మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు
‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు.
విపక్షాల చేతిలో పావులుగా మారామని ముస్లింలు గ్రహించారు: మోదీ
అయోధ్యలో పూజలు, రోడ్ షో
అయోధ్య, ఇటావా, సీతాపుర్ (యూపీ):‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. ఓటుబ్యాంకు రాజకీయ కాంట్రాక్టర్ల ఆటలు ఇక సాగవు. మతపరమైన రిజర్వేషన్ల డిమాండుతో మరోమారు దేశ విభజనకు విపక్షాలు రంగం సిద్ధం చేస్తున్నాయి. ఈ విషయాన్ని అవి గుర్తించడం లేదు’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ఉత్తర్ప్రదేశ్లోని ఇటావా, ధౌరెహరా ఎన్నికల సభల్లో ప్రధాని ప్రసంగించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి తమను పావులుగా వాడుకొంటున్నాయని ముస్లింలు గ్రహించారని, ఎలాంటి పక్షపాతం లేని భాజపా సర్కారు అభివృద్ధిని చూసి ఈ వర్గం విపక్షాల నుంచి దూరమవుతోందని ప్రధాని అన్నారు. జమ్మూకశ్మీర్లో పూర్తిస్థాయి రాజ్యాంగం అమలును ఇన్నాళ్లూ అడ్డుకున్న ఆర్టికల్ 370కి మోదీ సమాధి కట్టాడని, దీన్ని బయటకుతీసి మళ్లీ దేశం నెత్తిన రుద్దడం ఎవరి తరం కాదని చెప్పారు. అధికారంలోకి వస్తే ఉచిత రేషను పథకం, వందేభారత్ రైళ్ల వంటి సదుపాయాలు నిలిపివేస్తామని విపక్షాలు చెబుతున్నాయన్న మోదీ.. ‘‘సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలను నేను ఒక విషయం అడగదలచుకున్నా. అధికారంలోకి వస్తే రామమందిరాన్ని ఆసుపత్రిగా మార్చేస్తారా? కాశీ విశ్వనాథుని ఆవరణలో బుల్డోజర్ నడుపుతారా?’’ అని తీవ్రస్థాయిలో ప్రశ్నించారు.
మోదీ, యోగిలకు పిల్లలు లేరు..
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీల నేతలు వారి కుటుంబాలు, పిల్లలు, ఓటుబ్యాంకుల లబ్ధి కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని.. భావితరాల ఉజ్వల భవిష్యత్తు కోసం పనిచేస్తున్న మోదీ, యోగి (యూపీ సీఎం)లకు పిల్లలు లేరని ప్రధాని అన్నారు. సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన దివంగత ములాయంసింగ్ యాదవ్ సొంత జిల్లా ఇటావా ర్యాలీలో మోదీ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకుటుంబాలకు చెందినవారే ముఖ్యమంత్రులు, ప్రధానులు అవుతారన్న చెడు సంప్రదాయాన్ని ఈ ‘చాయ్వాలా’ (మోదీ) బద్దలు చేశాడన్నారు. ఒక దుష్ట ఆచారాన్ని (సతీ సహగమనం) రూపుమాపిన రాజా రామ్మోహన్ రాయ్ గురించి ఇప్పటికీ ఎలా చెప్పుకొంటున్నారో, అదేవిధంగా సామాన్యులకు ఉన్నత పదవులను చేరువ చేసిన ‘చాయ్వాలా’ ప్రధాని గురించి చెప్పుకొనే రోజు కూడా వస్తుందన్నారు. కొవిడ్ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టిన సమాజ్వాదీ పార్టీ నేతలు వారు మాత్రం రహస్యంగా టీకాలు తీసుకొన్నట్లు మోదీ విమర్శించారు.
అయోధ్య రాముడికి సాష్టాంగ నమస్కారం
అయోధ్యకు చేరుకొన్న ప్రధాని మోదీ నేరుగా రామమందిరాన్ని సందర్శించుకొని పూజలు చేశారు. టీవీల్లో ప్రసారమైన ఈ కార్యక్రమంలో రామ్లల్లా విగ్రహం ముందు ప్రధాని సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని పుష్పాలంకరణతో తీర్చిదిద్దారు. పూజల అనంతరం అయోధ్య నగరంలో రెండు కి.మీ.ల మేర మోదీ రోడ్షో నిర్వహించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి లల్లూ సింగ్ వెంట ఉన్నారు.
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ 14న
వారణాసి: లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి స్థానం నుంచి మరోసారి పోటీచేస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు రోజు నిర్వహించే భారీ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారని వారణాసి నగర భాజపా అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ ఆదివారం వెల్లడించారు. రోడ్ షో నిర్వహించే మార్గం ఖరారైందని, అవసరమైన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని తెలిపారు. వారణాసి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా అజయ్ రాయ్, బీఎస్పీ అభ్యర్థిగా అతహర్ జమాల్ లారీ బరిలో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో జూన్ 1న ఇక్కడ పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు