సంక్షిప్త వార్తలు (8)
సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు.
2019కి భిన్నంగా 2024 ఎన్నికలు
పెరగనున్న ఓట్లశాతం: నివేదిక
ముంబయి: సార్వత్రిక ఎన్నికల తొలి రెండు దశల్లో ఓట్లశాతం తగ్గుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా సలహాదారుడు, ఆర్థికవేత్త సౌమ్యకాంతి ఘోష్ తన నివేదికలో పేర్కొన్నారు. పోలైన ఓట్ల ఆధారంగా విశ్లేషణ చేయడం సరైన పద్ధతి అన్నారు. 2019తో పోలిస్తే తొలి 2 దశల్లో ఓటింగ్ 3.1% తగ్గినా, మిగతా ఐదు దశల్లో ఓటింగ్ శాతం ఇంగ్లిషు అక్షరం ‘జె’ ఆకారంలో పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ‘‘కర్ణాటకలో ఎక్కువ ఓటర్లు పాల్గొనే అవకాశం ఉంది. తర్వాత స్థానాల్లో అస్సాం, మహారాష్ట్ర నిలుస్తాయి’’ అని పేర్కొన్నారు.
రాయ్బరేలీలో ఏఐసీసీ పరిశీలకుడిగా భూపేశ్ బఘేల్
అమేఠీలో అశోక్ గహ్లోత్కు బాధ్యతలు
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లో తమకు కంచుకోటల్లాంటి రాయ్బరేలీ, అమేఠీ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ ముమ్మరంగా కృషిచేస్తోంది. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులను ఆ నియోజకవర్గాల్లో తమ పార్టీ పరిశీలకులుగా సోమవారం నియమించింది. రాహుల్గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్కు, గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్ శర్మ బరిలో నిలిచిన అమేఠీలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరోవైపు- ఈ రెండు స్థానాల్లోనూ ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకాగాంధీ వాద్రా విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు.
గాంధీనగర్లో 10 లక్షల మెజార్టీపై భాజపా దృష్టి
గాంధీనగర్: గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు మెజార్టీపై భాజపా దృష్టి పెట్టింది. ఆ స్థానం నుంచి పార్టీ అభ్యర్థిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున గుజరాత్ మహిళా కాంగ్రెస్ మాజీ ఛైర్పర్సన్ సోనాల్ పటేల్ పోటీలో ఉన్నారు. అయితే ఆమె బలహీనమైన అభ్యర్థి కావడంతో ఈసారి అమిత్ షాకు 10లక్షలకు పైగా మెజార్టీని సాధించాలని స్థానిక భాజపా నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. 2019లో ఆయన 5.5 లక్షల మెజార్టీతో గెలుపొందారు.
మమతది తుచ్ఛ రాజకీయం.. రాజ్భవన్పై ‘దీదీ’గిరీ చెల్లదు: గవర్నర్
కోల్కతా: పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీది తుచ్ఛమైన రాజకీయమని గవర్నర్ ఆనందబోస్ విమర్శించారు. ఓ ఉద్యోగినిని గవర్నర్ లైంగికంగా వేధించినట్లు సీఎం ఎన్నికల ప్రచార సభల్లో ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ‘‘మమతది నీచ రాజకీయం. విశిష్టమైన గవర్నర్ కార్యాలయం- రాజ్భవన్పై ‘దీదీ’గిరీ చెలాయించాలని చూస్తే సహించేది లేదు. నేను చెప్పదలచున్నది అంతే’’ అని ఆయన అన్నారు.
కంటిపరీక్ష చేయించుకోండి
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న ‘సంపద సృష్టించడం’ అనే పదాలు అధికార పార్టీ వారికి ‘సంపదను తిరిగి పంచడం’గా కనిపిస్తున్నాయేమో. మమ్మల్ని విమర్శిస్తున్నవారు తిరిగి మాధ్యమిక పాఠశాలకైనా వెళ్లాలి, లేదా నేత్రవైద్యుడి వద్దకు వెళ్లి ఓసారి కంటిపరీక్ష చేయించుకోవాలి. ఉత్పత్తి, సేవా రంగాలు విస్తరించేలా పారిశ్రామిక, వ్యాపార విధానాలను రూపొందించాలనేది మా ఉద్దేశం. స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని నిరోధించే అన్ని చట్టాలు, నిబంధనల్ని మేం తిరిగి సమీక్షిస్తాం.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ పి.చిదంబరం
విదేశీ ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది
అబద్ధపు వాగ్దానాలతో ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ కలలు కంటోంది. అవన్నీ కల్లలవుతాయి. అది జూన్ 4న తేటతెల్లమవుతుంది. ‘డరో మత్’ అని నినదించిన రాహుల్గాంధీయే భయపడి మరో సీటు వెతుక్కుంటున్నారు. కాంగ్రెస్ 60 ఏళ్ల ఏలుబడిలో మన దేశ భూభాగం నుంచి వేల ఎకరాలు విదేశీ శక్తులకు ధారాదత్తం అయ్యాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టో చూస్తే విదేశీ ప్రమేయం సుస్పష్టంగా కనిపిస్తోంది.
హిమాచల్ప్రదేశ్లో పీటీఐతో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్
అమితాబ్ అంతటి గౌరవం దక్కింది నాకే
సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తర్వాత ఆ స్థాయిలో గౌరవాన్ని, ప్రేమను నేను పొందాను. ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలను. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, దిల్లీ, మణిపుర్ సహా దేశంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు నన్ను ఎంతగానో ప్రేమిస్తారు.
సినీనటి, మండీ నియోజకవర్గ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
నా జుట్టును కూడా భాజపా తాకలేదు
అబద్ధాల ప్రచారంతో ఎన్నికల్లో గెలిచేందుకు భాజపా ప్రయత్నిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఏకంగా అబద్ధాల బ్లూప్రింట్నే భాజపా సిద్ధం చేస్తోంది. దేశాన్ని దోచుకోవడానికి భాజపా తరఫున ఇద్దరు జాతీయ స్థాయి నాయకులున్నారు. సందేశ్ఖాలీ గురించి భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది. నా ఆఖరి శ్వాస వరకు బెంగాల్లోనే ఉంటా.. భాజపా ఎజెండాపై పోరాటం చేస్తుంటా.. నా జుట్టును కూడా భాజపా తాకలేదు.
పశ్చిమబెంగాల్లో సభల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ