మిశ్రమ ఫలితాల మిథిల!
బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ 54 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.
బిహార్లోని నదీ పరివాహక ప్రాంతంలో సామాజిక సమీకరణాలే ముఖ్యం
మూడో విడతలో భాగంగా 7న 5 నియోజకవర్గాల్లో పోలింగ్
ఈనాడు ప్రత్యేక విభాగం
బిహార్ మిథిలాంచల్ ప్రాంతంలోని 5 నియోజకవర్గాల్లో మూడో విడతలో భాగంగా మే 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ 54 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఎన్నికలు ఝంఝార్పుర్, సుపౌల్, అరరియా, మధేపురా, ఖగడియాలలో జరగనున్నాయి. ఈ ప్రాంతంలో జేడీయూ, ఆర్జేడీ, లోక్ జన్శక్తి పార్టీలకు పట్టుంది. ఒకసారి ఎన్డీయే కూటమి, మరోసారి ఆర్జేడీ కూటమి గెలుస్తూ వస్తున్నాయి.
వరదలతో సతమతం
నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండటంతో ఝంఝార్పుర్, ఖగడియా నియోజకవర్గాలు ఎల్లప్పుడూ వరదలతో సతమతమవుతుంటాయి. గంగ, గండక్, బాగమతి, కమలా, బాలన్, కోసి నదులు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. నేపాల్ సరిహద్దు కూడా ఉంది.
సోషలిజం ప్రయోగశాల ఝంఝార్పుర్
మైథిలీగా పిలుచుకునే ఝంఝార్పుర్ ఏటా వరద ప్రమాదాలకు గురవుతూ ఉంటుంది. సోషలిజం ప్రయోగశాలగా ఈ నియోజకవర్గం నిలుస్తూ వస్తోంది. గతంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్ర ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జేడీయూ నేత రాంప్రీత్ మండల్ ఎన్నికయ్యారు. సిటింగ్ ఎంపీ స్థానికంగా కొంత అభివృద్ధి చేశారు. ఇక్కడి ప్రజలు వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. మూసివేసిన చక్కెర కర్మాగారాలను తెరిపించాలనే డిమాండూ ఉంది. ఈ నియోజకవర్గంలో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన వర్గాలవారే ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఇక్కడ ముక్కోణ పోటీ నెలకొంది. జేడీయూ (ఎన్డీఏ) నుంచి రాంప్రీత్ మండల్, ఇండియా కూటమిలోని వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ) నుంచి సుమన్ కుమార్ మహాసేత్ పోటీ చేస్తున్నారు. వీరిద్దరినీ ఆర్జేడీ రెబల్ నేత, బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్న గులాబ్ యాదవ్ సవాలు చేస్తున్నారు. గులాబ్ను ప్రధాన అభ్యర్థులు సీరియస్గా తీసుకోకున్నా ఆయన ఆశ్చర్యకర స్థాయిలో ఓట్లను సాధించే అవకాశముంది. గులాబ్ యాదవ్ సతీమణి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన కుమార్తె జిల్లా పరిషత్ ఛైర్పర్సన్గా గెలిచారు. ఇక్కడ ఎస్సీలు 13.5 శాతం, ముస్లింలు 13.9 శాతం, బ్రాహ్మణులు 20 శాతం ఉన్నారు. యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు అభ్యర్థులూ కోటీశ్వరులే.
మైనారిటీల అరరియా
ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట అయిన సీమాంచల్లోని అరరియాలో ఆ తర్వాతి కాలంలో జనతాదళ్, భాజపా గెలిచాయి. ఆర్జేడీ రెండు సార్లు విజయం సాధించింది. 13 లక్షలకుపైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు అధికంగా ఉంటారు. 2019లో ఇక్కడ భాజపా గెలిచింది. 2014లో ఆర్జేడీ విజయం సాధించింది. అప్పుడు భాజపా, జేడీయూ విడివిడిగా పోటీ చేశాయి. ఈసారి ఆర్జేడీ కూటమికి ఇక్కడ విజయం సాధించడం కొంత కష్టంగానే ఉంది. మళ్లీ గెలిచేందుకు భాజపా సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఈ నియోజకవర్గంలో 42.9 శాతం ముస్లింలు, 56.6శాతం హిందువులు ఉన్నారు. ముస్లింల ఓట్లు గంపగుత్తగా పడినా హిందువుల ఓట్లు కూడా వస్తేనే ఆర్జేడీ గెలిచేందుకు అవకాశముంటుంది. హిందువుల్లో యాదవులు, మండల్ల ఓట్లు అధికంగా ఉంటాయి. ఇంకా కుర్మీలు, కోయిరీలు, బ్రాహ్మణులు, భూమిహార్లు, రాజ్పూత్లు, కాయస్థలు ఉన్నారు. ఈసారి అరరియాలో భాజపా తరఫున ప్రదీప్ కుమార్, ఆర్జేడీ తరఫున మహమ్మద్ షానవాజ్ ఆలం పోటీ చేస్తున్నారు.
యాదవ్ల మధేపుర
వీఐపీ నియోజకవర్గమైన మధేపురలో గత ఎన్నికల్లో జేడీయూ నేత దినేశ్ చంద్ర యాదవ్ గెలిచారు. అప్పట్లో ఆర్జేడీ నుంచి పోటీ చేసిన శరద్ యాదవ్ ఓడిపోయారు. 2014లో ఇక్కడి నుంచి ఆర్జేడీ గెలిచింది. రోమ్ పోప్దైతే మధేపుర యాదవులది అనే నినాదం ఇక్కడ వినిపిస్తూ ఉంటుంది. యాదవులే ఇక్కడి ఫలితాన్ని నిర్ణయిస్తుంటారు. ఇక్కడి నుంచి గెలిచిన వారిలో ఒక్క బీపీ మండల్ మినహా అందరూ యాదవ్ సామాజికవర్గానికి చెందినవారే. ఇది ఆర్జేడీకి కంచుకోట. లాలూ ప్రసాద్ ఇక్కడి నుంచే గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. శరద్ యాదవ్ నాలుగు సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. యాదవ్ల తర్వాత ఇక్కడ అధికంగా ముస్లింలు, బ్రాహ్మణులు, రాజ్పూత్లు ఉన్నారు. యాదవ్లు, ముస్లింల ఓట్లతో ఇక్కడ మరోసారి గెలవాలని ఆర్జేడీ ప్రయత్నిస్తోంది. మోదీ ప్రభావంతో ఎన్డీయే జెండా ఎగురవేయాలని జేడీయూ చూస్తోంది. 4 లక్షలకుపైగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లతో జేడీయూ గతంలో ఇక్కడ గెలవగలిగింది. ఇక్కడ జేడీయూ నుంచి దినేశ్ చంద్ర యాదవ్, ఆర్జేడీ నుంచి కుమార్ చంద్రదీప్ తలపడుతున్నారు. ద్విముఖ పోటీ నెలకొంది.
వరదల ఖగడియా
వరదలతో సతమతమయ్యే మరో నియోజకవర్గం ఖగడియా. ముంగేర్ డివిజన్లోని ఈ ప్రాంతం గంగ, గండక్, బాగమతి, కమలా, కోసీ నదుల వల్ల వరదలకు గురవుతూ ఉంటుంది. ఈ ప్రాంతంలో కొండ ప్రాంతాలు లేవు. వరదలవల్ల ఇక్కడ ఖరీఫ్ పంటలు సాగుకావు. రబీలో గోధుమ సాగవుతుంది. 2019లో ఇక్కడి నుంచి లోక్ జన్శక్తి పార్టీ అభ్యర్థి చౌధరి మెహబూబ్ అలీ కౌజర్ గెలిచారు. వికాశ్శీల్ ఇన్సాన్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఇదీ యాదవుల ప్రాబల్యమున్న నియోజకవర్గమే. ఇక్కడ యాదవులు 3.5 లక్షలు, ముస్లింలు 1.5 లక్షలు, నిషద్లు 1.5 లక్షలు, కుర్మీలు, కుశ్వాహాలు 2.5 లక్షల మంది ఉన్నారు. ఇక్కడ ఎన్డీయే తరఫున ఎల్జేపీ (రాం విలాస్ పాస్వాన్) నుంచి రాజేశ్ వర్మ, ఇండియా కూటమి తరఫున సీపీఎం నుంచి సంజయ్ కుమార్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు. యాదవులు, ముస్లింలే ఇక్కడ ఫలిత నిర్ణేతలు.
రెండోసారి అవకాశమివ్వని సుపౌల్
నేపాల్ సరిహద్దులోని సుపౌల్లో ఆర్జేడీ నుంచి చంద్రహాస్ చౌపాల్, జేడీయూ నుంచి దిలేశ్వర్ కమాయిత్ బరిలో ఉన్నారు. డీలిమిటేషన్ అనంతరం 2008లో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో 2009 నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నియోజకవర్గానికి ఒకవైపు సీమాంచల్ ఉంటుంది. ఇక్కడ వరుసగా రెండోసారి ఎవరూ గెలవలేదు. అభివృద్ధి కంటే కులమే ఇక్కడ ప్రాధాన్యాంశం. వెనుకబడిన, యాదవ్ వర్గాలవారి ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఇక్కడ ఒకే పార్టీ కంటే బహుళ పార్టీలకు ప్రజలు మద్దతుగా నిలుస్తారు. గత ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. ఈసారి ఎన్నికల్లో రెండోసారి జేడీయూ అభ్యర్థిని గెలిపించి సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తారా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
పోటీలో ఉన్న అభ్యర్థులు
- ఝంఝార్పుర్: 10
- సుపౌల్: 15
- అరరియా: 9
- మధేపురా: 8
- ఖగడియా: 12
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ