రాజకీయ క్రీడాకలాపం!
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి.
రెండింటికీ విడదీయరాని అనుబంధం
రాజకీయాల్లో రాణించిన క్రీడాకారులెందరో..
క్రీడా సంస్థలపైనా నేతల ఆధిపత్యం
(దిల్లీ నుంచి నీరేంద్ర దేవ్)
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. అదే సమయంలో కొందరు క్రీడా దిగ్గజాలు రాజకీయాల్లోకి వచ్చినా సరిపడక మళ్లీ వెనక్కి వెళ్లిన పరిస్థితులూ ఉన్నాయి. మరోవైపు ఉద్ధండ రాజకీయ నాయకులు క్రీడా సంస్థలను విజయవంతంగా నడిపిన సందర్భాలూ గోచరిస్తాయి. మన దేశంలో క్రీడా సంస్థలకు ఎంతో మంది రాజకీయ నాయకులు నేతృత్వం వహించారు.. వహిస్తున్నారు.
- తన చిన్నప్పుడు కొన్ని క్రీడల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొనేవారు. ఇప్పుడు ఆయన కుమారుడు జై షా భారత్ క్రికెట్ నియంత్రణ మండలికి (బీసీసీఐ) నేతృత్వం వహిస్తున్నారు. ఆయనకు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం కూడా రాదన్న విమర్శలను పక్కనబెడితే ఆ సంస్థను మాత్రం విజయవంతంగానే నడిపిస్తున్నారు.
- దివంగత నేత, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ భర్త అయిన ప్రియరంజన్ దాస్ మున్షీ ఒకప్పుడు ఫుట్బాల్ ఆడేవారు.
- శరద్ పవార్ ఒకప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు. 2004లో బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. 2005లో గెలిచారు. అంతకుముందు పవార్ అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్కు అధ్యక్షుడిగా పని చేశారు.
- దివంగత కేంద్ర మంత్రి మాధవరావు సింధియా బీసీసీఐ అధ్యక్షుడిగా పని చేశారు.
- మరో దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ దిల్లీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా పని చేశారు.
ఎన్నికల్లో పోటీ..
- గతంలో బిహార్ నుంచి భాజపా తరఫున ఎంపీగా గెలిచిన కీర్తి ఆజాద్ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని దుర్గాపుర్-బర్దమాన్ నుంచి తృణమూల్ తరఫున బరిలోకి దిగారు. ఆయన భాజపా బలమైన నేత దిలీప్ ఘోష్తో తలపడుతున్నారు.
- బెంగాల్లోని బహరంపుర్లో సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరిపై క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను తృణమూల్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ బరిలోకి దించారు.
రాజ్యసభకు..
- భారత రత్న, క్రికెట్ సూపర్స్టార్ సచిన్ తెందుల్కర్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు.
- పరుగుల రాణి పీటీ ఉష కూడా రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
గతంలోనూ..
- 1991లో దిల్లీలోని సదర్ సీటులో కాంగ్రెస్ తరఫున జూడో ఫెడరేషన్ అధ్యక్షుడైన జగదీశ్ టైట్లర్ పోటీ చేశారు. ఆయనపై పోటీ చేసిన ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా ఓడిపోయారు.
- 1983లో క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడైన కీర్తి ఆజాద్.. క్రీడా వ్యవహారాల్లో అరుణ్ జైట్లీతో విభేదించేవారు. ఆ తర్వాత వారిద్దరూ భాజపా తరఫున ఎంపీలుగా పనిచేయడం విశేషం.
- 1990లలో క్రికెట్లో రాణించిన చేతన్ చౌహాన్ భాజపా తరఫున పలుమార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
- ఒలింపిక్స్లో పాల్గొన్న హాకీ క్రీడాకారుడు అస్లాం షేర్ ఖాన్ కూడా రాజకీయాల్లో రాణించారు.
- క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ 1991లో భోపాల్ నుంచి బరిలోకి దిగి ఓడిపోయారు. అంతకుముందు ఆయన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పరాజయం పాలయ్యారు.
- బాస్కెట్ బాల్ మాజీ ప్లేయర్ కృష్ణ తీరథ్ దిల్లీలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు.
- 2019లో తూర్పు దిల్లీ నుంచి భాజపా తరఫున గెలిచిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఈసారి పోటీ చేయడం లేదు.
- కేంద్ర మాజీ మంత్రి సంతోష్ మోహన్ దేవ్ ఫుట్బాల్ రిఫరీగా పని చేశారు.
- ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన విద్యా చరణ్ శుక్లా కేంద్ర మంత్రిగా పని చేశారు.
- బిహార్ గవర్నర్గా పని చేసిన బూటా సింగ్ అమెచ్యూర్ అథ్లెటిక్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆయన 1982లో నిర్వహించిన ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ అధ్యక్షుడిగానూ సేవలందించారు.
- పుణెకు చెందిన వీఎన్ గాడ్గిల్ ఖోఖో ఫెడరేషన్ అధ్యక్షుడిగా పని చేశారు.
- కామన్వెల్త్ క్రీడల్లో అవకతవకల ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన సురేశ్ కల్మాడీ.. భారత్ ఒలింపిక్ సంఘానికి చాలాకాలంపాటు అధ్యక్షుడిగా పని చేశారు.
- కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్.. అఖిల భారత టెన్నిస్ సంఘానికి అధ్యక్షుడిగా పని చేశారు.
- ఒడిశా రాజకీయ నేత కేపీ సింగ్ దేవ్ కూడా బోవింగ్ అకాడమీ అధ్యక్షుడిగా పని చేశారు.
- మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్దూ పంజాబ్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నారు.
- ఫుట్బాల్ మాజీ క్రీడాకారుడు ప్రసూన్ బెనర్జీ హావ్డా నుంచి తృణమూల్ తరఫున ఎంపీగా ఎన్నికయ్యారు.
- ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్ భాజపా తరఫున గెలిచి కేంద్ర మంత్రిగా ఉన్నారు.
- క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఉత్తర్ప్రదేశ్లోని మొరాదాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. గత ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
‘3 ఇడియట్స్’ సీన్తో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు సుందర్ పిచాయ్ సలహా..
-
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
-
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు