సంక్షిప్త వార్తలు (6)
పంజాబ్లోని మరో మూడు లోక్సభ స్థానాలకు భాజపా బుధవారం అభ్యర్థులను ప్రకటించింది.
పంజాబ్లో మరో 3 స్థానాలకు భాజపా అభ్యర్థుల ప్రకటన
దిల్లీ/చండీగఢ్: పంజాబ్లోని మరో మూడు లోక్సభ స్థానాలకు భాజపా బుధవారం అభ్యర్థులను ప్రకటించింది. ఫిరోజ్పుర్ నుంచి మాజీ మంత్రి రాణా గుర్మీత్సింగ్ సోధి, ఆనంద్పుర్ సాహిబ్ నుంచి సుభాష్శర్మ, సంగ్రూర్ నుంచి అర్వింద్ ఖన్నా పోటీ చేస్తారని పార్టీ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలోని 13 లోక్సభ స్థానాలకు 12 స్థానాల్లో భాజపా తన అభ్యర్థులను ప్రకటించినట్లు అయింది.
ఆప్లో చేరిన బీఎస్పీ అభ్యర్థి
చండీగఢ్: ఎన్నికల వేళ బీఎస్పీకి ఎదురుదెబ్బ తగిలింది. పంజాబ్లోని హోశియార్పుర్ లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి రాకేశ్ సోమన్ ఆప్లో చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో ఆయన బుధవారం ఆప్ కండువా కప్పుకొన్నారు.
ముస్లిం లీగ్కు కొత్త రూపంలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో
ముస్లింలీగ్కు కొత్త రూపంలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉంది. హస్తం పార్టీ మ్యానిఫెస్టో న్యాయ పత్రంలా కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, సనాతన ధర్మాలకు అన్యాయ్ పత్రంలా ఉంది.అది ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను హరించేలా ఉంది. దేశ ప్రజలు కాంగ్రెస్ ఉద్దేశాలను తిరస్కరిస్తారు. భాజపా విద్వేష రాజకీయాలు చేస్తోందన్న కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముందుగా పచ్చి అబద్ధాలు చెప్పడం మానేసి, నిజాలు మాట్లాడటం నేర్చుకోవాలి.
గోరఖ్పుర్లో మీడియాతో యూపీ సీఎం ఆదిత్యనాథ్
రాజ్యాంగాన్ని మార్చే యత్నాలు తిప్పికొడతాం
రాజ్యాంగాన్ని మార్చేయాలని, రిజర్వేషన్ల కోటా లాక్కోవాలని భాజపా చేస్తున్న ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుంటాం. అధిక ధరలు, నిరుద్యోగం, నల్లధనం నిర్మూలన వంటి విషయాల్లో గత పదేళ్లలో మోదీ.. అబద్ధాలు చెప్పడమే తప్పిస్తే హామీలు నెరవేర్చడం లేదు. దేశ ఆస్తుల్ని ఆయన అమ్మేస్తున్నారు.
ఝార్ఖండ్లోని పలామూలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్
ఓట్ల కోసం హిందూ-ముస్లిం విభజన
ఓట్లు రాబట్టుకునేందుకు హిందువులు, ముస్లింల మధ్య విభజన తెచ్చేలా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారు. విద్వేషాన్ని ఎగదోయడం ఆయన స్థాయికి తగదు. ఇది నెహ్రూ భారత్ కాదు.. మోదీ భారత్. ఆయన్ని ప్రజలు గద్దె దించాలి.
శ్రీనగర్ సభలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా
ఫలితాల తర్వాత ఇండియా కూటమి కనుమరుగు
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడగానే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. ఆప్ అధినేత కేజ్రీవాల్ జైల్లో ఉన్నందువల్ల ఆ పార్టీ ఇక పోటీలో ఉండబోదు. గోవాలో కాంగ్రెస్ కంటే ఉత్సాహంగా ఉన్న ఇండియా కూటమిలోని కొన్ని రాష్ట్ర పార్టీలు.. ఫలితాల తర్వాత ఆ పార్టీలోనే విలీనమైపోతాయి.
పణజీలో మీడియాతో గోవా సీఎం ప్రమోద్ సావంత్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
కోహ్లీని మించిన స్ఫూర్తి ఎవరు.. ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
-
ఏపీలో 33 చోట్ల హింసాత్మక ఘటనలు.. డీజీపీకి సిట్ నివేదిక అందజేత!
-
తెలంగాణ మంత్రివర్గం భేటీ ప్రారంభం.. వీటిపైనే చర్చ!
-
మారణాయుధాలతో హ్యారీ విన్స్టన్లోకి చొరబడి.. రూ.కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. ఏ జట్టు ఎలా వచ్చిందంటే?
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు