మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
మూడో విడతలో బెంగాల్లో 4 స్థానాలకు పోలింగ్
అన్నింటా త్రిముఖ పోటీ
ఈనాడు ప్రత్యేక విభాగం
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటికి కాంగ్రెస్, వామపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సార్వత్రిక ఎన్నికల మూడో విడతలో భాగంగా బెంగాల్లో కీలకమైన మాల్దా ఉత్తరం, మాల్దా దక్షిణం, ముర్శీదాబాద్, జంగీపుర్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాల్లో మైనార్టీల ప్రాబల్యం ఎక్కువ. దానికితోడు స్థానికంగా వివిధ రాజకీయ సమీకరణాలు పోటీని ఆసక్తికరంగా మార్చాయి. ప్రస్తుతం ఈ నాలుగు చోట్లా త్రిముఖ పోటీ కనిపిస్తోంది.
మాల్దా ఉత్తరం: తృణమూల్లో విభేదాలు
ఇది భాజపా సిటింగ్ స్థానం. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ ఖగేన్ ముర్ము మరోసారి బరిలో దిగారు. తృణమూల్ నుంచి మాజీ ఐపీఎస్ అధికారి ప్రసూన్ బెనర్జీ, కాంగ్రెస్ అభ్యర్థిగా ముస్తాక్ ఆలం పోటీ చేస్తున్నారు. ఈ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వాటిలో నాలుగింటిని తృణమూల్, మూడింటిని భాజపా గెల్చుకుంది. దాన్ని బట్టి తృణమూల్దే కాస్త పైచేయి అనిపిస్తున్నా.. అంతర్గత విభేదాలతో ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. దిగ్గజ నేత ఏబీఏ ఘనీ ఖాన్ చౌధరీ కుటుంబానికి మాల్దా జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఆ కుటుంబానికి చెందిన మౌసమ్ నూర్ మాల్దా ఉత్తరంలో 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచారు. 2019లో ఆమె తృణమూల్ తరఫున పోటీ చేయగా, ఘనీ కుటుంబానికే చెందిన ఇషా ఖాన్ చౌధరీ కాంగ్రెస్ నుంచి బరిలో దిగారు. ఫలితంగా వారి మధ్య ఓట్లు చీలి.. భాజపా అభ్యర్థి ఖగేన్ ముర్ము గెలిచారు. ఈ దఫా తృణమూల్ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై నూర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఫలితంగా పార్టీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్లో మొత్తం లోక్సభ సీట్లు 42
ముర్శీదాబాద్: ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లు తృణమూల్వే..
ఈ నియోజకవర్గం తృణమూల్ సిటింగ్ స్థానం. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ అబూ తాహిర్ ఖాన్ మరోసారి బరిలో ఉన్నారు. సీపీఎం నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ సలీం పోటీ చేస్తున్నారు. భాజపా గౌరీశంకర్ ఘోష్కు టికెట్ ఇచ్చింది. 1980 నుంచి 1999 దాకా ఈ స్థానం సీపీఎం ఖాతాలో ఉంది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తర్వాత ఈ సీటు 2014లో సీపీఎం, 2019లో తృణమూల్ ఖాతాలోకి వెళ్లింది. ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వాటిలో ఆరు ప్రస్తుతం తృణమూల్ సిటింగ్ స్థానాలు. అయితే ఇటీవల భాజపా బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. సీపీఎం తరఫున మహమ్మద్ సలీం లాంటి సీనియర్ నేత బరిలో ఉండటంతో ముక్కోణపు పోరు ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
మాల్దా దక్షిణం: భాజపా జోరు
ఇది కాంగ్రెస్ సిటింగ్ స్థానం. 2019 ఎన్నికల్లో ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి, ఘనీ కుటుంబానికి చెందిన అబూ హసీం ఖాన్ చౌధరీ స్వల్ప మెజార్టీతో భాజపా నాయకురాలు శ్రీరూప మిత్ర చౌధరీపై విజయం సాధించారు. ప్రస్తుతం హసీం ఖాన్ తనయుడు ఇషా ఖాన్ చౌధరీ కాంగ్రెస్ టికెట్పై బరిలో నిలిచారు. కమలదళం మరోసారి శ్రీరూపకు టికెట్ ఇచ్చింది.లండన్లో సుదీర్ఘకాలం నివసించిన ఎన్నారై షానవాజ్ అలీ రెహాన్ను ఇక్కడ తృణమూల్ బరిలో నిలిపింది.
జంగీపుర్: ప్రణబ్తో అనుబంధం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఈ నియోజకవర్గంతో అనుబంధం ఎక్కువ. 2004, 2009 ఎన్నికల్లో ఇక్కణ్నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. ప్రణబ్ రాష్ట్రపతి పదవిని చేపట్టిన తర్వాత ఆయన తనయుడు అభిజిత్ ముఖర్జీ రెండుసార్లు ఈ స్థానంలో పోటీ చేశారు. ప్రస్తుతం ఇది తృణమూల్ సిటింగ్ సీటు. ఆ పార్టీ తరఫున స్థానిక ఎంపీ, స్థానిక వ్యాపారవేత్త ఖలీలుర్ రహ్మాన్ మళ్లీ పోటీ చేస్తున్నారు. భాజపా అభ్యర్థి ధనంజయ్ ఘోష్, కాంగ్రెస్ నేత మొర్తాజా హొస్సేన్ల నుంచి రహ్మాన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
మోదీ నాతో చర్చకు వస్తే అడిగే ప్రశ్నలివే..: రాహుల్ గాంధీ
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు