జాబితాలో ఉన్నారు. మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ పేర్లూ ఉన్నాయి. కేజ్రీవాల్, సిసోదియా, సత్యేందర్ జైన్లు ముగ్గురూ ప్రస్తుతం జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఎంపీల్లో సంజయ్సింగ్, రాఘవ్ చడ్డా, సందీప్ పాఠక్, దిల్లీ మంత్రుల్లో అతిశీ, సౌరభ్ భరద్వాజ్, గోపాల్రాయ్, కైలాష్ గహ్లోత్ ప్రచార తారల జాబితాలో చోటు లభించింది. కొందరు పార్టీ నేతలు, పంజాబ్ మంత్రులు కూడా ప్రచార తారలుగా వ్యవహరించనున్నారు.
ప్రధాని వ్యాఖ్యలపై ఈసీకి జేఎంఎం ఫిర్యాదు
రాంచీ: ఝార్ఖండ్ పర్యటనలో ప్రధానమంత్రి అన్ పార్లమెంటరీ భాష వాడారని, దీనిపై చర్య తీసుకోవాల్సిందిగా కోరుతూ రాష్ట్రంలోని జేఎంఎం ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. ఝార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జి గులాం అహ్మద్ మిర్ స్పందిస్తూ.. ‘‘రాహుల్ను ‘షెహజాదా’ (యువరాజు) అని ప్రధాని అంటున్నారు. రాహుల్ ‘షహీద్జాదా’ (అమరుడి తనయుడు) అనే విషయం ప్రజలకు తెలుసు’’ అన్నారు.
భాజపా గూటికి అర్విందర్ సింగ్ లవ్లీ
దిల్లీ: దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన అర్విందర్ సింగ్ లవ్లీ భారతీయ జనతా పార్టీలో చేరారు. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పురీ సమక్షంలో శనివారం ఆయన కాషాయ పార్టీ కండువా కప్పుకొన్నారు. పార్టీ పదవికి రాజీనామా చేసిన రోజు తాను ఏ పార్టీలోనూ చేరబోనంటూ పేర్కొన్న ఆయన.. వారం తిరగక ముందే భాజపాలో చేరడం గమనార్హం. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం భాజపాలో చేరారు.
తన పత్రాలతో మరొకరు నామినేషన్ వేశారని ఫిర్యాదు
ఠాణేలో కేసు నమోదు
ఠాణె: లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఓ వ్యక్తిని మోసగించి అలాంటి పేరు కలిగిన మరొకరు నామినేషన్ వేసిన ఘటనపై మహారాష్ట్రలోని ఠాణె పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. భివాండి నుంచి పోటీ చేసేందుకు మిలింద్ దేవ్రామ్ కాంబ్లే అనే వ్యక్తికి ఓ పార్టీ ఏ, బీ ఫాంలు ఇచ్చింది. అలాంటి పేరే కలిగిన మిలింద్ కాశీనాథ్ కాంబ్లే.. దేవ్రామ్ కాంబ్లేను మాయమాటలతో నమ్మించి నామినేషన్ పత్రాలు, పాన్, ఆధార్ సహా ఇతర ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నాడు. వాటితో తానే అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. దీనిపై బాధితుడు చేసిన ఫిర్యాదుతో శుక్రవారం ఠాణె పోలీసులు మిలింద్ కాశీనాథ్ కాంబ్లేపై కేసు నమోదు చేశారు. అక్కడ మే 20న ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారమే నామినేషన్లకు చివరిరోజు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఔరంగజేబు పాలనలా ఉంది
కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోలో జిజియా పన్ను (వారసత్వ సంపదపై పన్ను), గోవధ గురించి ప్రస్తావించింది. ఇది మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రూర పాలనను తలపింపజేస్తోంది. హుందా అయిన ముస్లిం కుటుంబాలు తమ పిల్లలకు ఔరంగజేబు పేరు పెట్టరు. ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను లాక్కొనిపోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. మైనారిటీలు, మెజారిటీ ప్రజల ఆహార అలవాట్లు దాదాపు ఒకటే అయినా సమాజంలో ఎక్కువమంది గోవధను వ్యతిరేకిస్తారు. అలాంటి గోవధకు మద్దతు పలికే స్థాయికి కాంగ్రెస్ ఇప్పుడు దిగజారిపోయింది.
మధ్యప్రదేశ్లోని అశోక్నగర్ పట్టణంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
సందేశ్ఖాలీ ఉదంతం భాజపా కుట్ర
సందేశ్ఖాలీలో అంతా ఒక పథకం ప్రకారమే జరిగింది. కుట్రతో దీనిని భాజపా రూపొందించింది. వాస్తవమేమిటో ఇప్పుడు బహిర్గతమైంది. చాలారోజులుగా నేను ఈ విషయం చెబుతున్నాను. సందేశ్ఖాలీపై సందేశాన్ని ఇచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు కేంద్ర ప్రతినిధిగా ఉన్న గవర్నర్ ఆనంద్బోస్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు?
పశ్చిమబెంగాల్లోని నదియా జిల్లాలో సీఎం మమతా బెనర్జీ
మా పార్టీవారు చేసినా అది తప్పే
మధ్యప్రదేశ్లోని ఇందౌర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి చివరిక్షణంలో వైదొలగడం ఆశ్చర్యకరం. అది సముచితం కాదు. ఉపసంహరణకు ఒకవేళ మా పార్టీవారు కారణమైనా అది తప్పే. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతినిధిని ఎంచుకునే హక్కు ప్రజలకు ఉంటుంది. ఇందౌర్లో భాజపా విజయం ఖాయమైపోయింది. ఇక్కడ కమలాన్ని ఎవరూ ఓడించలేరు. భాజపా 400 సీట్ల లక్ష్యంలో తప్పేమీ లేదు.
పీటీఐ ఇంటర్వ్యూలో లోక్సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
కేజీహెచ్ సూపరింటెండెంట్కు అస్వస్థత.. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
పని ఒత్తిడి, విజిలెన్స్ విచారణ..ఎస్టీపీపీ అధికారి బలవన్మరణం