పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగం ఎలా?
ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ అధికారులు, పోలీసులు, వీడియోగ్రాఫర్లు తదితరులు పోస్టల్ బ్యాలట్ను ఎక్కడ, ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం అందుకు విధి, విధానాలను విడుదల చేసింది.
విధి, విధానాలను విడుదల చేసిన సీఈఓ కార్యాలయం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఎన్నికల విధులు నిర్వర్తించే పోలింగ్ అధికారులు, పోలీసులు, వీడియోగ్రాఫర్లు తదితరులు పోస్టల్ బ్యాలట్ను ఎక్కడ, ఎలా వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయం శుక్రవారం అందుకు విధి, విధానాలను విడుదల చేసింది.
అర్హులు:
- ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు.
- ఓటరు జాబితాలో సర్వీస్ ఓటరుగా నమోదైన వివిధ సైనిక దళాల సిబ్బంది.
- 40% అంగవైకల్యం కలిగినవారు.
- 85 ఏళ్లు దాటిని వయోవృద్ధులు.
- ప్రస్తుతం కొవిడ్తో బాధపడుతున్నవారు.
- అత్యవసర సేవల సిబ్బంది (రైల్వే, ఆర్టీసీ, ఫైర్, వైద్యం మొదలైనవారు).
ఓటేసే ప్రదేశం: (ఏ ఓటరు ఎక్కడ ఓటు వేయాలి)
సర్వీసు ఓటర్లు: ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ పోస్టల్ బ్యాలట్ విధానం ద్వారా ఓటు వేయవచ్చు.
ఎన్నికల సిబ్బంది, అత్యవసర సేవల సిబ్బంది: రిటర్నింగ్ అధికారి (ఆర్వో) నిర్దేశించిన తేదీల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల ఫెసిలిటేషన్ సెంటర్లలో వినియోగించుకోవచ్చు.
దివ్యాంగులు, వయోవృద్ధులు, కొవిడ్ బాధితులు: ఆర్వో ఏర్పాటు చేసిన పోలింగ్ బృందం సహకారంతో ఓటరు ఇంటి వద్దే ఓటు వినియోగించుకోవచ్చు.
విధానం: ఓటు ఉన్న పోలింగ్ స్టేషన్ (బూత్) నంబర్ ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లు క్రమ సంఖ్య తెలుసుకోవాలి. ఓటర్ కార్డు, ఇతర గుర్తింపు కార్డుతో ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు వేయవచ్చు.
ప్రతి ఓటరుకూ పోస్టల్ బ్యాలట్ పేపర్తో పాటు:
- ఫాం 13ఎ డిక్లరేషన్
- ఫాం 13బి లోపలి కవర్-ఎ (చిన్నది)
- ఫాం 13సీ వెలుపలి కవర్-బి (పెద్దది)
- ఫాం 13డి ఓటరుకు సూచనలతో కూడిన ఫాంలను ఇస్తారు.
- శాసనసభ బ్యాలట్ పత్రం ‘గులాబి’, లోక్సభ బ్యాలట్ పత్రం ‘తెలుపు’ రంగులో ఉంటాయి.
- బ్యాలట్ పత్రం మీద ఓటును ‘క్రాస్’ లేదా ‘టిక్’ రూపంలో నమోదు చేయాలి. దానిపై ఎలాంటి సంతకం, ఓటరు గుర్తింపు తెలిపే గుర్తులు రాయకూడదు.
- ‘ఫాం 13ఎ డిక్లరేషన్’ ఫాంలో బ్యాలట్ పత్రం క్రమ సంఖ్య తప్పనిసరి రాసి, ఓటరు సంతకం చేయాలి.
- ఓటరు గుర్తింపు, ‘ఫాం 13ఎ’లో ఫెసిలిటేషన్ సెంటర్ దగ్గర ఉన్న గెజిటెడ్ అధికారి తప్పనిసరిగా ధ్రువీకరించాలి.
- ఓటు నమోదు చేసిన బ్యాలట్ పత్రాన్ని ఫాం 13బి (లోపలి కవర్-ఎ)లో పెట్టి సీల్ చేయాలి. లోపలి కవర్పై నియోజకవర్గ ఆర్వో చిరునామా, పోస్టల్ బ్యాలట్ క్రమ సంఖ్య రాయాలి.
- బ్యాలట్ పత్రాన్ని సీల్ చేసి పెట్టిన ‘లోపలి కవర్-ఎ’, ‘13ఎ డిక్లరేషన్’ ఫాంను విడివిడిగా ‘ఫాం 13సి(వెలుపలి కవర్-బి)’లో పెట్టి సీల్ చేసి, సంతకం చేయాలి.
- అక్కడ ఏర్పాటు చేసిన డబ్బాలో వేయాలి.
- ఓట్ల లెక్కింపు సమయంలో వెలుపలి ‘కవర్-బి’ని తెరవగానే.. అందులో ‘కవర్-ఎ’, ‘13ఎ-ఓటరు డిక్లరేషన్’ విడివిడిగా లేకుంటే ఆ బ్యాలట్ పత్రంలోని ‘లోపలి కవర్-ఎ’ని పరిగణనలోకి తీసుకోరు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ