కాంగ్రెస్ నేతల వెనకడుగు!
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజస్థాన్ సీనియర్ కాంగ్రెస్ నేతల్లో నిస్తేజం ఆవరించింది.
రాజస్థాన్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి ముఖం చాటేసిన సీనియర్లు
జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయంతో రాజస్థాన్ సీనియర్ కాంగ్రెస్ నేతల్లో నిస్తేజం ఆవరించింది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి ఒక్కరూ ఆసక్తి చూపలేదు. అసెంబ్లీ మాజీ స్పీకర్ సీపీ జోషి బలవంతంగా భీల్వాడా నుంచి బరిలోకి దిగాల్సి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సీఎం పదవికి పోటీ పడ్డ సచిన్ పైలట్, పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాసరా ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
పట్టు కోల్పోయిన గహ్లోత్
1980 నుంచి జోధ్పుర్లో ఐదు సార్లు ఎంపీగా గెలిచిన అశోక్ గహ్లోత్ కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జోధ్పుర్లో పట్టు కోల్పోయారు. ప్రస్తుతం సర్దార్పుర నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. జాట్లు, బిష్ణోయ్లు, రాజ్పూత్లు, బ్రాహ్మణులు, ఓస్వాల్ జైన్లతోపాటు సొంత సామాజికవర్గానికి చెందిన మాలిల మద్దతునూ గహ్లోత్ కోల్పోయారు.
- 2019లో తన కుమారుడు వైభవ్ గహ్లోత్ను జోధ్పుర్ నుంచి అశోక్ గహ్లోత్ పోటీకి నిలిపారు. అప్పట్లో ఆయన ఓడిపోయారు. ఆయనపై కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ శెఖావత్ 2 లక్షలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. దీంతో జోధ్పుర్ తనను ఆదరించడంలేదని అశోక్ గహ్లోత్ అర్థం చేసుకున్నారు. దీంతో పోటీకి నిరాకరించారు.
- ఈసారి జాలోర్-సిరోహీ నుంచి వైభవ్ గహ్లోత్ పోటీ చేస్తున్నారు. అక్కడ రాజ్పూత్లు, బిష్ణోయ్లు, మాలి, అంజనా చౌధరి, పటేల్ సామాజిక వర్గాలతోపాటు గిరిజనులు అధికంగా ఉన్నారు.
- వైభవ్ ప్రత్యర్థి లింబా రామ్ అంజనా వర్గానికి చెందినవారు. 2014, 2019లో ఇక్కడి నుంచి భాజపా తరఫున దేవ్జీ పటేల్ గెలిచారు. గతంలో ఇక్కడి నుంచి బూటా సింగ్, బంగారు లక్ష్మణ్ విజయం సాధించారు.
- జాలోర్-సిరోహీలో వైభవ్ లాంఛన అభ్యర్థే. మొత్తం భారమంతా అశోక్ గహ్లోత్పైనే ఉంది. ఆయనకే ఇది ప్రతిష్ఠాత్మకం. తొలి విడతలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో అశోక్ గహ్లోత్ ప్రచారం నిర్వహించారు. అయితే గెలిచే అవకాశముందనుకున్న వాటికే ఆయన వెళ్లారు.
- తన కుమారుడికి మద్దతు ఇవ్వాలని గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే జాలోర్ ప్రజలను అశోక్ అభ్యర్థిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరిస్తానని వైభవ్ హామీ ఇస్తున్నారు.
- జాలోర్లో వైభవ్కు పెద్దగా మద్దతు లభించడం లేదు. ఈసారి ఆయన ఓడిపోతే రాజకీయ జీవితం ముగిసిపోయినట్లే. మరోవైపు లింబా రామ్ స్థానికుడిగా మంచి పట్టు కలిగి ఉన్నారు. దీంతో అద్భుతం జరగాలని అశోక్ గహ్లోత్ కోరుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM