సంక్షిప్త వార్తలు (7)
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా.
రిజర్వేషన్ లాక్కోవడమే కాంగ్రెస్ ఎజెండా
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా. మునుపటిమాదిరి ఓటుబ్యాంకు రాజకీయాలు, కులమతాల రాజకీయాలు లేకుండా అందరి అభివృద్ధికి పాటుపడడమే నరేంద్రమోదీ సర్కారు లక్ష్యం. మైనారిటీలను ప్రత్యేకంగా చూస్తామని మ్యానిఫెస్టోలోనూ కాంగ్రెస్ చెప్పింది. అలాంటి పార్టీకి తగిన బుద్ధి చెప్పండి.
ఛత్తీస్గఢ్లోని సూరజ్పుర్లో భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా
మోదీ రాజకీయ చరిత్ర అంతా హిందూ-ముస్లిం వివాదాలపైనే
ప్రధాని నరేంద్రమోదీ రాజకీయ చరిత్ర అంతా హిందూ-ముస్లిం వివాదాలపైనే ఆధారపడి ఉంది. దానినుంచి ఎవరు లబ్ధిపొందారో, ఎవరు ఇబ్బందులు పడ్డారో ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అసలైన అంశాలపై కాకుండా కులమతాలపై భాజపా ఓట్లు అడుగుతోంది. ఎన్నికల్లో భాజపా విజయంలో ఈవీఎంల పాత్ర ఉందనే నేను అనుకుంటున్నాను.
పీటీఐ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్సింగ్
రాముడి పేరుతో ఓట్లు అడుగుతారు అభివృద్ధిపై మాట్లాడరు
ద్వారక, మథుర, అయోధ్య వంటి ప్రతి ఆలయానికీ నరేంద్ర మోదీ వెళ్తారు. రాముడి పేరుతో ఓట్లడుగుతారు. అభివృద్ధి, ద్రవ్యోల్బణం, ఉద్యోగాల గురించి మాత్రం మాట్లాడరు. 2019లో పుల్వామా దాడి ఎందుకు జరిగిందో కూడా చెప్పరు. మొదటి రెండు దశల లోక్సభ ఎన్నికల తర్వాత భాజపా వెనకబడింది.
ముంబయిలో విలేకరులతో శివసేన (ఉద్ధవ్ వర్గం) నేత సంజయ్ రౌత్
వాజ్పేయీ చెప్పిన రాజధర్మం వ్యాఖ్య గుర్తుంది
గోధ్రా రైలు ఘటనపై మా తండ్రి లాలూ గురించి మోదీ ఏమైనా చెప్పనీయండి. గుజరాత్లో మతపరమైన అల్లర్లు చెలరేగినప్పుడు అప్పటి ప్రధాని వాజ్పేయీ ఆనాటి గుజరాత్ సీఎం మోదీని ఉద్దేశించి- రాజధర్మాన్ని పాటించాలని చెప్పిన వ్యాఖ్య నాకు గుర్తుంది.
బిహార్లోని దర్భంగాలో పీటీఐతో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
ఈవీఎం ఓ దొంగ యంత్రం
ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం) అంటే దొంగ యంత్రం. దానిలో మతలబులు జరిగే అవకాశం ఉంది. దానిని గుర్తుంచుకుని ఈ ఎన్నికల్లో ఓటు వేసినప్పుడు మీరు నొక్కిన మీట వద్ద ఎల్ఈడీ లైట్ వెలిగిందా, బీప్మనే శబ్దం వచ్చిందా లేదా అనేవి చూసుకోవాలి. మీరు ఓటువేసిన గుర్తునే ఓటు రసీదు యంత్రం చూపించిందా అనేది చూడండి.
శ్రీనగర్ శివార్లలోని సభలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా
2014 స్క్రిప్టును మోదీ చదువుతున్నారు
ముస్లింలకు రిజర్వేషన్లపై ప్రధాని మోదీ తప్పుదోవ పట్టిస్తున్నారు. 2014 స్క్రిప్టును ఇప్పుడు చదువుతున్నారు. పదేళ్లలో సాధించిందేమిటో ప్రజలకు చెప్పి ఈ ఎన్నికల్లో ఆయన ఓట్లు అడుగుతారని మేం అనుకున్నాం. అలా కాకుండా కాంగ్రెస్ గురించి తప్ప ఆయన మరేమీ మాట్లాడడం లేదు. 2004లో ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగి భాజపా అధికారం కోల్పోతుంది.
కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం అధిపతి సుప్రియా శ్రీనేత్
అసలైన అంశాలకు భాజపా జవాబివ్వదు
ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలకు భాజపా సమాధానమివ్వదు. తమ నేతల్ని మాత్రం పదేపదే రాజ్యాంగం మార్పు గురించి మాట్లాడాలని చెబుతుంది. అలా వారికి ఎందుకు చెప్పాల్సి వస్తోందో భాజపా జవాబివ్వగలదా? ఉద్యోగాల భర్తీ, ప్రశ్నపత్రాల లీకేజి, అగ్నిపథ్ పథకం వంటివాటికి సమాధానాలు లేకపోతే ఆ పార్టీకి ఓట్లు వేయకూడదు.
ఆగ్రా సభలో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు