కన్నడనాట తెలుగు ‘ముద్ర’!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు.
కీలక ఓటు బ్యాంకుగా గుర్తింపు
18 స్థానాల్లో ప్రభావితం
ఈనాడు, బెంగళూరు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో తెలుగు ప్రజల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ప్రజలు శాసించగలరు. ఈ ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఆంధ్ర, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి మరీ ప్రచారం చేయిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ అదే కొనసాగుతోంది.
ఆధిక్యానికి అడ్డుకట్ట
2019 ఎన్నికలను పరిశీలిస్తే 50వేల లోపు ఆధిక్యంలో గెలిచిన మూడు స్థానాలు చామరాజనగర (1,817) కొప్పళ (8,397), తుమకూరు (13,339) కాగా.. వీటిలో రెండింట తెలుగు ఓటర్ల ప్రభావం అధికం. 50వేల నుంచి లక్ష లోపు ఆధిక్యంతో గెలిచిన నాలుగు స్థానాల్లో బళ్లారి (55,707), బెంగళూరు కేంద్రం (70,968) చిత్రదుర్గ (80,178), కలబురగిలలో (95,452) మూడు స్థానాలు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నవే. లక్ష నుంచి రెండు లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ ఎక్కువగా తెలుగు ఓటర్ల ప్రభావాన్ని నేతలు గుర్తించారు. కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే స్థానాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. వివిధ పార్టీలు తెలుగు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రముఖులతో ప్రచారాలు చేయించి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేలలోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం, గెలవటం తెలుగు ఓటర్ల ప్రభావంతోనేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ ఉత్సాహం
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు ఓటర్లకు స్థానిక రాజకీయాలపై ఉత్సాహం పెరగడం గమనార్హం. ఇక్కడి తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చినవారే. జాతీయ రాజకీయాల్లో చోటు చేసుకునే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్లుగా స్పందిస్తుంటారు. ఐటీ నగరం బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. కోలారు, తుమకూరు, బీదర్, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్ ప్రాంతాల్లోని తెలుగువారు ఇక్కడి రాజకీయాలతో మమేకమై ఉంటారు. ఐదేళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు ఏడు కోట్లకు చేరిన జనాభాలో కనీసం కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని అంచనా. గతేడాది సెప్టెంబరులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాది మంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు తదితర జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్యపరుస్తూ ఉన్నారు. వీరి అభిమానాన్ని గుర్తించిన చంద్రబాబు గతేడాది డిసెంబరులో బెంగళూరులో తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ నెల 26న పోలింగ్ జరిగేవి: తుమకూరు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపుర, బెంగళూరు దక్షిణ, బెంగళూరు కేంద్ర, ఉత్తర, గ్రామీణం, కోలారు.
తెలుగు ఓటర్ల ప్రభావిత ప్రాంతాలు
మే 7న పోలింగ్ జరిగేవి: బళ్లారి, కొప్పళ, రాయచూరు, కలబురగి, బీదర్, విజయపుర
ఆంధ్రప్రదేశ్ ప్రభావం
ఈనెల 26న రాష్ట్రంలోని 14 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా ఇందులో కనీసం 8 చోట్ల తెలుగు ఓటర్లు ప్రభావం చూపుతారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి స్ఫూర్తి పొందడం ఖాయంగా కనిపిస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీయేతో సన్నిహితంగా ఉన్న కారణంగా ఆ పార్టీ అధినేత పిలుపును ఇక్కడి తెలుగు ప్రజలు అందిపుచ్చుకునే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఎన్డీయేలో భాగస్వామిగా మారిన జేడీఎస్తో టీడీపీ అధినేత చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండటం ఈ కూటమి అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగలదని బెంగళూరు తెదేపా ఫోరం సమన్వయకర్త శ్రీకాంత్ వివరించారు. కేవలం తొలి విడత ఎన్నికలే కాదు మలి విడత ఎన్నికల్లోనూ తెలుగు రాష్ట్రాల రాజకీయాల ప్రభావం ఇక్కడి తెలుగు ఓటర్లను ప్రభావితం చేయగలదని అంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM